ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు. మామూలుగా అయితే ఏపీ వాళ్లకు పెద్దగా బడ్జెట్ మీద ఆశలుండేవి కావు. ఎన్నో ఏళ్ల నుంచి ఏపీకి బడ్జెట్లో రిక్త హస్తమే మిగులుతోంది. 2014-18 మధ్య కేంద్రంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్నా సరే.. చెప్పుకోదగ్గ స్థాయిలో కేటాయింపులు లేవు. ఆ తర్వాత వైసీపీ హయాంలో పరిస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
గత పదేళ్లు ఎవరి మీదా ఆధారపడకుండా సొంతంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో బడ్జెట్లో ఏపీకి కేటాయింపులే ఉండేవి కావు. కానీ ఈసారి తెలుగుదేశం, జనసేన మీద ఆధారపడాల్సి రావడంతో బడ్జెట్లో కేటాయింపులు పెద్ద స్థాయిలోనే ఇచ్చింది కేంద్రం. రాజధాని అమరావతి కోసం రూ.15 వేల కోట్లతో పాటు పోలవరం సహా అనేక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర జనాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీకి మంచి రోజులు వచ్చాయని సంబరపడుతున్నారు.
కానీ ఈ సమయంలో ప్రతిపక్ష వైసీపీ మాత్రం మౌనం వహిస్తోంది. వైసీపీ అధికార హ్యాండిల్లో ఏపీకి దక్కిన కేటాయింపుల గురించి ఒక్క ట్వీట్ కూడా వేయని పరిస్థితి. కొత్త ఉద్యోగలకు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అమలు చేయబోతుండడాన్ని ప్రస్తావిస్తూ.. ఇది జగన్ ప్రభుత్వ స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయం అంటూ సంబంధంలేని లంకె పెట్టి ఎలివేషన్లు వేసుకున్నారు తప్ప.. ఏపీకి భారీ స్థాయిలో కేటాయింపులు జరిగితే దాని ఊసు మాత్రం లేదు.
జగన్ సహా వైసీపీ అగ్ర నేతల్లో చాలా వరకు కూడా బడ్జెట్ గురించి మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు. అంబటి రాంబాబు మాత్రం 15 వేల కోట్లు అమరావతికే ఇస్తే.. మిగతా రాష్ట్రం పరిస్థితి ఏంటి అంటూ ఒక ట్వీట్ వేశారు. రాష్ట్రానికి మంచి జరుగుతుంటే రాజకీయాలు పక్కన పెట్టి బడ్జెట్పై సానుకూలంగా స్పందించాల్సింది పోయి.. కూటమి ప్రభుత్వానికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అని వైసీపీ వాళ్లు బాధ పడుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఐదేళ్లు కూడా వైసీపీ ఇలాగే బాధ పడక తప్పని పరిస్థితే ఉంటుందేమో.
This post was last modified on July 23, 2024 10:45 pm
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…