ఏపీలో ప్రభుత్వానికి ప్రతి నెలా 1వ తేదీ అంటేనే కొంత తర్జన భర్జన పరిస్థితి కనిపిస్తోంది. మూడు పద్దులను ఒకే రోజు చెల్లించాల్సి రావడం.. నిధుల పరిస్థితి చూస్తే ఆశించిన విధంగా లేకపోవడంతో గతంలో వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ప్రతి నెలా 1వ తేదీ అంటే.. ఒక పెద్ద ‘గండం’గా భావిస్తున్నాయి. సామాజిక భద్రతా పింఛన్లు, ఉద్యోగులకు వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు.. ఈ మూడు పద్దులను 1వ తేదీనే ఇవ్వాల్సి ఉండడం సర్కారుకు తలకుమించిన భారంగా మారింది. గతంలో జగన్ హయాంలో ముందు సామాజిక భద్రతా పింఛన్లకు సొమ్ములు ఇచ్చేవారు.
తర్వాత.. ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు సొమ్ములు ఇచ్చేవారు. దీంతో ఇవి చాలా రోజులు ఆలస్యం కావడంతో వివాదాలకు దారితీసింది. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఆందోళనకు దిగిన సందర్భాలున్నాయి. మొత్తంగా ఇది ఎన్నికలవేళ వ్యతిరేకతకు దారితీసి.. వైసీపీ ఘోరంగా ఓడిపోయే పరిస్థితిని తీసుకువచ్చింది. ఇక, కూటమి సర్కారుకు కూడా.. ఈ గండం తప్పడం లేదు. పైగా.. గత వైసీపీ సర్కారు రూ.3000 చొప్పున సామాజిక భద్రతా పింఛన్లను ఇస్తే.. ఇప్పుడు కూటమి సర్కారు రూ.4000 చొప్పున ఇవ్వాల్సి వస్తోంది. తొలినెలలో ఈ గండం నుంచి బయట పడేందుకు రూ.7-9 వేల కోట్లు అప్పు చేశారు.
ఇక, మరో మూడు, నాలుగు రోజుల్లో 1వ తేదీ రానుంది. ఇప్పుడు కూడా సుమారు 4 వేల కోట్ల రూపాయలకు పైబడి సామాజిక భద్రతా పింఛన్లకు చెల్లించాల్సి ఉంది. సాధారణ పింఛన్లను రూ.4 వేల చొప్పు, దివ్యాంగ పింఛను రూ.6 వేల చొప్పు, ఇతర వ్యాధిగ్రస్థులకు రూ.10 వేలు, రూ.15 వేలచొప్పున కూడా చెల్లించాల్సి ఉంది. దీంతో ఈ మేరకు నిధుల అవసరం ఏర్పడింది. అదేసమయంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సని పింఛన్లు కూడా.. సర్కారు 1నే ఇస్తుందా? లేక.. వాయిదా వేస్తుందా? అనేది తేలలేదు.
ప్రస్తుతం ఖజానాలో మాత్రం సామాజిక భద్రతా పింఛన్లకు సరిపోయేలా మాత్రమే నిధులు ఉన్నాయి. ఉద్యోగులకు జీత భత్యాల వ్యవహారం మాత్రం పెండింగులోనే ఉంది. అయితే.. రేపు వచ్చే మంగళవారం(30 జూలై) నాడు ఆర్బీఐ నిర్వహించే వేలంలో పాల్గొని సెక్యూరిటీ డిపాజిట్ల వేలం ద్వారా 4 వేల కోట్లు సమీకరించేందుకు కూటమి సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నిధులు వస్తే.. ప్రభుత్వానికి 1వ తేదీ గండం తీరుతుందని అధికారులు అంతర్గత చర్చల్లో పేర్కొనడం గమనార్హం.
This post was last modified on July 28, 2024 8:58 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…
అదేంటి రాజకీయాల్లో గెలిచిన తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించడు కదా, మరి నిర్మాతలకు పండగ ఏమిటనుకుంటున్నారా. తమిళనాడు ముఖ్యమంత్రిగా…
కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…