గన్నవరం టీడీపీ కార్యాలయం పై వల్లభనేని వంశీ ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ కేసులో వల్లభనేని వంశీనీ పోలీసులు అరెస్టు చేశారని ప్రచారం జరిగింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్న వంశీ కారును పోలీసులు వెంబడించి ఆయనను అదుపులోకి తీసుకున్నారని పలు మీడియా చానెళ్లలో వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఆ ప్రచారంపై పోలీసులు క్లారిటీనిచ్చారు. వంశీని అరెస్టు చేయలేదని వారు చెప్పారు. అయితే, వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరో అనుచరుడు రమేశ్ ను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా వంశీ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. వంశీ అరెస్ట్ ను అఫీషియల్ గా ప్రకటిస్తే అవాంఛనీయ ఘటనలు, గొడవలు అవకాశం ఉందన్న నేపథ్యంలోనే పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని తెలుస్తోంది.
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తించారని ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్నామన్న అహంకారంతో టిడిపి కార్యాలయం ధ్వంసం కేసు మాత్రమే కాకుండా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లపై కూడా గతంలో వల్లభనేని వంశీ నోరు పారేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఇక, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై కూడా వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ రావడం తెలిసిందే.
This post was last modified on August 3, 2024 9:35 am
కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ…
ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై…
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని…
మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…
భారత్-పాకిస్థాన్ ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఏ క్షణమైనా యుద్ధానికి దారితీయొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతు న్న సమయంలో…