Political News

ఒక్కొక్క‌రు కాదు.. ఈ సారి గుంపులే!

ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ నుంచి ఒక్కొక్క‌రుగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. అయితే.. మున్ముందు ఇలా వెళ్లేవారిని ఆపేందుకు.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు.. వారితో రాజీ ప‌డేందుకు కూడా.. వైసీపీ నుంచి ఎలాంటి ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌డం లేదు. గ‌తంలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న స‌మ‌యంలోనూ వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు స‌హా.. అనేక మంది ఇత‌ర నేత‌లు బ‌య‌ట‌కు వ‌చ్చారు. వారిలో సీనియ‌ర్లు కూడా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ కానీ.. వైసీపీ నేత‌లు కానీ.. ఎవ‌రినీ బుజ్జ‌గించ‌లేదు.

ఇప్పుడు కూడా వైసీపీ అదే వైఖ‌రి తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. గ‌తంలో అంటే.. ఈ ఏడాది ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత కూడా జ‌గ‌న్‌.. పోయేవారిని పోనీ.. అంటూ పులివెందుల‌లోనే వ్యాఖ్యానించారు. “ఎంత మందిని ఆపుతాం. వెళ్లేవారు వెళ్ల‌నీయండి అన్నా!” అంటూ పులివెందుల నేత‌ల‌తోనే ఆయ‌న తేల్చి చెప్పారు. త‌నను న‌మ్మి ఉండేవారితోనే తాను రాజకీయాలు చేస్తాన‌ని కూడా చెప్పారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. పెద్ద‌గా రాజీనామాలు చేసేవారు క‌నిపించ‌లేదు.

కానీ, ఇటీవ‌ల రెండు మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే.. కిలారు రోశ‌య్య‌, మ‌ద్దాలి గిరి, రావెల కిశోర్ బాబు, డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ వంటివారు.. పార్టీకి దూర‌మ‌య్యారు. దీంతో ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతున్నార‌నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. అయినా.. దీనిపైపార్టీ అంత‌ర్మ‌థ‌నం చేసుకోలేదు. అంతేకాదు.. ఎవ‌రినీ పిలిచి మాట్లాడేందుకు కూడా ముందుకు రాలేదు. ఇక‌, ఇప్పుడు అస‌లు వ్య‌వ‌హారం ముదురుతోంది. శ్వేత ప‌త్రాల రూపంలో చంద్ర‌బాబు గ‌త వైసీపీ పాల‌న‌లో జ‌రిగిన ఘోరాల‌ను వెల్ల‌డించారు.

వీటిపై విచార‌ణ చేయిస్తాన‌ని చెప్పారు. ఇసుక‌, మ‌ద్యం.. వ్య‌వ‌హారాల‌పై సీఐడీని, ఈడీని కూడా.. పిలుస్తా మన్నారు. ఇది.. వైసీపీలో క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌కు ప్రాణ‌సంక‌టంగా మారింది. ప్ర‌తి జిల్లాలోనూ కీల‌క నాయ‌కులు ఈ విష‌యాల్లో వేలు పెట్టిన వారే. దీంతో ఇప్పుడు వీరు త‌మ దారి తాము చూసుకునేందుకు సిద్ధ‌ప‌డ‌తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. సాధార‌ణంగా ఇలాంటివి వ‌చ్చిన‌ప్పుడు.. పార్టీ మారితే కొంత సెగ త‌గ్గుతుంది. విచార‌ణ కూడా ఉండ‌క‌పోవ‌చ్చు. గ‌తంలో అనేక ప‌రిణామాలు కూడా చూశాం. సో.. రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి ఒక్కొక్క‌రుగా కాదు.. గుంపులుగా నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on July 27, 2024 9:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్యారడైజ్ పరుగులు పెట్టాల్సిందే

పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…

52 minutes ago

రజినీకాంత్ భయపడ్డాడా? జాగ్రత్తపడ్డాడా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…

3 hours ago

వాషింగ్టన్ డీసీని… మనమ్మాయి శాసిస్తుందా?

ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…

3 hours ago

పార్టీ పేరుతో పాటు గుర్తుతోనూ స్ట్రోక్ ఇవ్వనున్న కవిత?

బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయ‌కురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌విత త‌న దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వ‌రలోనే…

3 hours ago

భానుప్రియ మతిస్థిమితం కోల్పోయిందా?

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…

4 hours ago

బ్లాక్ బస్టర్ స్ట్రీక్‌కు బ్రేక్ పడబోతోందా?

అనామకుడైన ఒక కుర్రాడు హీరోగా నటించిన తొలి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు రాబట్టడమే అనూహ్యం. అలాంటిది ఆ హీరో తర్వాతి…

4 hours ago