Political News

మందారం కప్పులో నయనతార తుఫాను

కొద్దిరోజుల క్రితం సమంత ఇన్ఫెక్షన్ తగ్గడానికి నెబులైజర్ లో హైడ్రాక్సిన్ పెరాక్సైడ్ వాడటంలో ప్రయోజనాలు ఉంటాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఎంత దుమారం రేపిందో చూశాం. లివర్ డాక్ అనే పేరుతో ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే ఒక ఎంబిబిఎస్ వైద్యులు సమంత ఇలాంటి సలహా ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సామ్ సైతం ధీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది కానీ ఒకదశ దాటాక ఇద్దరూ సైలెంట్ అయిపోవడంతో ఇష్యూ కాస్త చల్లబడింది. ఇప్పుడు నయన్ వంతు వచ్చింది.

మందారం టీ తాగడం వల్ల బోలెడు ఉపయోగాలు ఉంటాయని, మధుమేహం రక్తపోటు మొటిమలు తదితర ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుందని, ఆ తేనీరు తయారు చేసుకోవాల్సిన విధానాన్ని కూడా నయనతార షేర్ చేసుకుంది. దీంతో అదే లివర్ డాక్ మళ్ళీ తెరపైకి వచ్చారు. సెలబ్రిటీలలో వైద్య నిరక్షరాస్యులు పెరిగిపోతున్నారని, మందారం టీ తాగడం వల్ల పైన చెప్పిన వ్యాధులకు పరిష్కారం దొరుకుతుందని ఎక్కడ రుజువు కాలేదని చిన్నపాటి క్లాసు తీసుకున్నాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో నయనతార కొంత సమయం తర్వాత ఆ పోస్టుని అకౌంట్ నుంచి తీసేసింది.

తన ఆరోగ్య పర్యవేక్షణ చేసే నిపుణుడైన మున్మున్ గనేరివాల్ చెప్పిన సూచనలే పోస్ట్ చేశానని చెప్పిన నయనతార దాన్ని అలాగే మాత్రం ఉంచలేకపోయింది. మెడికల్ గా మందారం టీ మంచిదనే ఆధారాలు లేకపోవడమే దానికి కారణం. తర్వాత మూర్ఖులతో వాదిస్తే వాళ్ళ స్థాయికి మనల్ని కిందకు లాగుతారని అర్థం వచ్చేలా ఒక కొటేషన్ పెట్టిన నయన్ మొత్తానికి శుభం కార్డు వేసింది. అయినా సిగరెట్లు మందు తాగమని, ఆన్ లైన్లో పేకాట ఆడమని యాడ్లు చేసే హీరోల కన్నా ఇలా హెల్త్ కు సంబంధించిన సలహాలు ఇచ్చే హీరోయిన్లు చేసింది తప్పెలా అవుతుందని ఫ్యాన్స్ వాదన.

This post was last modified on July 30, 2024 5:50 pm

Share
Show comments
Published by
Satya
Tags: Nayanthara

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

53 minutes ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

1 hour ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

2 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

2 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

3 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

4 hours ago