ఉమ్మడి పాలమూరు జిల్లా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గత నెల 6 వ తేదీన బీఆర్ఎస్ పార్టీని వీడి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. తనకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని గత నెల 30న శాసనసభలో బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్ ను కలిసి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని చెప్పాడు.
దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది. మరో ఇద్దరు, ముగ్గురు కూడా వెనక్కి వెళ్లిపోతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలతో మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో రేవంత్ భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు సమావేశమై అందరు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు.
తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్లు చెప్పిన గద్వాల ఎమ్మెల్యే బండ్లతో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయన ఇంటికి వెళ్లి భేటీ అయ్యాడు. కాంగ్రెస్ లోనే కొనసాగాలని సముదాయించడంతో ఈ రోజు హైదరాబాద్ లోని రేవంత్ నివాసానికి ఈ రోజు బండ్ల వెళ్లి భేటీకావడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీలతో పాటు ముఖ్యంగా గద్వాల నియోజకవర్గంలో పక్క నియోజకవర్గాల వారు పెత్తనం చేయవద్దని, భవిష్యత్తులో వారికి ఇక్కడ పోటీకి అవకాశం ఇవ్వవద్దన్న ప్రధాన డిమాండ్ సీఎం వద్ద ఉంచినట్లు ప్రచారం జరుగుతున్నది. మరి బండ్ల డిమాండ్లు ఈసారైనా నెరవేరతాయా ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే బండ్ల ఇలా ఊగిసలాడటంతో నియోజకవర్గంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
This post was last modified on August 2, 2024 2:27 pm
ఆగస్ట్ 26 విడుదల కాబోతున్న టాక్సిక్ ఏపీ తెలంగాణలోనూ పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది. బడా సంస్థ పంపిణి హక్కులు…
సందీప్ కిషన్.. హిట్లు ఫ్లాపుల కంటే ముందుగా గుర్తొచ్చేది ఈ హీరో చేసే ప్రయోగాలు. 16 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నా…
భారతదేశంలో మరణశిక్ష అమలు విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఉరి తీయడానికి బదులుగా ప్రాణాలు తీసేందుకు తక్కువ నొప్పిని…
2014 ఎన్నికలకు ముందు అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలలో దళితులకు 3 ఎకరాల భూమి హామీ ఒకటి.…
టీడీపీ నేతృత్వంలో జనసేన, బీజేపీలు కలిసి ఏపీలో ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలకు ముందు ఈ…
వెంకీ అట్లూరి.. ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు సౌత్ ఇండియా అంతటా చర్చనీయాంశం అవుతున్న పేరు. సార్, లక్కీ భాస్కర్, విశ్వనాథ్ అండ్ సన్స్…