Political News

ఆ పది చోట్లా ఉప ఎన్నికలు ఖాయమేనా ?!

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ విపక్ష బీఆర్ఎస్ పార్టీని బలహీన పర్చేందుకు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. మరింత మందిని చేర్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలలో ఉండగా పార్టీ మారిన 10 మంది మీద అనర్హత వేటు వేయాలని ఇటు స్పీకర్, అటు కోర్టులను బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది.

అదే సమయంలో ఈ పది స్థానాలలో ఉఫ ఎన్నికలు ఖాయం అన్న ప్రచారం కూడా మొదలుపెట్టింది. గతంలో ఉన్న కోర్టు తీర్పు ప్రకారం స్పీకర్ ఖచ్చితంగా అనర్హత వేటు వేయడం ఖాయమని బీఆర్ఎస్ వాదిస్తున్నది. మరో 16 మందిని ఎలాగైనా చేర్చుకోవడం ఖాయం అని, అప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుంది కాబట్టి తమ పదవులకు ఢోకా ఉండదని పార్టీ మారిన ఎమ్మెల్యేలు అంటున్నారు.

అయితే బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకు వేసి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చెందిన నియోజకవర్గాలలో ఇంచార్జ్ లను నియమించేందుకు ప్రణాళిక సిద్దం చేసింది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాలలో పార్టీ క్యాడర్ కు మనోస్థైర్యం కల్పించేందుకు కేటీఆర్, హరీష్ రావులు ఒక విడత పర్యటించి సమావేశాలు నిర్వహించారు.

కడియం శ్రీహరి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు ఇంచార్జ్ పదవి ఇచ్చారు. పటాన్ చెరులో మహిపాల్ రెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో కొలను బాల్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డిలు ఇంఛార్జ్ పదవులు ఆశిస్తున్నారు. జగిత్యాలలో పార్టీ సీనియర్ నేత ఓరుగంటి రమణారావు, గద్వాలలో మాజీ శాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, ఖైరతాబాద్ లో దాసోజు శ్రవణ్, మన్నె గోవర్దన్ రెడ్డిలు ఇంఛార్జ్ కోసం ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో బాన్స్ వాడ, చేవెళ్ల, భద్రాచలం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలలో పలువురు ఆశావాహులు పార్టీ పగ్గాల కోసం ప్రయత్నిస్తున్నారు. మరి అనర్హత వేటు ఖాయమేనా ? ఉప ఎన్నికలు వస్తాయా ? అన్నది వేచిచూడాలి.

This post was last modified on July 24, 2024 10:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమంటున్న సీఎం

2029లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ తామే విజ‌యం దక్కించుకుంటామ‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవ‌రు ఎన్ని జిమ్మిక్కులు…

57 minutes ago

వారిని కూడా జైల్లో వేస్తానంటున్న జగన్

ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…

2 hours ago

రుషికొండ ప్యాలెస్ విశాఖకే ఆణిముత్యమా?

వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…

2 hours ago

ప్రభాస్ ఇమేజ్ సరిపోవట్లేదా రాజా?

మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…

3 hours ago

జగన్ కోటి సంతకాల కృషి ఫలించేనా?

రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…

3 hours ago

మారిపోయిన దేవర విలన్

బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…

5 hours ago