Political News

తెలంగాణ కాంగ్రెస్ కొత్త టాస్క్ : టార్గెట్ బీజేపీ !

తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు గాను ఒకటి ఎంఐఎం, 8 కాంగ్రెస్, 8 బీజేపీ పార్టీలు గెలుచుకున్నాయి. తెలంగాణలో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత సీఎం హోదాలో రేవంత్ ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి నిధుల కోసం వినతిపత్రాలు ఇచ్చాడు. తెలంగాణ పర్యటనకు వచ్చిన మోడీకి స్వాగతం పలికి బడేభాయ్ అంటూ పిలవడం కాంగ్రెస్ పార్టీలో చర్చానీయాంశం అయింది.

ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు ఎటువంటి నిధులు కేటాయించలేదు. దీనిని తెలంగాణలోని బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు తప్పుపట్టాయి. తెలంగాణ శాసనసభలో కేంద్రం తీరును నిరసిస్తూ తీర్మానం చేశారు. దీనికి నిరసనగా బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

బయ్యారం స్టీల్ ప్లాంట్, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా, ఐటీఐఆర్, నవోదయ విద్యాలయాలు, విభజన హామీలపై రాష్ట్రప్రభుత్వం కేంద్రం మీద గంపెడు ఆశలు పెట్టుకున్నది. కానీ ఏ విషయంలోనూ కేంద్రం నుంచి ఊరట లభించలేదు. కేంద్ర బడ్జెట్ ను బీజేపీ నేతలు సమర్ధించుకుంటున్నా కాంగ్రెస్ మాత్రం దీనికి బీజేపీ ఎంపీలను టార్గెట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

కేంద్రాన్ని నిలదీసి నిధులు వచ్చేలా చేయాలని కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంఘాలు తెలంగాణ నుండి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన బీజేపీ నేతల ఇళ్ల ముందు నిరసన తెలపాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. కేంద్రం నుండి సాధారణంగా వచ్చే నిధులు తప్ప ప్రత్యేకంగా నిధులు ఇస్తుందన్న నమ్మకం లేని నేపథ్యంలో బీజేపీ ఎంపీలను టార్గెట్ చేయడం మూలంగా అయినా బీజేపీ పెద్దలలో చలనం వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

This post was last modified on July 29, 2024 11:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

17 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

47 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago