Political News

ఒక్కొక్క‌రు కాదు.. ఈ సారి గుంపులే!

ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ నుంచి ఒక్కొక్క‌రుగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. అయితే.. మున్ముందు ఇలా వెళ్లేవారిని ఆపేందుకు.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు.. వారితో రాజీ ప‌డేందుకు కూడా.. వైసీపీ నుంచి ఎలాంటి ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌డం లేదు. గ‌తంలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న స‌మ‌యంలోనూ వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు స‌హా.. అనేక మంది ఇత‌ర నేత‌లు బ‌య‌ట‌కు వ‌చ్చారు. వారిలో సీనియ‌ర్లు కూడా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ కానీ.. వైసీపీ నేత‌లు కానీ.. ఎవ‌రినీ బుజ్జ‌గించ‌లేదు.

ఇప్పుడు కూడా వైసీపీ అదే వైఖ‌రి తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. గ‌తంలో అంటే.. ఈ ఏడాది ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత కూడా జ‌గ‌న్‌.. పోయేవారిని పోనీ.. అంటూ పులివెందుల‌లోనే వ్యాఖ్యానించారు. “ఎంత మందిని ఆపుతాం. వెళ్లేవారు వెళ్ల‌నీయండి అన్నా!” అంటూ పులివెందుల నేత‌ల‌తోనే ఆయ‌న తేల్చి చెప్పారు. త‌నను న‌మ్మి ఉండేవారితోనే తాను రాజకీయాలు చేస్తాన‌ని కూడా చెప్పారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. పెద్ద‌గా రాజీనామాలు చేసేవారు క‌నిపించ‌లేదు.

కానీ, ఇటీవ‌ల రెండు మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే.. కిలారు రోశ‌య్య‌, మ‌ద్దాలి గిరి, రావెల కిశోర్ బాబు, డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ వంటివారు.. పార్టీకి దూర‌మ‌య్యారు. దీంతో ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతున్నార‌నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. అయినా.. దీనిపైపార్టీ అంత‌ర్మ‌థ‌నం చేసుకోలేదు. అంతేకాదు.. ఎవ‌రినీ పిలిచి మాట్లాడేందుకు కూడా ముందుకు రాలేదు. ఇక‌, ఇప్పుడు అస‌లు వ్య‌వ‌హారం ముదురుతోంది. శ్వేత ప‌త్రాల రూపంలో చంద్ర‌బాబు గ‌త వైసీపీ పాల‌న‌లో జ‌రిగిన ఘోరాల‌ను వెల్ల‌డించారు.

వీటిపై విచార‌ణ చేయిస్తాన‌ని చెప్పారు. ఇసుక‌, మ‌ద్యం.. వ్య‌వ‌హారాల‌పై సీఐడీని, ఈడీని కూడా.. పిలుస్తా మన్నారు. ఇది.. వైసీపీలో క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌కు ప్రాణ‌సంక‌టంగా మారింది. ప్ర‌తి జిల్లాలోనూ కీల‌క నాయ‌కులు ఈ విష‌యాల్లో వేలు పెట్టిన వారే. దీంతో ఇప్పుడు వీరు త‌మ దారి తాము చూసుకునేందుకు సిద్ధ‌ప‌డ‌తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. సాధార‌ణంగా ఇలాంటివి వ‌చ్చిన‌ప్పుడు.. పార్టీ మారితే కొంత సెగ త‌గ్గుతుంది. విచార‌ణ కూడా ఉండ‌క‌పోవ‌చ్చు. గ‌తంలో అనేక ప‌రిణామాలు కూడా చూశాం. సో.. రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి ఒక్కొక్క‌రుగా కాదు.. గుంపులుగా నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on July 27, 2024 9:52 am

Share

Recent Posts

బేబీ జంటకు ‘ఎపిక్’ ఎగ్జామ్

రేపు విడుదల కాబోతున్న ఎపిక్ ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేయనుంది. హైదరాబాద్ ఒకటే కాకుండా ఏపీ, తెలంగాణ…

35 seconds ago

అంత గొప్ప పాట‌ను దేవి 8 ఏళ్ల‌కే…

కొన్ని సినిమాలు థియేట‌ర్ల‌లో అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయిలో ఆడ‌క‌పోయినా.. కొన్ని పాట‌లు, స‌న్నివేశాలు క‌ల్ట్ స్టేట‌స్ తెచ్చుకుంటాయి. వ‌ర్షం…

19 minutes ago

న‌మ్మ‌కం లేన‌ప్పుడు.. బాబు చేసిన‌ట్టు చేయొచ్చుగా జ‌గ‌న్‌!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంపై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌ త‌ర‌చుగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ ఎన్నిక‌ల నిర్వహ‌ణ…

2 hours ago

కసబ్ కు వాళ్లకు తేడా లేదు

స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్…

2 hours ago

అది నిజ‌మైతే.. వైసీపీ ఖాళీ అవుతుందా?

వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాట‌లు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్న‌ట్టుగానే పార్టీ అధినేత జ‌గ‌న్…

7 hours ago

గీత గోవిందం దర్శకుడికి బ్రేక్ దొరికింది

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…

10 hours ago