తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు గాను ఒకటి ఎంఐఎం, 8 కాంగ్రెస్, 8 బీజేపీ పార్టీలు గెలుచుకున్నాయి. తెలంగాణలో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత సీఎం హోదాలో రేవంత్ ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి నిధుల కోసం వినతిపత్రాలు ఇచ్చాడు. తెలంగాణ పర్యటనకు వచ్చిన మోడీకి స్వాగతం పలికి బడేభాయ్ అంటూ పిలవడం కాంగ్రెస్ పార్టీలో చర్చానీయాంశం అయింది.
ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు ఎటువంటి నిధులు కేటాయించలేదు. దీనిని తెలంగాణలోని బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు తప్పుపట్టాయి. తెలంగాణ శాసనసభలో కేంద్రం తీరును నిరసిస్తూ తీర్మానం చేశారు. దీనికి నిరసనగా బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
బయ్యారం స్టీల్ ప్లాంట్, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా, ఐటీఐఆర్, నవోదయ విద్యాలయాలు, విభజన హామీలపై రాష్ట్రప్రభుత్వం కేంద్రం మీద గంపెడు ఆశలు పెట్టుకున్నది. కానీ ఏ విషయంలోనూ కేంద్రం నుంచి ఊరట లభించలేదు. కేంద్ర బడ్జెట్ ను బీజేపీ నేతలు సమర్ధించుకుంటున్నా కాంగ్రెస్ మాత్రం దీనికి బీజేపీ ఎంపీలను టార్గెట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
కేంద్రాన్ని నిలదీసి నిధులు వచ్చేలా చేయాలని కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంఘాలు తెలంగాణ నుండి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన బీజేపీ నేతల ఇళ్ల ముందు నిరసన తెలపాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. కేంద్రం నుండి సాధారణంగా వచ్చే నిధులు తప్ప ప్రత్యేకంగా నిధులు ఇస్తుందన్న నమ్మకం లేని నేపథ్యంలో బీజేపీ ఎంపీలను టార్గెట్ చేయడం మూలంగా అయినా బీజేపీ పెద్దలలో చలనం వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
This post was last modified on July 29, 2024 11:12 am
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…