2018 ఎన్నికల తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంటున్న నేపథ్యంలో తాజాగా ఏపీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు మంచి రోజులు వచ్చాయి. ఇటీవల తెలంగాణ పర్యటనలో టీడీపీకి తెలంగాణలో పూర్వ వైభవం తెస్తానని అన్నారు. గత ఐదేళ్లుగా ఏపీ, తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకపోవడంతో ఆ పార్టీ నేతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగిస్తారని జోరుగా ఊహాగానాలు నడిచాయి. దీనికి చంద్రబాబు, లోకేష్, బాలక్రిష్ణలు ఆమోదం తెలిపారు అన్న వ్యాఖ్యలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా బీసీ సామాజికవర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ కు పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు రెండు రోజుల క్రితం అమరావతిలో తనను కలిసిన అరవింద్ కుమార్ గౌడ్ కు చంద్రబాబు సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా కొనసాగుతున్న అరవింద్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కు స్వయానా మేనల్లుడు. గతంలో ఆయన అసిఫ్ నగర్ శాసనసభ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రాభవం తగ్గినా ఆయన ఏ పార్టీలోకి వెళ్లకుండా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాడు.
ఇక పార్టీకి విధేయుడుగా ఉన్న నన్నూరి నర్సిరెడ్డితో పాటు మరొకరికి టీటీడీ బోర్డులో సభ్యులుగా అవకాశం కల్పిస్తారని, మాజీ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, మాజీ మంత్రి కాట్రగడ్డ ప్రసూన, గతంలో కూకట్ పల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నందమూరి సుహాసినిలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. మొత్తానికి ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణ టీడీపీ నేతలకు మంచిరోజుల వచ్చినట్లే అని భావించాలి.
This post was last modified on July 29, 2024 11:10 am
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…