గన్నవరం టీడీపీ కార్యాలయం పై వల్లభనేని వంశీ ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ కేసులో వల్లభనేని వంశీనీ పోలీసులు అరెస్టు చేశారని ప్రచారం జరిగింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్న వంశీ కారును పోలీసులు వెంబడించి ఆయనను అదుపులోకి తీసుకున్నారని పలు మీడియా చానెళ్లలో వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఆ ప్రచారంపై పోలీసులు క్లారిటీనిచ్చారు. వంశీని అరెస్టు చేయలేదని వారు చెప్పారు. అయితే, వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరో అనుచరుడు రమేశ్ ను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా వంశీ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. వంశీ అరెస్ట్ ను అఫీషియల్ గా ప్రకటిస్తే అవాంఛనీయ ఘటనలు, గొడవలు అవకాశం ఉందన్న నేపథ్యంలోనే పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని తెలుస్తోంది.
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తించారని ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్నామన్న అహంకారంతో టిడిపి కార్యాలయం ధ్వంసం కేసు మాత్రమే కాకుండా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లపై కూడా గతంలో వల్లభనేని వంశీ నోరు పారేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఇక, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై కూడా వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ రావడం తెలిసిందే.
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…