Political News

తెలంగాణ టీడీపీ నేతలకు మంచిరోజులొచ్చాయ్ !

2018 ఎన్నికల తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంటున్న నేపథ్యంలో తాజాగా ఏపీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు మంచి రోజులు వచ్చాయి. ఇటీవల తెలంగాణ పర్యటనలో టీడీపీకి తెలంగాణలో పూర్వ వైభవం తెస్తానని అన్నారు. గత ఐదేళ్లుగా ఏపీ, తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకపోవడంతో ఆ పార్టీ నేతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ నేపథ్యంలో నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగిస్తారని జోరుగా ఊహాగానాలు నడిచాయి. దీనికి చంద్రబాబు, లోకేష్, బాలక్రిష్ణలు ఆమోదం తెలిపారు అన్న వ్యాఖ్యలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా బీసీ సామాజికవర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ కు పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు రెండు రోజుల క్రితం అమరావతిలో తనను కలిసిన అరవింద్ కుమార్ గౌడ్ కు చంద్రబాబు సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా కొనసాగుతున్న అరవింద్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కు స్వయానా మేనల్లుడు. గతంలో ఆయన అసిఫ్ నగర్ శాసనసభ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రాభవం తగ్గినా ఆయన ఏ పార్టీలోకి వెళ్లకుండా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాడు.

ఇక పార్టీకి విధేయుడుగా ఉన్న నన్నూరి నర్సిరెడ్డితో పాటు మరొకరికి టీటీడీ బోర్డులో సభ్యులుగా అవకాశం కల్పిస్తారని, మాజీ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, మాజీ మంత్రి కాట్రగడ్డ ప్రసూన, గతంలో కూకట్ పల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నందమూరి సుహాసినిలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. మొత్తానికి ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణ టీడీపీ నేతలకు మంచిరోజుల వచ్చినట్లే అని భావించాలి.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

7 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

9 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

11 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

12 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

12 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

12 hours ago