Political News

ఒక్కొక్క‌రు కాదు.. ఈ సారి గుంపులే!

ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ నుంచి ఒక్కొక్క‌రుగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. అయితే.. మున్ముందు ఇలా వెళ్లేవారిని ఆపేందుకు.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు.. వారితో రాజీ ప‌డేందుకు కూడా.. వైసీపీ నుంచి ఎలాంటి ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌డం లేదు. గ‌తంలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న స‌మ‌యంలోనూ వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు స‌హా.. అనేక మంది ఇత‌ర నేత‌లు బ‌య‌ట‌కు వ‌చ్చారు. వారిలో సీనియ‌ర్లు కూడా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ కానీ.. వైసీపీ నేత‌లు కానీ.. ఎవ‌రినీ బుజ్జ‌గించ‌లేదు.

ఇప్పుడు కూడా వైసీపీ అదే వైఖ‌రి తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. గ‌తంలో అంటే.. ఈ ఏడాది ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత కూడా జ‌గ‌న్‌.. పోయేవారిని పోనీ.. అంటూ పులివెందుల‌లోనే వ్యాఖ్యానించారు. “ఎంత మందిని ఆపుతాం. వెళ్లేవారు వెళ్ల‌నీయండి అన్నా!” అంటూ పులివెందుల నేత‌ల‌తోనే ఆయ‌న తేల్చి చెప్పారు. త‌నను న‌మ్మి ఉండేవారితోనే తాను రాజకీయాలు చేస్తాన‌ని కూడా చెప్పారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. పెద్ద‌గా రాజీనామాలు చేసేవారు క‌నిపించ‌లేదు.

కానీ, ఇటీవ‌ల రెండు మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే.. కిలారు రోశ‌య్య‌, మ‌ద్దాలి గిరి, రావెల కిశోర్ బాబు, డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ వంటివారు.. పార్టీకి దూర‌మ‌య్యారు. దీంతో ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతున్నార‌నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. అయినా.. దీనిపైపార్టీ అంత‌ర్మ‌థ‌నం చేసుకోలేదు. అంతేకాదు.. ఎవ‌రినీ పిలిచి మాట్లాడేందుకు కూడా ముందుకు రాలేదు. ఇక‌, ఇప్పుడు అస‌లు వ్య‌వ‌హారం ముదురుతోంది. శ్వేత ప‌త్రాల రూపంలో చంద్ర‌బాబు గ‌త వైసీపీ పాల‌న‌లో జ‌రిగిన ఘోరాల‌ను వెల్ల‌డించారు.

వీటిపై విచార‌ణ చేయిస్తాన‌ని చెప్పారు. ఇసుక‌, మ‌ద్యం.. వ్య‌వ‌హారాల‌పై సీఐడీని, ఈడీని కూడా.. పిలుస్తా మన్నారు. ఇది.. వైసీపీలో క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌కు ప్రాణ‌సంక‌టంగా మారింది. ప్ర‌తి జిల్లాలోనూ కీల‌క నాయ‌కులు ఈ విష‌యాల్లో వేలు పెట్టిన వారే. దీంతో ఇప్పుడు వీరు త‌మ దారి తాము చూసుకునేందుకు సిద్ధ‌ప‌డ‌తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. సాధార‌ణంగా ఇలాంటివి వ‌చ్చిన‌ప్పుడు.. పార్టీ మారితే కొంత సెగ త‌గ్గుతుంది. విచార‌ణ కూడా ఉండ‌క‌పోవ‌చ్చు. గ‌తంలో అనేక ప‌రిణామాలు కూడా చూశాం. సో.. రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి ఒక్కొక్క‌రుగా కాదు.. గుంపులుగా నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on July 27, 2024 9:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

4 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

48 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago