తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత పదేళ్లలో దేశంలో కాంగ్రెస్ పార్టీని, ఆయా రాష్ట్రాలలో కొన్ని పార్టీలను బలహీనపర్చేందుకు బీజేపీ అనేక రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.
అయితే అన్ని చోట్లా బీజేపీ 2/3 ఫార్ములా ప్రకారం చేర్చుకుని ఆయా పార్టీల చేరికల మీద అనర్హత వేటు పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. మహారాష్ట్ర మినహా ఎక్కడా బీజేపీకి ఈ విషయంలో ఇబ్బందులు కలగలేదు. ఈ నేపథ్యంలో గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడాన్ని తప్పుపడుతూ వస్తుంది. అధికారంలోకి వస్తే పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేసే విషయంలో కొత్త చట్టం తెస్తామని ఏకంగా పార్టీ మేనిఫెస్టోలో చెప్పారు. అనేక వేదికల మీద రాహుల్ గాంధీ ఈ విషయాన్ని చెప్పాడు.
తెలంగాణలో ఎమ్మెల్యేల చేరికల విషయానికి వస్తే బీఆర్ఎస్ నుండి 26 మంది ఎమ్మెల్యేలు చేరితేనే ఆ పార్టీ ఎల్పీ విలీనం అవుతుంది. ఖచ్చితంగా 26 మంది చేరుతారని రేవంత్ రెడ్డి చేరికల వ్యవహారాన్ని ప్రారంభించాడు. కానీ ఇప్పటి వరకు 10 మంది మాత్రమే చేరారు. అందులో ఒకరు వెనక్కి పోయారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఈ అంశం మీద ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో 26 మంది చేరికల వ్యవహారాన్ని ముగించాలని, ఈ విషయంలో ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పే పరిస్థితి లేదని సీఎం రేవంత్ మీద వత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ఈ చేరికల విషయం గురించి ఢిల్లీ నుండి కాంగ్రెస్ సీనియర్లు అయిన మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ తదితరులను అడిగితే అసలు ఎవరు చేరుతున్నారో మాకు తెలియదని, ఆ విషయంలో తమను ఎవరూ సంప్రదించలేదని చేరికల వ్యవహారం అంతా రేవంత్ మీద నెడుతుండడంతో రేవంత్ తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే చేరిన ఎమ్మెల్యేల అంశ కోర్టు పరిధిలోకి వెళ్లింది. కొత్తగా చేరే వారు కొంత వెనకా ముందు అవుతున్న నేపథ్యంలో 26 మంది ఎప్పుడు చేరతారు ? ఎప్పుడు ఎల్పీ విలీనం అవుతుంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ చేరికల వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి.
This post was last modified on July 31, 2024 11:22 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…