Political News

కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా తెలంగాణ !

తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత పదేళ్లలో దేశంలో కాంగ్రెస్ పార్టీని, ఆయా రాష్ట్రాలలో కొన్ని పార్టీలను బలహీనపర్చేందుకు బీజేపీ అనేక రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.

అయితే అన్ని చోట్లా బీజేపీ 2/3 ఫార్ములా ప్రకారం చేర్చుకుని ఆయా పార్టీల చేరికల మీద అనర్హత వేటు పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. మహారాష్ట్ర మినహా ఎక్కడా బీజేపీకి ఈ విషయంలో ఇబ్బందులు కలగలేదు. ఈ నేపథ్యంలో గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడాన్ని తప్పుపడుతూ వస్తుంది. అధికారంలోకి వస్తే పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేసే విషయంలో కొత్త చట్టం తెస్తామని ఏకంగా పార్టీ మేనిఫెస్టోలో చెప్పారు. అనేక వేదికల మీద రాహుల్ గాంధీ ఈ విషయాన్ని చెప్పాడు.

తెలంగాణలో ఎమ్మెల్యేల చేరికల విషయానికి వస్తే బీఆర్ఎస్ నుండి 26 మంది ఎమ్మెల్యేలు చేరితేనే ఆ పార్టీ ఎల్పీ విలీనం అవుతుంది. ఖచ్చితంగా 26 మంది చేరుతారని రేవంత్ రెడ్డి చేరికల వ్యవహారాన్ని ప్రారంభించాడు. కానీ ఇప్పటి వరకు 10 మంది మాత్రమే చేరారు. అందులో ఒకరు వెనక్కి పోయారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఈ అంశం మీద ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో 26 మంది చేరికల వ్యవహారాన్ని ముగించాలని, ఈ విషయంలో ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పే పరిస్థితి లేదని సీఎం రేవంత్ మీద వత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

ఈ చేరికల విషయం గురించి ఢిల్లీ నుండి కాంగ్రెస్ సీనియర్లు అయిన మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ తదితరులను అడిగితే అసలు ఎవరు చేరుతున్నారో మాకు తెలియదని, ఆ విషయంలో తమను ఎవరూ సంప్రదించలేదని చేరికల వ్యవహారం అంతా రేవంత్ మీద నెడుతుండడంతో రేవంత్ తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే చేరిన ఎమ్మెల్యేల అంశ కోర్టు పరిధిలోకి వెళ్లింది. కొత్తగా చేరే వారు కొంత వెనకా ముందు అవుతున్న నేపథ్యంలో 26 మంది ఎప్పుడు చేరతారు ? ఎప్పుడు ఎల్పీ విలీనం అవుతుంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ చేరికల వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి.

This post was last modified on July 31, 2024 11:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago