కాంగ్రెస్ పీసీసీ చీఫ్.. వైఎస్ షర్మిల.. ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం, నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అయితే.. ఈ సమయంలో ఆమె నడుములోతు నీళ్లలోకి దిగి మరీ పంటలను పరిశీలించడం గమనార్హం. వాస్తవానికి అక్కడ నీరు తప్ప.. పంటలు లేవు. అంటే.. కొట్టుకుపోయాయి. అయినప్పటికీ.. రైతుల కోరిక మేరకు.. వరద నీటిలోకి దిగి.. ఆమె నిరసన వ్యక్తం చేశారు.
పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నడుంలోతు నీళ్లలో దిగి వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. రైతులు ఒక్కొక్కరూ.. వందల ఎకరాల్లో పంటలు నష్టపోయారని తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు.. రైతులను ఆదుకున్నారని.. మేనిఫెస్టోలో రైతు రుణ మాఫీ గురించి చెప్పకపోయినా.. స్పందించి.. రైతులకు రుణ మాఫీ చేశారని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా.. రుణ మాఫీ గురించి హామీ ఇవ్వకపోయినా.. చేయకూడదని రూల్ లేదన్నారు.
రైతుల కష్టాలను చూసి.. ప్రబుత్వం రుణ మాఫీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. పంటలు నిలువెత్తు లోతులో మునిగిపోయినా.. ఇప్పటి వరకు ప్రభుత్వ యంత్రాంగం కనీసం స్పందించలేదని షర్మిల దుయ్యబట్టారు. అందుకే తాను వచ్చి.. రైతుల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ప్రబుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో తన సోదరుడు జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
పక్కనే ఉన్న ఎర్రకాలువ పొంగి పొర్లడంతోనే వేలాది ఎకరాల పొలాలు నీట మునిగాయని చెప్పిన షర్మిల.. ఈ పాపం జగన్దేనని అన్నారు. ఎర్రకాలువ వరద ఉద్రుతిని ఆపేలా వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని.. తట్టెడు మట్టి కూడా.. ఎత్తిపోయలేదని.. ఈ కారణంగానే పొలాలు మునిగిపోయి.. రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వమైనా.. రైతులను ఆదుకోవాలని కోరారు. కాగా.. నడుములోతు నీళ్లలోదిగి నిరసన వ్యక్తం చేయడంపై మిశ్రమ స్పందన వచ్చింది.
This post was last modified on July 24, 2024 3:54 pm
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…
బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో…
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…
తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…
రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…
పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ.. ఐప్యాక్పై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏకకాలంలో గురువారం.. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఐప్యాక్ సంస్థలకు…