ఉమ్మడి పాలమూరు జిల్లా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గత నెల 6 వ తేదీన బీఆర్ఎస్ పార్టీని వీడి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. తనకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని గత నెల 30న శాసనసభలో బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్ ను కలిసి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని చెప్పాడు.
దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది. మరో ఇద్దరు, ముగ్గురు కూడా వెనక్కి వెళ్లిపోతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలతో మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో రేవంత్ భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు సమావేశమై అందరు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు.
తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్లు చెప్పిన గద్వాల ఎమ్మెల్యే బండ్లతో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయన ఇంటికి వెళ్లి భేటీ అయ్యాడు. కాంగ్రెస్ లోనే కొనసాగాలని సముదాయించడంతో ఈ రోజు హైదరాబాద్ లోని రేవంత్ నివాసానికి ఈ రోజు బండ్ల వెళ్లి భేటీకావడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీలతో పాటు ముఖ్యంగా గద్వాల నియోజకవర్గంలో పక్క నియోజకవర్గాల వారు పెత్తనం చేయవద్దని, భవిష్యత్తులో వారికి ఇక్కడ పోటీకి అవకాశం ఇవ్వవద్దన్న ప్రధాన డిమాండ్ సీఎం వద్ద ఉంచినట్లు ప్రచారం జరుగుతున్నది. మరి బండ్ల డిమాండ్లు ఈసారైనా నెరవేరతాయా ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే బండ్ల ఇలా ఊగిసలాడటంతో నియోజకవర్గంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
This post was last modified on August 2, 2024 2:27 pm
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…