Political News

జగన్ కామెంట్… కరోనాతో కలిసి సహజీవనం తప్పదేమో

ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారి పేరు వింటేనే ప్రపంచ దేశాలన్నీ హడలెత్తిపోతుంటే… ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం కాస్తంత నింపాదిగానే కనిపించారన్న మాట వినిపించింది. అసలు కరోనా అంత డేంజరేమీ కాదన్నట్లుగా వ్యవహరించిన జగన్ కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసులు అమాంతంగా పెరిగిపోయాయని ఇతర పార్టీలన్నీ కూడా ఆరోపిస్తున్న వైనం మనకు తెలియనిదేమీ కాదు. ఇలాంటి తరుణంలో కరోనా విస్తరణ, భవిష్యత్తులో ఆ వైరస్ తో కలిసి సహజీవనం చేయక తప్పదేమోనంటూ జగన్ నోట ఆసక్తికర కామెంట్లు వినిపించడం చూస్తుంటే.. కరోనాపై జగన్ కు తత్వం బోధపడిందా? అన్న విశ్లేషణలు మొదలయ్యాయి.

కరోనా వైరస్ వ్యాప్తి, ఆ నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వైరస్ వ్యాప్తి నిరోధానికి చేపడుతున్న చర్యలపై మీడియాతో మాట్లాడేందుకు సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన జగన్… ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనాను పూర్తిగా తరిమేయడం సాధ్యం కాదేమోనన్న భావనను వ్యక్తం చేసిన జగన్… మున్ముందు మనమంతా కరోనాతో కలిసి సహజీవనం చేయాల్సి రావొచ్చేమోనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా అంటరానితనం కాదని పేర్కొన్న జగన్… ఇళ్లలో వయసు పైబడిన వారిని జాగ్రత్తగా చూసుకోవాలంటూ సూచించారు.

ఇక కరోనా వ్యాప్తిపై మాట్లాడిన జగన్… 10 లక్షల జనాభాకి ఏపీలో 1396 టెస్టులు చేశామని.. దేశం మొత్తం యావరేజ్ 400 మాత్రమేనని.. ఈ విషయంలో దేశంలోనే అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రంగా ఏపీని నిలబెట్టామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 ల్యాబ్ లలో కరోనా టెస్టులు చేస్తున్నామని, కరోనా కోసమే రాష్ట్రంలో 5 చోట్ల క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసామని చెప్పారు. ఇప్పటివరకు 74551 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా ..రాష్ట్రంలో కేవలం 63 మండలాలు మాత్రమే రెడ్ జోన్స్ లో ఉన్నాయని.. అలాగే 54 మండలాలు ఆరెంజ్ జోన్ లో ఉన్నాయి.. మిగిలిన 559 మండలాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయని జగన్ చెప్పుకొచ్చారు. ఈ లెక్కన రాష్ట్రంలో 80 శాతం మండలాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఆయన పేర్కొన్నారు. రంజాన్ మాసం ప్రారంభమైందని.. ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఇంట్లోనే ఉంటూ ఉపవాస దీక్షలు చెప్పట్టాలని… ప్రస్తుత పరిస్థితిని అందరూ అర్థం చేసుకుని మసలుకోవాలని కూడా జగన్ విజ్ఝప్తి చేశారు.

suman

Recent Posts

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

45 minutes ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

2 hours ago

జగన్.. బాలయ్య సాయం కోరిన వేళ..!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…

2 hours ago

డీఎస్సీపై గగ్గోలు… నీట్‌పై మౌనం..?

"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…

2 hours ago

వంద దేవుళ్ళు తల్లిది పెద్ద టాలెంటే

ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…

3 hours ago

వింటేజ్ హీరో నెక్స్ట్ ఏం చేయబోతున్నారో

కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…

6 hours ago