రాష్ట్రంలో ప్రధానంగా ఫైళ్ళ మాయం, దగ్ఢం అనేది ఇప్పుడు చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. కీలకమైన శాఖలలో అనేక అవకతవకులు జరిగాయని.. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించారు. పలు శాఖల్లో చోటు చేసుకున్న అక్రమాలు, చీపు లిక్కర్ను అత్యధిక ధరకు అమ్మి సొమ్ములు చేసుకున్నారన్న విషయం పైన లోతైన దర్యాప్తు చేయాలని భావించారు. కానీ, కూటమీ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే ఈ శాఖకు సంబంధించిన ఫైళ్లు తగలబడ్డాయి. అదే విధంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కి సంబంధించి నారా లోకేష్ కేసుల విషయం తెలిసిందే.
అయితే ఈ కేసులను బలవంతంగా పెట్టించారని, ఉద్దేశ పూర్వకంగా రాజకీయ కారణాలతో చంద్రబాబును జైలుకు పంపించారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనికి సంబంధించి కూడా నిజానిజాలు తెలుసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నం చేశారు. అయితే అనూహ్యంగా వీటికి సంబంధించిన ఫైళ్లు కూడా అమరావతి రాజధానికి సమీపంలోనే తగలబడిపోయాయి. ఇక ఫైబర్ నెట్ కి సంబంధించిన కేసుల్లోనూ కీలక ఫైళ్లు అగ్నికి ఆహుతి కావడం ఈ నెల రోజుల్లోనే జరిగింది. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులపై వచ్చిన ఆరోపణలు, అసైన్డ్ భూముల విషయానికి సంబంధించి నమోదైన కేసుల వివరాలు ఆసక్తి రేపుతున్నాయి.
ఇలాంటి సమయంలో మదనపల్లెలో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. వివాదాస్పద చుక్కల భూములు, 22ఏ, అసైన్డ్ భూములకు సంబంధించి.. మదనపల్లిలోని ఆర్టీవో ఆఫీస్ లో ఆదివారం అర్ధరాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో ఫైళ్లు తగలబడిపోవడం గమనార్హం. గతంలోని ఎప్పుడు ఇలా జరగలేదు. కానీ.. ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? దీనివెనుక ఎవరున్నారు ? అనేది తెలియాల్సి ఉంది. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగంలోనూ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న అధికారులు ఉన్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.
మరి ఇదే నిజమైతే ఇన్నాళ్లు చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు వేచి చూసింది? ఇప్పటికే కొంతమంది ట్రాన్స్ఫర్ చేయగా మరి కొంతమంది విషయంలో ఎందుకు ఇలా వ్యవహరిస్తోంది? అనేది చర్చ చేయాల్సిన అవసరం ఉంది. మదన పల్లి వ్యవహారాన్ని మాత్రమే సీరియస్గా తీసుకున్న చంద్రబాబు.. వీటి వెనుక ఎవరున్నారనే విషయం తెల్చాలని నిర్ణయించారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసే వ్యూహం అయితే కనిపిస్తోంది. కానీ.. ఫైళ్ల సంగతి తేల్చేందుకు ఒక్క పెద్దిరెడ్డిని మాత్రమే పట్టుకునే ప్రయత్నం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. అసలు ఎందుకు ఫైళ్లు ధహనం అవుతున్నాయనే విషయంపై దృష్టి పెట్టాల్సి ఉంది.
This post was last modified on July 24, 2024 1:54 pm
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…