2018 ఎన్నికల తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంటున్న నేపథ్యంలో తాజాగా ఏపీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు మంచి రోజులు వచ్చాయి. ఇటీవల తెలంగాణ పర్యటనలో టీడీపీకి తెలంగాణలో పూర్వ వైభవం తెస్తానని అన్నారు. గత ఐదేళ్లుగా ఏపీ, తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకపోవడంతో ఆ పార్టీ నేతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగిస్తారని జోరుగా ఊహాగానాలు నడిచాయి. దీనికి చంద్రబాబు, లోకేష్, బాలక్రిష్ణలు ఆమోదం తెలిపారు అన్న వ్యాఖ్యలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా బీసీ సామాజికవర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ కు పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు రెండు రోజుల క్రితం అమరావతిలో తనను కలిసిన అరవింద్ కుమార్ గౌడ్ కు చంద్రబాబు సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా కొనసాగుతున్న అరవింద్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కు స్వయానా మేనల్లుడు. గతంలో ఆయన అసిఫ్ నగర్ శాసనసభ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రాభవం తగ్గినా ఆయన ఏ పార్టీలోకి వెళ్లకుండా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాడు.
ఇక పార్టీకి విధేయుడుగా ఉన్న నన్నూరి నర్సిరెడ్డితో పాటు మరొకరికి టీటీడీ బోర్డులో సభ్యులుగా అవకాశం కల్పిస్తారని, మాజీ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, మాజీ మంత్రి కాట్రగడ్డ ప్రసూన, గతంలో కూకట్ పల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నందమూరి సుహాసినిలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. మొత్తానికి ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణ టీడీపీ నేతలకు మంచిరోజుల వచ్చినట్లే అని భావించాలి.
This post was last modified on July 29, 2024 11:10 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…