Political News

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ పై కేసులు.. కోర్టు ఏమందంటే!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై వైసీపీ హ‌యాంలో ప‌లు కేసులు న‌మోద‌య్యాయి. చంద్ర‌బాబు జైల్లో ఉన్న‌ప్పుడు.. ఆయ‌న హైద‌రాబాద్ నుంచి వ‌స్తుండ‌గా ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. అయితే, రివ‌ర్స్‌లో ఆయ‌న‌పైనే విధుల‌కు ఆటంకం క‌లిగించార‌ని కేసు పెట్టారు.

అదేవిధంగా విశాఖ‌లో హోట‌ల్‌లో నిర్బంధించిన విష‌యం తెలిసిందే. అప్పుడు కూడా.. ప‌వ‌న్ త‌మ విధుల‌ను అడ్డుకున్నార‌ని మ‌రో కేసు పెట్టారు. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే.. కాకినాడ‌లో గ‌త ఏడాది ప్రారంభంలో నిర్వ‌హించిన వారాహి యాత్ర సంద‌ర్భంగా వ‌లంటీర్ల‌పై విమ‌ర్శ‌లు చేశారు. మ‌హిళ‌లు క‌నిపించ‌కుండా పోవ‌డం వెనుక వ‌లంటీర్లు ఉన్నార‌ని ఆయ‌న ఆరోపిం చారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వ‌లంటీర్లు ప‌వ‌న్‌పై ఫిర్యాదు చేయ‌డంతో అనంత‌పురం, కాకినాడ‌, గుంటూరు, విజ‌య‌నగ రం, క‌ర్నూలు జిల్లాల్లోని ప‌లు పోలీసు స్టేష‌న్ల‌లో ప‌వ‌న్ కల్యాణ్‌పై కేసులు న‌మోదు చేశారు. వీటిలో కొన్నింటిని గుంటూరు స్థానిక కోర్టు విచారణ‌కు స్వీక‌రించింది.

గ‌తంలో రెండు సార్లు విచార‌ణ చేసి.. ప‌వ‌న్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. ఇంత‌లో స‌ర్కారు మారిపోయింది. తాజాగా మ‌రోసారి ఈ కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది. అయితే.. ప్ర‌భుత్వం మారిపోయిన ద‌రిమిలా.. ప‌వ‌న్ క‌ల్యాణ్పై గ‌తంలో న‌మోదైన కేసుల‌ను స‌ర్కారు వెన‌క్కి తీసుకుంటోంద‌ని.. దీనికి సంబంధించి హైకోర్టులో విచార‌ణ పెండింగులో ఉంద‌ని న్యాయ‌వాదులు తెలిపారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పాటు ప‌లువురిపై న‌మోదైన కేసుల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ హైకోర్టు క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన‌ట్టు న్యాయ‌వాదులు గుంటూరు కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన ప‌త్రాల‌ను కూడా స‌మ‌ర్పించారు. వీటిని ప‌రిశీలించిన‌కోర్టు హైకోర్టు అభిప్రాయం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని.. త‌దుప‌రి ఉత్త‌ర్వులు ఇస్తామ‌ని పేర్కొంది.

ఈ క్ర‌మంలో కేసును ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై న‌మోదైన కేసుల విచార‌ణ‌ను వాయిదా వేయాల‌ని న్యాయ వాదులు కోరారు. దీనికి న్యాయాధికారి అంగీక‌రించారు. హైకోర్టు తీర్పు వ‌చ్చే వ‌ర‌కు ఈ కేసుల‌ను వాయిదా వేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. ఈ మేర‌కు మూడు వారాల‌కు వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

This post was last modified on July 30, 2024 10:31 pm

Share
Show comments
Published by
Satya
Tags: Pawan

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

52 minutes ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

1 hour ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

2 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

2 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

3 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

4 hours ago