Political News

మడకశిరతో కొత్త కల్చర్ కు తెర తీసిన చంద్రబాబు

ప్రభుత్వం ప్లాగ్ షిప్ గా తీసుకున్న కార్యక్రమాన్ని ఎంత భారీగా చేపడుతుందో.. అందుకు రెట్టింపు ప్రచారాన్ని కోరుకోవటం మామూలే. ఇందుకు మీడియాలో ఫుల్ పేజీ ప్రకటనలు మొదలుకొని.. కవరేజ్ కోసం ప్రత్యేకంగా విన్నపాలు ఇస్తుంటారు. ఇవి సరిపోనట్లుగా.. తాము చేపట్టే కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యేలా చేయటం.. జనసమీకరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయటం.. అందుకు లక్షలాది రూపాయిల్ని ఖర్చు చేయటం చూస్తుంటాం. అందుకు భిన్నంగా చేయాల్సిన పనిని చేసుకుంటూ పోవటం.. ప్రచార ఆర్భాటాలకు పోకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త కల్చర్ ను ఏపీకి తీసుకొస్తున్నారు.

దేశంలోని మరే రాష్ట్రాల్లో లేనట్లుగా ప్రభుత్వ కార్యక్రమాలకు.. చేపట్టే సంక్షేమ పథకాలకు భారీ ఎత్తున ప్రచారం చేసుకునే విషయంలో తెలుగు రాష్ట్రాలు ముందు ఉంటాయన్న పేరుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. తాను అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసే సంక్షేమ పథకాల విషయంలో లోటుపాట్లు చోటు చేసుకుంటాయన్న చెడ్డపేరును ఈసారి పూర్తిగా పోగొట్టేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చంద్రబాబు. ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని నెల మొదటి రోజునే పూర్తి చేయటం.. దానికి సంబంధించిన గణాంకాల్ని ప్రముఖంగా ప్రకటించటం లాంటివి చేస్తున్నారు.

అదే సమయంలో తాను కూడా ఏదో ఒక ప్రాంతంలో సదరు కార్యక్రమంలో పాల్గొనటం చూస్తున్నాం. ఈ ఆగస్టు మొదటి తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర (శ్రీ సత్యసాయి జిల్లా)కు చంద్రబాబు వెళ్లారు. అక్కడి గుండుమల గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫించన్ల పంపిణీని చేపట్టారు. సాధారణంగా.. ఇలాంటి కార్యక్రమాల్ని భారీగా ఏర్పాటు చేయటం.. వేలాది మందిని సభకు రప్పించటం.. ఆ బల ప్రదర్శనను టీవీ ఛానళ్లలో.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయటం.. ఇక.. గంభీరమైన ప్రసంగాలు ఇస్తూ ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం చేస్తుంటారు.

వీటన్నింటికి భిన్నంగా గ్రామంలోని కొన్ని ప్రాంతాల్ని కాలి నడకన నడవటం.. కొందరికి పింఛన్లను స్వయంగా అందజేయటంతో పాటు.. వారి యోగక్షేమాల గురించి ఆరా తీయటం చేశారు. చిన్న గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎలాంటి బారికేడ్లు లేకుండా.. ప్రజల మధ్యలోకి వెళ్లట.. వారిలో కలుపుగోలుగా మాట్లాడటం చేశారు. అంతేకాదు.. వేరే గ్రామాల నుంచి జన సమీకరణ లాంటివి చేయకుండా సాదాసీదాగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనవసర ఆర్భాటాలకు పోయే కన్నా.. అవసరానికి తగ్గట్లుగా వ్యవహరించి అందరి మనసుల్ని గెలుచుకున్నారు. ఈ తరహా రాజకీయమే ఏపీకి అవసరమన్న మాట వినిపిస్తోంది. వాపు కన్నా బలుపు ముఖ్యం. భారీగా జనాల్ని తీసుకొచ్చి హడావుడి చేసే కన్నా.. జనం మధ్యలో ఉంటూ వారి మనసుల్ని దోచుకోవటమే బెటర్ అన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా కొత్త తరహాలో సీఎం చంద్రబాబు ముందుకు వెళుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on August 3, 2024 2:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

1 hour ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

10 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

13 hours ago