తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ విపక్ష బీఆర్ఎస్ పార్టీని బలహీన పర్చేందుకు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. మరింత మందిని చేర్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలలో ఉండగా పార్టీ మారిన 10 మంది మీద అనర్హత వేటు వేయాలని ఇటు స్పీకర్, అటు కోర్టులను బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది.
అదే సమయంలో ఈ పది స్థానాలలో ఉఫ ఎన్నికలు ఖాయం అన్న ప్రచారం కూడా మొదలుపెట్టింది. గతంలో ఉన్న కోర్టు తీర్పు ప్రకారం స్పీకర్ ఖచ్చితంగా అనర్హత వేటు వేయడం ఖాయమని బీఆర్ఎస్ వాదిస్తున్నది. మరో 16 మందిని ఎలాగైనా చేర్చుకోవడం ఖాయం అని, అప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుంది కాబట్టి తమ పదవులకు ఢోకా ఉండదని పార్టీ మారిన ఎమ్మెల్యేలు అంటున్నారు.
అయితే బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకు వేసి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చెందిన నియోజకవర్గాలలో ఇంచార్జ్ లను నియమించేందుకు ప్రణాళిక సిద్దం చేసింది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాలలో పార్టీ క్యాడర్ కు మనోస్థైర్యం కల్పించేందుకు కేటీఆర్, హరీష్ రావులు ఒక విడత పర్యటించి సమావేశాలు నిర్వహించారు.
కడియం శ్రీహరి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు ఇంచార్జ్ పదవి ఇచ్చారు. పటాన్ చెరులో మహిపాల్ రెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో కొలను బాల్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డిలు ఇంఛార్జ్ పదవులు ఆశిస్తున్నారు. జగిత్యాలలో పార్టీ సీనియర్ నేత ఓరుగంటి రమణారావు, గద్వాలలో మాజీ శాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, ఖైరతాబాద్ లో దాసోజు శ్రవణ్, మన్నె గోవర్దన్ రెడ్డిలు ఇంఛార్జ్ కోసం ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో బాన్స్ వాడ, చేవెళ్ల, భద్రాచలం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలలో పలువురు ఆశావాహులు పార్టీ పగ్గాల కోసం ప్రయత్నిస్తున్నారు. మరి అనర్హత వేటు ఖాయమేనా ? ఉప ఎన్నికలు వస్తాయా ? అన్నది వేచిచూడాలి.
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…