జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.. రఘురామకృష్ణరాజు(ఆర్.ఆర్.ఆర్) నుంచి చూసి నేర్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని తెలిపారు. జగన్ ఆయనపై ఎన్నో అక్రమ కేసులు పెట్టి పోలీసులతో కొట్టించినా.. అవేవీ మనసులో పెట్టుకోకుండా.. సభలో జగన్ కనిపించగానే వెళ్లి ఆప్యాయంగా పలకరించారని తెలిపారు. సభ్యులందరూ.. ఈ మంచి లక్షణాన్ని నేర్చుకోవాలని సూచించారు.
ఎవరూ కక్ష సాధింపులకు, అక్రమాలకు అన్యాయాలకు తావులేకుండా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. తాను తప్పు చేసినా.. ప్రశ్నించాలని, శిక్షించాలని అన్నారు. జనసేన నాయకులు తప్పులు చేసినా వదిలి పెట్టవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబువైపు చూస్తూ వ్యాఖ్యానించారు. అవినీతి అసలే చేయొద్దని చెప్పారు.
చంద్రబాబు వంటి అనుభవజ్ఞుల సమక్షంలో పనిచేయడం గర్వకారణమని తెలిపారు. ఆయన తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు వంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడి ఆధ్వర్యంలో పని చేస్తామని తెలిపారు.
రాష్ట్ర ఖజానా ప్రస్తుతం ఖాళీగా ఉందని పవన్ చెప్పారు. రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ఆగిపోయాయని తెలిపారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. పెట్టుబడులు రాకుండా చేశారని, కేంద్ర బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని పవన్ చెప్పారు. కాగా.. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు పవన్ సమాధానం ఇస్తూ.. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు.
దీంతో వైసీపీ సభ్యులు ఒక్కసారిగా నినాదాలు చేశారు. అయినా.. పవన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. పంచాయతీలకు నిధులు సక్రమంగా అందేలా సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.
This post was last modified on July 23, 2024 8:45 pm
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…