ఉమ్మడి పాలమూరు జిల్లా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గత నెల 6 వ తేదీన బీఆర్ఎస్ పార్టీని వీడి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. తనకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని గత నెల 30న శాసనసభలో బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్ ను కలిసి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని చెప్పాడు.
దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది. మరో ఇద్దరు, ముగ్గురు కూడా వెనక్కి వెళ్లిపోతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలతో మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో రేవంత్ భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు సమావేశమై అందరు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు.
తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్లు చెప్పిన గద్వాల ఎమ్మెల్యే బండ్లతో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయన ఇంటికి వెళ్లి భేటీ అయ్యాడు. కాంగ్రెస్ లోనే కొనసాగాలని సముదాయించడంతో ఈ రోజు హైదరాబాద్ లోని రేవంత్ నివాసానికి ఈ రోజు బండ్ల వెళ్లి భేటీకావడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీలతో పాటు ముఖ్యంగా గద్వాల నియోజకవర్గంలో పక్క నియోజకవర్గాల వారు పెత్తనం చేయవద్దని, భవిష్యత్తులో వారికి ఇక్కడ పోటీకి అవకాశం ఇవ్వవద్దన్న ప్రధాన డిమాండ్ సీఎం వద్ద ఉంచినట్లు ప్రచారం జరుగుతున్నది. మరి బండ్ల డిమాండ్లు ఈసారైనా నెరవేరతాయా ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే బండ్ల ఇలా ఊగిసలాడటంతో నియోజకవర్గంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
This post was last modified on August 2, 2024 2:27 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…