Political News

తెలంగాణ కాంగ్రెస్ కొత్త టాస్క్ : టార్గెట్ బీజేపీ !

తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు గాను ఒకటి ఎంఐఎం, 8 కాంగ్రెస్, 8 బీజేపీ పార్టీలు గెలుచుకున్నాయి. తెలంగాణలో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత సీఎం హోదాలో రేవంత్ ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి నిధుల కోసం వినతిపత్రాలు ఇచ్చాడు. తెలంగాణ పర్యటనకు వచ్చిన మోడీకి స్వాగతం పలికి బడేభాయ్ అంటూ పిలవడం కాంగ్రెస్ పార్టీలో చర్చానీయాంశం అయింది.

ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు ఎటువంటి నిధులు కేటాయించలేదు. దీనిని తెలంగాణలోని బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు తప్పుపట్టాయి. తెలంగాణ శాసనసభలో కేంద్రం తీరును నిరసిస్తూ తీర్మానం చేశారు. దీనికి నిరసనగా బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

బయ్యారం స్టీల్ ప్లాంట్, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా, ఐటీఐఆర్, నవోదయ విద్యాలయాలు, విభజన హామీలపై రాష్ట్రప్రభుత్వం కేంద్రం మీద గంపెడు ఆశలు పెట్టుకున్నది. కానీ ఏ విషయంలోనూ కేంద్రం నుంచి ఊరట లభించలేదు. కేంద్ర బడ్జెట్ ను బీజేపీ నేతలు సమర్ధించుకుంటున్నా కాంగ్రెస్ మాత్రం దీనికి బీజేపీ ఎంపీలను టార్గెట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

కేంద్రాన్ని నిలదీసి నిధులు వచ్చేలా చేయాలని కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంఘాలు తెలంగాణ నుండి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన బీజేపీ నేతల ఇళ్ల ముందు నిరసన తెలపాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. కేంద్రం నుండి సాధారణంగా వచ్చే నిధులు తప్ప ప్రత్యేకంగా నిధులు ఇస్తుందన్న నమ్మకం లేని నేపథ్యంలో బీజేపీ ఎంపీలను టార్గెట్ చేయడం మూలంగా అయినా బీజేపీ పెద్దలలో చలనం వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

This post was last modified on July 29, 2024 11:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోనాలిసా పెళ్లి… లవ్ జిహాద్ కాదట

గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన…

1 hour ago

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

3 hours ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

3 hours ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

6 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

7 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

8 hours ago