తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ విపక్ష బీఆర్ఎస్ పార్టీని బలహీన పర్చేందుకు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. మరింత మందిని చేర్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలలో ఉండగా పార్టీ మారిన 10 మంది మీద అనర్హత వేటు వేయాలని ఇటు స్పీకర్, అటు కోర్టులను బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది.
అదే సమయంలో ఈ పది స్థానాలలో ఉఫ ఎన్నికలు ఖాయం అన్న ప్రచారం కూడా మొదలుపెట్టింది. గతంలో ఉన్న కోర్టు తీర్పు ప్రకారం స్పీకర్ ఖచ్చితంగా అనర్హత వేటు వేయడం ఖాయమని బీఆర్ఎస్ వాదిస్తున్నది. మరో 16 మందిని ఎలాగైనా చేర్చుకోవడం ఖాయం అని, అప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుంది కాబట్టి తమ పదవులకు ఢోకా ఉండదని పార్టీ మారిన ఎమ్మెల్యేలు అంటున్నారు.
అయితే బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకు వేసి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చెందిన నియోజకవర్గాలలో ఇంచార్జ్ లను నియమించేందుకు ప్రణాళిక సిద్దం చేసింది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాలలో పార్టీ క్యాడర్ కు మనోస్థైర్యం కల్పించేందుకు కేటీఆర్, హరీష్ రావులు ఒక విడత పర్యటించి సమావేశాలు నిర్వహించారు.
కడియం శ్రీహరి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు ఇంచార్జ్ పదవి ఇచ్చారు. పటాన్ చెరులో మహిపాల్ రెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో కొలను బాల్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డిలు ఇంఛార్జ్ పదవులు ఆశిస్తున్నారు. జగిత్యాలలో పార్టీ సీనియర్ నేత ఓరుగంటి రమణారావు, గద్వాలలో మాజీ శాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, ఖైరతాబాద్ లో దాసోజు శ్రవణ్, మన్నె గోవర్దన్ రెడ్డిలు ఇంఛార్జ్ కోసం ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో బాన్స్ వాడ, చేవెళ్ల, భద్రాచలం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలలో పలువురు ఆశావాహులు పార్టీ పగ్గాల కోసం ప్రయత్నిస్తున్నారు. మరి అనర్హత వేటు ఖాయమేనా ? ఉప ఎన్నికలు వస్తాయా ? అన్నది వేచిచూడాలి.
This post was last modified on July 24, 2024 10:30 am
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు జాగర్లమూడి క్రిష్. తన తొలి చిత్రం గమ్యం ఎంత సంచలనం…
రాజకీయాల్లో తొడ కట్టడం విమర్శలకు గుర్తించడం నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. అయితే అందరూ అలా ఉంటారని కాదు కానీ…
90వ దశకంలో తెలుగు సినీ ప్రియులను ఒక ఊపు ఊపిన కథానాయికల్లో రంభ ఒకరు. అసలు పేరు విజయలక్ష్మి అయినప్పటికీ…
ఏపీలో రోజుకో మలుపు తిరుగుతున్న మద్యం కుంభకోణంలో సోమవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అన్నీ తానై…
వైసీపీ నుంచి బయటకు వచ్చిన రఘురామకృష్ణరాజు.. టీడీపీలో చేరి.. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఉండినియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో…
తెలంగాణ గొప్పతనాన్ని దశదిశలా చాటుతామని చెప్పిన వారు... ఏం చేశారో.. ఏమో తెలియదుకానీ.. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి మాత్రం నిజంగానే…