ఏపీలో మొత్తం జనాభా 5 కోట్ల మంది ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిపై 1.44 లక్షల రూపాయల అప్పు ఉందని సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో మొత్తం అప్పులు 9.74 లక్షల కోట్ల అప్పు చేశారని అన్నారు. (అయితే..ఇది మొత్తం అప్పా.. వైసీపీ మాత్రమే చేసిన అప్పా అనేది చెప్పలేదు) దీంతో ఒక్కొక్కరిపై భారం పెరిగిపోయిందని చెప్పారు. దీనికి వేల కోట్ల రూపాయల్లో వడ్డీలు చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయానికి ఏపీకి 46 శాతం, తెలంగాణకు 54 శాతం ఆదాయం ఉందన్నారు.
అయితే… తమ హయాంలో అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదాయం బాట పట్టించామని చంద్రబాబు చెప్పారు. ఒక్క పట్టిసీమ ప్రాజెక్టును కట్టడం ద్వారా 44 వేల కోట్ల ఆదాయం రాష్ట్రానికి వచ్చిందని చంద్రబాబు వివరించారు. కానీ, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనిని కొనసాగించలేదని.. టీడీపీకి పేరు వస్తుందని ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారని దీంతో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిని.. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు తమ హయాంలో 11 వేల కోట్ల రూపాయలకు పైగానే కేటాయించామని చంద్రబాబు చెప్పారు. ఇదే విధానాన్ని కొనసాగించి ఉంటే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తయి ఉండేదని.. కానీ, వైసీపీ రివర్స్ టెండర్లు వేయడంతో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి చేరిపోయిందన్నారు. నైపుణ్య శిక్షణ ద్వారా యువతను తయారు చేశామని.. అనేక మంది వైసీపీ హయాంలో ఉద్యోగాలు, ఉపాధి లేక.. ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారని, దీంతో నైపుణ్య ఉద్యోగులు లేక రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయిందన్నారు.
This post was last modified on July 26, 2024 6:53 pm
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…