జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.. రఘురామకృష్ణరాజు(ఆర్.ఆర్.ఆర్) నుంచి చూసి నేర్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని తెలిపారు. జగన్ ఆయనపై ఎన్నో అక్రమ కేసులు పెట్టి పోలీసులతో కొట్టించినా.. అవేవీ మనసులో పెట్టుకోకుండా.. సభలో జగన్ కనిపించగానే వెళ్లి ఆప్యాయంగా పలకరించారని తెలిపారు. సభ్యులందరూ.. ఈ మంచి లక్షణాన్ని నేర్చుకోవాలని సూచించారు.
ఎవరూ కక్ష సాధింపులకు, అక్రమాలకు అన్యాయాలకు తావులేకుండా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. తాను తప్పు చేసినా.. ప్రశ్నించాలని, శిక్షించాలని అన్నారు. జనసేన నాయకులు తప్పులు చేసినా వదిలి పెట్టవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబువైపు చూస్తూ వ్యాఖ్యానించారు. అవినీతి అసలే చేయొద్దని చెప్పారు.
చంద్రబాబు వంటి అనుభవజ్ఞుల సమక్షంలో పనిచేయడం గర్వకారణమని తెలిపారు. ఆయన తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు వంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడి ఆధ్వర్యంలో పని చేస్తామని తెలిపారు.
రాష్ట్ర ఖజానా ప్రస్తుతం ఖాళీగా ఉందని పవన్ చెప్పారు. రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ఆగిపోయాయని తెలిపారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. పెట్టుబడులు రాకుండా చేశారని, కేంద్ర బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని పవన్ చెప్పారు. కాగా.. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు పవన్ సమాధానం ఇస్తూ.. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు.
దీంతో వైసీపీ సభ్యులు ఒక్కసారిగా నినాదాలు చేశారు. అయినా.. పవన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. పంచాయతీలకు నిధులు సక్రమంగా అందేలా సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.
This post was last modified on July 23, 2024 8:45 pm
చిన్న సినిమాలకు రిలీజ్ రోజు కంటే ఒకటి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఐతే పెద్ద…
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నిద్రలేదు.…
ప్రస్తుతం నైజామ్ సింగల్ స్క్రీన్లలో పర్సెంటెజ్ విధానం తీసుకురావడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.…
తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది దిగ్గజ దర్శకులున్నారు. వారిలో సింగీతం శ్రీనివాసరావుది ప్రత్యేకమైన శైలి. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇండియన్…
తమిళనాడులో ఒక రోజు స్ట్రైక్ చేయడానికి నిర్మాతలు పిలుపు ఇవ్వడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా హీరోలు…
ఈ ఏడాది సంక్రాంతి సినిమాల సందడితో ఎంతో ఆశాజనకంగా మొదలైన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఆ తర్వాత ఎంత వెలవెలబోయిందో తెలిసిందే.…