Political News

షర్మిలమ్మా ఇంత రిస్క్ అవసరమా

కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌.. వైఎస్ ష‌ర్మిల‌.. ఏపీలోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఆమె ప‌ర్య‌టించారు. ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని తాడేపల్లి గూడెం, నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అయితే.. ఈ స‌మ‌యంలో ఆమె న‌డుములోతు నీళ్ల‌లోకి దిగి మ‌రీ పంట‌ల‌ను ప‌రిశీలించడం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి అక్క‌డ నీరు త‌ప్ప‌.. పంట‌లు లేవు. అంటే.. కొట్టుకుపోయాయి. అయిన‌ప్ప‌టికీ.. రైతుల కోరిక మేర‌కు.. వ‌ర‌ద నీటిలోకి దిగి.. ఆమె నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నడుంలోతు నీళ్లలో దిగి వినూత్నంగా నిరసన చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల మాట్లాడుతూ.. రైతులు ఒక్కొక్క‌రూ.. వంద‌ల ఎక‌రాల్లో పంటలు న‌ష్ట‌పోయార‌ని తెలిపారు. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఉన్న‌ప్పుడు.. రైతుల‌ను ఆదుకున్నార‌ని.. మేనిఫెస్టోలో రైతు రుణ మాఫీ గురించి చెప్ప‌క‌పోయినా.. స్పందించి.. రైతుల‌కు రుణ మాఫీ చేశార‌ని తెలిపారు. ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా.. రుణ మాఫీ గురించి హామీ ఇవ్వ‌క‌పోయినా.. చేయ‌కూడ‌ద‌ని రూల్ లేద‌న్నారు.

రైతుల క‌ష్టాల‌ను చూసి.. ప్ర‌బుత్వం రుణ మాఫీ చేయాల‌ని ష‌ర్మిల డిమాండ్ చేశారు. పంట‌లు నిలువెత్తు లోతులో మునిగిపోయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ యంత్రాంగం క‌నీసం స్పందించ‌లేద‌ని ష‌ర్మిల దుయ్యబ‌ట్టారు. అందుకే తాను వ‌చ్చి.. రైతుల క‌ష్టాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు చెప్పారు. ప్ర‌బుత్వం ఇప్ప‌టికైనా స్పందించి రైతుల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఇదే స‌మ‌యంలో త‌న సోద‌రుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు.

ప‌క్క‌నే ఉన్న ఎర్ర‌కాలువ పొంగి పొర్ల‌డంతోనే వేలాది ఎక‌రాల పొలాలు నీట మునిగాయ‌ని చెప్పిన ష‌ర్మిల‌.. ఈ పాపం జ‌గ‌న్‌దేన‌ని అన్నారు. ఎర్ర‌కాలువ వ‌ర‌ద ఉద్రుతిని ఆపేలా వైసీపీ ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేద‌ని.. త‌ట్టెడు మ‌ట్టి కూడా.. ఎత్తిపోయ‌లేద‌ని.. ఈ కార‌ణంగానే పొలాలు మునిగిపోయి.. రైతులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు. ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మైనా.. రైతుల‌ను ఆదుకోవాల‌ని కోరారు. కాగా.. నడుములోతు నీళ్ల‌లోదిగి నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డంపై మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది.

This post was last modified on July 24, 2024 3:54 pm

Share
Show comments

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

7 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

8 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

8 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

10 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

10 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

12 hours ago