Political News

విశాఖ విచిత్రం – రామురామంటున్నారు ఆ ఇద్దరు !

వినటానికి విచిత్రంగానే ఉన్న పార్టీలోనే ఈ చర్చ జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో జిల్లా మొత్తం మీద టిడిపి గెలిచింది వైజాగ్ నగరంలో మాత్రమే. నగరంలోని నాలుగు సీట్లనూ తెలుగుదేశంపార్టీ గెలిచింది. అంటే నగరంలో పట్టున్నట్లు తమ్ముళ్ళు నిరూపించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.

అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల తర్వాత రాజకీయంగా టిడిపిలో చాలా మార్పులొచ్చేశాయి. ఇందులో భాగంగానే ఉత్తరాంధ్రలో కూడా పార్టీ నేతల్లో చీలిక వచ్చేసింది. దీని పర్యవసానమే ఈమధ్యనే విశాఖనగరంలోని దక్షణి ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ పార్టీకి రాజీనామా చేసి వైసిపిలో చేరిపోయాడు.

వాసుపల్లి వైసిపిలోకి వెళ్ళిపోయినా లెక్క ప్రకారం ఇంకా ముగ్గురు ఎంఎల్ఏలుండాలి. ఇక్కడే సమస్యలు మొదలైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబునాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే వైజాగ్ ను రాజధాని చేస్తానని జగన్ అంటుంటే చంద్రబాబు వ్యతిరేకించటాన్నే చాలామంది నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకనే జగన్ ప్రకటనను వ్యతిరేకించాలని చంద్రబాబు ఎన్నిసార్లు ఆదేశించినా ఎంఎల్ఏలు, నేతలు పట్టించుకోలేదు.

రాజధాని విషయమై చంద్రబాబు ఎన్నిసార్లు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించినా నగరంలోని నలుగురు ఎంఎల్ఏల్లో తూర్పు ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణ తప్ప ఇంకెవరు స్పందించటం లేదు. పైగా మిగిలిన ముగ్గురు అసలు వీడియో కాన్ఫరెన్సులకు కూడా హాజరుకావటం లేదు. ఈ నేపధ్యంలోనే వాసుపల్లి పార్టీని వీడారు. రాజీనామా చేశాను. అనర్హత వేటు వేయించుకోండన్నారు. అంటే ఇక మిగిలింది ముగ్గురు ఎంఎల్ఏలు మాత్రమే. అయితే వాసుపల్లి పార్టీని వదిలేసిన తర్వాత మూడుసార్లు చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్సు నిర్వహిస్తే వెలగపూడి తప్ప మిగిలిన ఎంఎల్ఏలు గంటా, గణబాబు హాజరుకాలేదట.

అంటే అధికారికంగా వాసుపల్లి టిడిపికి రాజీనామా చేశారు సరే మరి పై ఇద్దరు ఎంఎల్ఏలు చంద్రబాబు వీడియో కాన్ఫరెన్సులో ఎందుకు పార్టిసిపేట్ చేయటంలేదో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇదే విషయాన్ని వాకబు చేయటానికి ఎన్టీయార్ ట్రస్టు భవన్ బాధ్యులు ప్రయత్నం చేసినా ఉపయోగం లేదని సమాచారం. దాంతో టిడిపి తరపున గెలిచిన నలుగురు ఎంఎల్ఏల్లో చివరకు మిగిలింది ఒక్క ఎంఎల్ఏ వెలగపూడి మాత్రమే అని పార్టీలోనే చర్చ జరుగుతోంది.

This post was last modified on September 26, 2020 9:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

22 minutes ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

2 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

2 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

4 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

4 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

5 hours ago