Political News

‘ఒక‌టి’ గండం తీరేనా? బాబు స‌ర్కారుకు పెను స‌వాల్!

ఏపీలో ప్ర‌భుత్వానికి ప్ర‌తి నెలా 1వ తేదీ అంటేనే కొంత త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మూడు ప‌ద్దుల‌ను ఒకే రోజు చెల్లించాల్సి రావ‌డం.. నిధుల ప‌రిస్థితి చూస్తే ఆశించిన విధంగా లేక‌పోవ‌డంతో గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వం.. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం కూడా ప్ర‌తి నెలా 1వ తేదీ అంటే.. ఒక పెద్ద ‘గండం’గా భావిస్తున్నాయి. సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్లు, ఉద్యోగుల‌కు వేత‌నాలు, రిటైర్డ్ ఉద్యోగుల‌కు పింఛ‌న్లు.. ఈ మూడు ప‌ద్దుల‌ను 1వ తేదీనే ఇవ్వాల్సి ఉండ‌డం స‌ర్కారుకు త‌ల‌కుమించిన భారంగా మారింది. గతంలో జ‌గ‌న్ హ‌యాంలో ముందు సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌కు సొమ్ములు ఇచ్చేవారు.

త‌ర్వాత‌.. ఉద్యోగుల‌కు, రిటైర్డ్ ఉద్యోగుల‌కు సొమ్ములు ఇచ్చేవారు. దీంతో ఇవి చాలా రోజులు ఆల‌స్యం కావ‌డంతో వివాదాల‌కు దారితీసింది. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఆందోళ‌న‌కు దిగిన సంద‌ర్భాలున్నాయి. మొత్తంగా ఇది ఎన్నికల‌వేళ వ్య‌తిరేక‌త‌కు దారితీసి.. వైసీపీ ఘోరంగా ఓడిపోయే ప‌రిస్థితిని తీసుకువ‌చ్చింది. ఇక‌, కూట‌మి స‌ర్కారుకు కూడా.. ఈ గండం త‌ప్ప‌డం లేదు. పైగా.. గ‌త వైసీపీ స‌ర్కారు రూ.3000 చొప్పున సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను ఇస్తే.. ఇప్పుడు కూట‌మి స‌ర్కారు రూ.4000 చొప్పున ఇవ్వాల్సి వ‌స్తోంది. తొలినెల‌లో ఈ గండం నుంచి బ‌య‌ట ప‌డేందుకు రూ.7-9 వేల కోట్లు అప్పు చేశారు.

ఇక‌, మ‌రో మూడు, నాలుగు రోజుల్లో 1వ తేదీ రానుంది. ఇప్పుడు కూడా సుమారు 4 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైబ‌డి సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌కు చెల్లించాల్సి ఉంది. సాధార‌ణ పింఛ‌న్ల‌ను రూ.4 వేల చొప్పు, దివ్యాంగ పింఛ‌ను రూ.6 వేల చొప్పు, ఇత‌ర వ్యాధిగ్ర‌స్థుల‌కు రూ.10 వేలు, రూ.15 వేల‌చొప్పున కూడా చెల్లించాల్సి ఉంది. దీంతో ఈ మేర‌కు నిధుల అవ‌స‌రం ఏర్ప‌డింది. అదేస‌మ‌యంలో ఉద్యోగుల‌కు చెల్లించాల్సిన వేత‌నాలు, రిటైర్డ్ ఉద్యోగుల‌కు ఇవ్వాల్స‌ని పింఛ‌న్లు కూడా.. స‌ర్కారు 1నే ఇస్తుందా? లేక‌.. వాయిదా వేస్తుందా? అనేది తేల‌లేదు.

ప్ర‌స్తుతం ఖ‌జానాలో మాత్రం సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌కు స‌రిపోయేలా మాత్ర‌మే నిధులు ఉన్నాయి. ఉద్యోగుల‌కు జీత భ‌త్యాల వ్య‌వ‌హారం మాత్రం పెండింగులోనే ఉంది. అయితే.. రేపు వ‌చ్చే మంగ‌ళ‌వారం(30 జూలై) నాడు ఆర్బీఐ నిర్వ‌హించే వేలంలో పాల్గొని సెక్యూరిటీ డిపాజిట్ల వేలం ద్వారా 4 వేల కోట్లు స‌మీక‌రించేందుకు కూట‌మి స‌ర్కారు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ నిధులు వ‌స్తే.. ప్ర‌భుత్వానికి 1వ తేదీ గండం తీరుతుంద‌ని అధికారులు అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 28, 2024 8:58 pm

Share

Recent Posts

శాశ్వత సెలవు తీసుకున్న బిక్షు యాదవ్

రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…

10 minutes ago

ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చిన చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక ప‌రిస్థితిని ఆయ‌న వివ‌రించారు.…

30 minutes ago

రోమియో ఫిక్సయ్యాడు… ఓజి లేటవుతాడు

నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…

3 hours ago

ఉత్త‌రాదిన మోడీ ఇమేజ్‌కు యూత్ చెక్ పెడుతున్నారా?

దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇమేజ్‌కు యువ‌త పెద్ద ఎత్తున…

3 hours ago

మంగాపురం కుర్రాడికి మంగళవారం పాఠం

సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…

4 hours ago

అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు.. ఇదేం న్యాయం జగన్?

త్వ‌ర‌లోనే ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు తెర‌దీయ‌నున్నారు. సెప్టెంబ‌రు-అక్టోబ‌రు మ‌ధ్య మునిసిపాలిటీ… న‌వంబ‌రు-డిసెంబ‌రు మ‌ధ్య కార్పోరేష‌న్లు, జ‌న‌వ‌రిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు…

4 hours ago