మిగతా రాజకీయ నాయకులతో పోలిస్తే తాను భిన్నం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు చాటుతూనే ఉంటాడు. ఆయన ప్రసంగాలు, వ్యవహార శైలి మొదట్నుంచి భిన్నమే. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా కూడా పవన్ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాడు. తప్పు చేస్తే తనను కూడా శిక్షించండి అంటూ ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం విశేషం.
అంతే కాక తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా తప్పు చేసినా సహించేది లేదని.. వాళ్లను నియంత్రించే బాధ్యత తనదని పవన్ పేర్కొన్నాడు. కూటమి ప్రభుత్వానికి ఎవ్వరు ఇబ్బంది కలిగించినా ఉపేక్షించేది లేదని చెప్పిన పవన్.. ఇంతకుముందు పార్టీ అంతర్గత సమావేశంలో చెప్పిన మాటలనే అసెంబ్లీలో గుర్తు చేసి మరీ తన పార్టీ నేతలకు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఈ క్రమంలోనే తప్పు చేస్తే తనైనా శిక్షించాలని పవన్ వ్యాఖ్యానించారు.
‘‘నా లాంటి వాడు కూడా తప్పులు చేసినా అధ్యక్షా.. నిస్సందేహంగా నా లాంటి వాడిని కూడా శిక్షించాల్సిందే. అలాంటి బలమైన సంకేతాలు ప్రజలకు పంపించాలి అధ్యక్షా. మేమందరం కూడా తప్పు ఎవరు చేసినా మనమే దాని మీద చర్యలు తీసుకోకపోతే కష్టం. నేను కూడా దీనికి సంసిద్ధంగా ఉన్నాను. నా ద్వారా ఏదైనా తప్పులు జరిగినా.. అవకతవకలు జరిగినా నా మీద కూడా చర్యలు తీసుకోవాలి.
అది ఎలాంటి విషయమైనా సరే. కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తే అలాంటి వారిని వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఇంతకుముందే స్పష్టంగా తెలియజేశాను. ఇసుక విధానంలో కానీ, మైనింగ్ విధానాల్లో కానీ.. గత ప్రభుత్వం చేసింది కదా మేం కూడా చేస్తాం అని.. ఎవరైనా జనసేన తరఫున ఎవరైనా ఉంటే వారిని నియంత్రించే బాధ్యత, సరి చేసే బాధ్యత మేం తీసుకుంటాం’’ అని పవన్ అసెంబ్లీలో పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మంచి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకునే ప్రతి నిర్ణయానికీ తన మద్దతు ఉంటుందని ఆయన్నారు.
This post was last modified on July 23, 2024 5:44 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…