ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై వైసీపీ హయాంలో పలు కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు.. ఆయన హైదరాబాద్ నుంచి వస్తుండగా ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. అయితే, రివర్స్లో ఆయనపైనే విధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టారు.
అదేవిధంగా విశాఖలో హోటల్లో నిర్బంధించిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా.. పవన్ తమ విధులను అడ్డుకున్నారని మరో కేసు పెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కాకినాడలో గత ఏడాది ప్రారంభంలో నిర్వహించిన వారాహి యాత్ర సందర్భంగా వలంటీర్లపై విమర్శలు చేశారు. మహిళలు కనిపించకుండా పోవడం వెనుక వలంటీర్లు ఉన్నారని ఆయన ఆరోపిం చారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వలంటీర్లు పవన్పై ఫిర్యాదు చేయడంతో అనంతపురం, కాకినాడ, గుంటూరు, విజయనగ రం, కర్నూలు జిల్లాల్లోని పలు పోలీసు స్టేషన్లలో పవన్ కల్యాణ్పై కేసులు నమోదు చేశారు. వీటిలో కొన్నింటిని గుంటూరు స్థానిక కోర్టు విచారణకు స్వీకరించింది.
గతంలో రెండు సార్లు విచారణ చేసి.. పవన్కు నోటీసులు కూడా జారీ చేసింది. ఇంతలో సర్కారు మారిపోయింది. తాజాగా మరోసారి ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే.. ప్రభుత్వం మారిపోయిన దరిమిలా.. పవన్ కల్యాణ్పై గతంలో నమోదైన కేసులను సర్కారు వెనక్కి తీసుకుంటోందని.. దీనికి సంబంధించి హైకోర్టులో విచారణ పెండింగులో ఉందని న్యాయవాదులు తెలిపారు.
పవన్ కల్యాణ్తో పాటు పలువురిపై నమోదైన కేసులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు క్వాష్ పిటిషన్ దాఖలు చేసినట్టు న్యాయవాదులు గుంటూరు కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన పత్రాలను కూడా సమర్పించారు. వీటిని పరిశీలించినకోర్టు హైకోర్టు అభిప్రాయం పరిగణనలోకి తీసుకుని.. తదుపరి ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది.
ఈ క్రమంలో కేసును పవన్ కల్యాణ్పై నమోదైన కేసుల విచారణను వాయిదా వేయాలని న్యాయ వాదులు కోరారు. దీనికి న్యాయాధికారి అంగీకరించారు. హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఈ కేసులను వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు మూడు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
This post was last modified on July 30, 2024 10:31 pm
బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు…
నాలుగు నెలల నుంచి విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్న జన నాయకుడు వ్యవహారాలు మెల్లగా ఒక్కొక్కటి కొలిక్కి వస్తున్నాయి. మే…
జెట్లీ ఫలితం ఏమైందనేది కాసేపు పక్కనపెడితే కమెడియన్ సత్య క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఏంటో నిన్న ఓపెనింగ్స్ తో అర్థమయ్యింది.…
జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. కొన్నాళ్ల కిందట ముక్కుకు ఆపరేషన్ అయిన నేపథ్యంలో…
రెండేళ్ల క్రితం 'ప్రేమలు' విడుదలైనప్పుడు అందులో హీరోకన్నా ఎక్కువ పేరు వచ్చింది మమిత బైజుకే. హుషారైన నటన, జెన్ జీని…
సినీ రంగంలో తమకు అవకాశాలు ఇచ్చిన వాళ్ల మీద కొందరు ఎంతో అభిమానం, కృతజ్ఞత చూపిస్తుంటారు. అందులో ఒక్కొక్కరు ఒక్కో…