గన్నవరం టీడీపీ కార్యాలయం పై వల్లభనేని వంశీ ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ కేసులో వల్లభనేని వంశీనీ పోలీసులు అరెస్టు చేశారని ప్రచారం జరిగింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్న వంశీ కారును పోలీసులు వెంబడించి ఆయనను అదుపులోకి తీసుకున్నారని పలు మీడియా చానెళ్లలో వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఆ ప్రచారంపై పోలీసులు క్లారిటీనిచ్చారు. వంశీని అరెస్టు చేయలేదని వారు చెప్పారు. అయితే, వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరో అనుచరుడు రమేశ్ ను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా వంశీ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. వంశీ అరెస్ట్ ను అఫీషియల్ గా ప్రకటిస్తే అవాంఛనీయ ఘటనలు, గొడవలు అవకాశం ఉందన్న నేపథ్యంలోనే పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని తెలుస్తోంది.
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తించారని ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్నామన్న అహంకారంతో టిడిపి కార్యాలయం ధ్వంసం కేసు మాత్రమే కాకుండా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లపై కూడా గతంలో వల్లభనేని వంశీ నోరు పారేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఇక, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై కూడా వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ రావడం తెలిసిందే.
This post was last modified on August 3, 2024 9:35 am
తమిళనాడు రాజకీయాల్లో యువ నాయకత్వానికి కొత్త గుర్తింపుగా నిలిచిన టీవీకే నేత ఎస్. కీర్తన సంపత్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన విశ్వనాథ్ అండ్ సన్స్ కు ముందు…
హీరోగా అవకాశాలు ఆగిపోయిన టైంలో ‘లెజెండ్’ సినిమాతో విలన్ అవతారం ఎత్తారు సీనియర్ నటుడు జగపతిబాబు. దీంతో ఓవర్ నైట్…
తమిళ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న రాజకీయ సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతును టీవీకే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాటి హైదరాబాద్ పర్యటన సాంతం ఆసక్తికరంగానే సాగింది. తెలంగాణ పర్యటనకు వచ్చిన మోదీ……
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాటి తన హైదరాబాద్ పర్యటనలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా…