ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై వైసీపీ హయాంలో పలు కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు.. ఆయన హైదరాబాద్ నుంచి వస్తుండగా ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. అయితే, రివర్స్లో ఆయనపైనే విధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టారు.
అదేవిధంగా విశాఖలో హోటల్లో నిర్బంధించిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా.. పవన్ తమ విధులను అడ్డుకున్నారని మరో కేసు పెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కాకినాడలో గత ఏడాది ప్రారంభంలో నిర్వహించిన వారాహి యాత్ర సందర్భంగా వలంటీర్లపై విమర్శలు చేశారు. మహిళలు కనిపించకుండా పోవడం వెనుక వలంటీర్లు ఉన్నారని ఆయన ఆరోపిం చారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వలంటీర్లు పవన్పై ఫిర్యాదు చేయడంతో అనంతపురం, కాకినాడ, గుంటూరు, విజయనగ రం, కర్నూలు జిల్లాల్లోని పలు పోలీసు స్టేషన్లలో పవన్ కల్యాణ్పై కేసులు నమోదు చేశారు. వీటిలో కొన్నింటిని గుంటూరు స్థానిక కోర్టు విచారణకు స్వీకరించింది.
గతంలో రెండు సార్లు విచారణ చేసి.. పవన్కు నోటీసులు కూడా జారీ చేసింది. ఇంతలో సర్కారు మారిపోయింది. తాజాగా మరోసారి ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే.. ప్రభుత్వం మారిపోయిన దరిమిలా.. పవన్ కల్యాణ్పై గతంలో నమోదైన కేసులను సర్కారు వెనక్కి తీసుకుంటోందని.. దీనికి సంబంధించి హైకోర్టులో విచారణ పెండింగులో ఉందని న్యాయవాదులు తెలిపారు.
పవన్ కల్యాణ్తో పాటు పలువురిపై నమోదైన కేసులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు క్వాష్ పిటిషన్ దాఖలు చేసినట్టు న్యాయవాదులు గుంటూరు కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన పత్రాలను కూడా సమర్పించారు. వీటిని పరిశీలించినకోర్టు హైకోర్టు అభిప్రాయం పరిగణనలోకి తీసుకుని.. తదుపరి ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది.
ఈ క్రమంలో కేసును పవన్ కల్యాణ్పై నమోదైన కేసుల విచారణను వాయిదా వేయాలని న్యాయ వాదులు కోరారు. దీనికి న్యాయాధికారి అంగీకరించారు. హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఈ కేసులను వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు మూడు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
This post was last modified on July 30, 2024 10:31 pm
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…