తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఏపీ రాజధానికి రూ.15 వేల కోట్ల రూపాయలను ప్రకటించారు. అయితే.. ఈ ప్రకటన వెలువడిన వెంటనే రాజధాని అమరావతిలోనూ.. ఏపీ అసెంబ్లీలోనూ(అప్పుడే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశ పెట్టారు) సంబరాల వాతావరణం ఏర్పడింది. అయితే.. గంటలు గడిచిన తర్వాత.. ఇదే రూ.15 వేల కోట్లపై తీవ్ర దుమారం రేగింది. వివాదంగా మారింది. అసలు కేంద్రం ఇచ్చింది.. గ్రాంటా? లేక అప్పా..? అనే విషయంపై తీవ్ర వివాదంగా మారింది.
తొలుత ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ గురుమూర్తి పార్లమెంటులోనే లేవనెత్తారు. అయితే.. ఈ విషయంపై నిర్మలా సీతారామన్ అప్పటికప్పుడు స్పందించలేదు. తర్వాత.. మీడియా సమావేశంలో స్పందించారు. ఏపీ రాజధాని అమరావతికి కేటాయించిన రూ.15 వేల కోట్లు అప్పు మాత్రమే. దీనిని ఆర్బీఐ నుంచి ఇప్పిస్తాం. ఒకవేళ కుదరకపోతే.. వేరే వనరుల నుంచి ఇప్పిస్తాం. అయితే.. దీనిని ఎప్పటిలోపు తీర్చాలి? ఎలా తీర్చాలి? ఎవరు తీర్చాలి? అనే విషయాలపై ఏపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని నిర్మలమ్మ స్పష్టం చేశారు. దీంతో రూ. 15000 కోట్లు గ్రాంట్లు(తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేని) కాదని.. అప్పేనని తేలిపోయింది.
చంద్రబాబు రియాక్షన్ ఇదీ..
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతున్న సమయంలోనే ఈ విషయం ఆయనకు కూడా తెలిసింది. రాష్ట్రానికి ఇస్తామని ప్రకటించిన మొత్తం రూ.15 వేల కోట్లు కూడా అప్పేనని తెలియడంతో ఆయన ఆశ్చర్యపోలేదు. ఏదో ఒక రూపంలో తమకు అందితే చాలని.. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో దీనిని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు.
This post was last modified on July 23, 2024 10:17 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…