Political News

వైసీపీకి తూ.గో.జి షాక్ ఇవ్వడం ఖాయమేనా ?!

ఏపీ ఎన్నికల్లో 11 శాసనసభ, 4 లోక్ సభ స్థానాలకు పరిమితం అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో 35 మంది ఎమ్మెల్సీలు, అటు రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. వీరి ఆధారంగా అటు కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యసభలో, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనమండలిలో ఇరుకున పెట్టాలి అన్నది వైసీపీ వ్యూహాంగా తెలుస్తుంది. అయితే వీళ్లు కూడా చేజారే సంకేతాలు కనిపిస్తుండడం వైసీపీలో ఆందోళన రేపుతుంది.

తూర్పు గోదావరి జిల్లాలో బలమైన కాపు నేత తోట త్రిమూర్తులు 2019లో టీడీపీ నుండి వైసీపీలో చేరాడు. 2021లో వైసీపీ గవర్నర్ కోటాలో త్రిమూర్తులును ఎమ్మెల్సీని చేసింది. ఇటీవల ఎన్నికల్లో ఆయన మండపేట నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఐతే శిరోముండనం కేసులో త్రిమూర్తులుకు కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించగా ఆయన దాని మీద అప్పీలుకు వెళ్లి తాత్కాలిక ఉపశమనం పొందాడు.

ఈ పరిస్థితులలో వైసీపీ అధికారం కోల్పోవడంతో అధికార పార్టీ అండ కోసం ఆయన బీజేపీలో చేరాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామక్రిష్ణా రెడ్డి ఈ విషయాన్ని మంత్రి సత్యకుమార్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తుంది. అయితే వైసీపీ నుండి ఏ నేత చేరినా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య చర్చ జరగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక ఇదే జిల్లాకు చెందిన వైఎస్ జగన్ నమ్మిన నేత పిల్లి సుభాష్ చంద్రబోస్. వైఎస్ కుటుంబానికి విధేయుడుగా ఉన్న ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరి 2012 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. 2014లో రామచంద్రాపురం నుండి, 2019లో మండపేట నుండి పోటీ చేసి ఓడిపోయాడు. శాసనమండలి సభ్యుడుగా ఉన్న ఆయనను మంత్రిని చేసిన జగన్ ఆ తర్వాత మండలి రద్దు చేయాలన్న ఆలోచనతో వైసీపీ 2020లో రాజ్యసభకు పంపింది.

అయితే రామచంద్రాపురంలో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణకు జగన్ మంత్రిగా అవకాశం ఇచ్చారు. అయితే తొలి నుండి విధేయుడుగా ఉన్న బోస్ ఈ విషయంలో అసంతృప్తిగా ఉండడంతో వేణును రాజమండ్రి రూరల్ కు పంపిన జగన్ బోస్ కుమారుడు సూర్యప్రకాష్ కు వైసీపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. అయితే టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ చేతిలో సూర్యప్రకాష్ పరాజయం పాలయ్యాడు.

ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాలలో జనసేన ప్రాభవం పెరుగుతుందని భావిస్తున్న సూర్యప్రకాష్ ఆ పార్టీలో చేరాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కుమారుడి భవిష్యత్తు కోసం బోస్ జనసేన తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతున్నది. తూర్పు గోదావరి జిల్లాలో బలంగా ఉన్న ఇద్దరు నేతలు వైసీపీని వీడతారన్న ప్రచారం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

This post was last modified on July 25, 2024 9:55 am

Share
Show comments

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

8 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

10 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

10 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

11 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

11 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

13 hours ago