తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఏపీ రాజధానికి రూ.15 వేల కోట్ల రూపాయలను ప్రకటించారు. అయితే.. ఈ ప్రకటన వెలువడిన వెంటనే రాజధాని అమరావతిలోనూ.. ఏపీ అసెంబ్లీలోనూ(అప్పుడే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశ పెట్టారు) సంబరాల వాతావరణం ఏర్పడింది. అయితే.. గంటలు గడిచిన తర్వాత.. ఇదే రూ.15 వేల కోట్లపై తీవ్ర దుమారం రేగింది. వివాదంగా మారింది. అసలు కేంద్రం ఇచ్చింది.. గ్రాంటా? లేక అప్పా..? అనే విషయంపై తీవ్ర వివాదంగా మారింది.
తొలుత ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ గురుమూర్తి పార్లమెంటులోనే లేవనెత్తారు. అయితే.. ఈ విషయంపై నిర్మలా సీతారామన్ అప్పటికప్పుడు స్పందించలేదు. తర్వాత.. మీడియా సమావేశంలో స్పందించారు. ఏపీ రాజధాని అమరావతికి కేటాయించిన రూ.15 వేల కోట్లు అప్పు మాత్రమే. దీనిని ఆర్బీఐ నుంచి ఇప్పిస్తాం. ఒకవేళ కుదరకపోతే.. వేరే వనరుల నుంచి ఇప్పిస్తాం. అయితే.. దీనిని ఎప్పటిలోపు తీర్చాలి? ఎలా తీర్చాలి? ఎవరు తీర్చాలి? అనే విషయాలపై ఏపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని నిర్మలమ్మ స్పష్టం చేశారు. దీంతో రూ. 15000 కోట్లు గ్రాంట్లు(తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేని) కాదని.. అప్పేనని తేలిపోయింది.
చంద్రబాబు రియాక్షన్ ఇదీ..
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతున్న సమయంలోనే ఈ విషయం ఆయనకు కూడా తెలిసింది. రాష్ట్రానికి ఇస్తామని ప్రకటించిన మొత్తం రూ.15 వేల కోట్లు కూడా అప్పేనని తెలియడంతో ఆయన ఆశ్చర్యపోలేదు. ఏదో ఒక రూపంలో తమకు అందితే చాలని.. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో దీనిని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు.
This post was last modified on July 23, 2024 10:17 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…