తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత పదేళ్లలో దేశంలో కాంగ్రెస్ పార్టీని, ఆయా రాష్ట్రాలలో కొన్ని పార్టీలను బలహీనపర్చేందుకు బీజేపీ అనేక రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.
అయితే అన్ని చోట్లా బీజేపీ 2/3 ఫార్ములా ప్రకారం చేర్చుకుని ఆయా పార్టీల చేరికల మీద అనర్హత వేటు పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. మహారాష్ట్ర మినహా ఎక్కడా బీజేపీకి ఈ విషయంలో ఇబ్బందులు కలగలేదు. ఈ నేపథ్యంలో గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడాన్ని తప్పుపడుతూ వస్తుంది. అధికారంలోకి వస్తే పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేసే విషయంలో కొత్త చట్టం తెస్తామని ఏకంగా పార్టీ మేనిఫెస్టోలో చెప్పారు. అనేక వేదికల మీద రాహుల్ గాంధీ ఈ విషయాన్ని చెప్పాడు.
తెలంగాణలో ఎమ్మెల్యేల చేరికల విషయానికి వస్తే బీఆర్ఎస్ నుండి 26 మంది ఎమ్మెల్యేలు చేరితేనే ఆ పార్టీ ఎల్పీ విలీనం అవుతుంది. ఖచ్చితంగా 26 మంది చేరుతారని రేవంత్ రెడ్డి చేరికల వ్యవహారాన్ని ప్రారంభించాడు. కానీ ఇప్పటి వరకు 10 మంది మాత్రమే చేరారు. అందులో ఒకరు వెనక్కి పోయారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఈ అంశం మీద ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో 26 మంది చేరికల వ్యవహారాన్ని ముగించాలని, ఈ విషయంలో ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పే పరిస్థితి లేదని సీఎం రేవంత్ మీద వత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ఈ చేరికల విషయం గురించి ఢిల్లీ నుండి కాంగ్రెస్ సీనియర్లు అయిన మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ తదితరులను అడిగితే అసలు ఎవరు చేరుతున్నారో మాకు తెలియదని, ఆ విషయంలో తమను ఎవరూ సంప్రదించలేదని చేరికల వ్యవహారం అంతా రేవంత్ మీద నెడుతుండడంతో రేవంత్ తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే చేరిన ఎమ్మెల్యేల అంశ కోర్టు పరిధిలోకి వెళ్లింది. కొత్తగా చేరే వారు కొంత వెనకా ముందు అవుతున్న నేపథ్యంలో 26 మంది ఎప్పుడు చేరతారు ? ఎప్పుడు ఎల్పీ విలీనం అవుతుంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ చేరికల వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి.
This post was last modified on July 31, 2024 11:22 am
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…