Political News

కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా తెలంగాణ !

తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత పదేళ్లలో దేశంలో కాంగ్రెస్ పార్టీని, ఆయా రాష్ట్రాలలో కొన్ని పార్టీలను బలహీనపర్చేందుకు బీజేపీ అనేక రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.

అయితే అన్ని చోట్లా బీజేపీ 2/3 ఫార్ములా ప్రకారం చేర్చుకుని ఆయా పార్టీల చేరికల మీద అనర్హత వేటు పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. మహారాష్ట్ర మినహా ఎక్కడా బీజేపీకి ఈ విషయంలో ఇబ్బందులు కలగలేదు. ఈ నేపథ్యంలో గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడాన్ని తప్పుపడుతూ వస్తుంది. అధికారంలోకి వస్తే పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేసే విషయంలో కొత్త చట్టం తెస్తామని ఏకంగా పార్టీ మేనిఫెస్టోలో చెప్పారు. అనేక వేదికల మీద రాహుల్ గాంధీ ఈ విషయాన్ని చెప్పాడు.

తెలంగాణలో ఎమ్మెల్యేల చేరికల విషయానికి వస్తే బీఆర్ఎస్ నుండి 26 మంది ఎమ్మెల్యేలు చేరితేనే ఆ పార్టీ ఎల్పీ విలీనం అవుతుంది. ఖచ్చితంగా 26 మంది చేరుతారని రేవంత్ రెడ్డి చేరికల వ్యవహారాన్ని ప్రారంభించాడు. కానీ ఇప్పటి వరకు 10 మంది మాత్రమే చేరారు. అందులో ఒకరు వెనక్కి పోయారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఈ అంశం మీద ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో 26 మంది చేరికల వ్యవహారాన్ని ముగించాలని, ఈ విషయంలో ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పే పరిస్థితి లేదని సీఎం రేవంత్ మీద వత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

ఈ చేరికల విషయం గురించి ఢిల్లీ నుండి కాంగ్రెస్ సీనియర్లు అయిన మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ తదితరులను అడిగితే అసలు ఎవరు చేరుతున్నారో మాకు తెలియదని, ఆ విషయంలో తమను ఎవరూ సంప్రదించలేదని చేరికల వ్యవహారం అంతా రేవంత్ మీద నెడుతుండడంతో రేవంత్ తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే చేరిన ఎమ్మెల్యేల అంశ కోర్టు పరిధిలోకి వెళ్లింది. కొత్తగా చేరే వారు కొంత వెనకా ముందు అవుతున్న నేపథ్యంలో 26 మంది ఎప్పుడు చేరతారు ? ఎప్పుడు ఎల్పీ విలీనం అవుతుంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ చేరికల వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

8 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

14 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

28 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago