ఒక్క ఓటమి వైసీపీ నేతల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తుంది. ఇంట్లో ఉండలేరు, బయట తిరగలేరు. ఐదేళ్ల అధికారంలో వారు వ్యవహరించిన తీరే ప్రస్తుతం వారిని ఈ పరిస్థితికి తీసుకువచ్చిందని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పద్దతిగా వ్యవహరించి ఉంటే ఈ రోజు ఓటమి పాలైనా ప్రజలలో ఒకింత సానుభూతి ఉండేదని అంటున్నారు.
రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న సినీనటి, మాజీ మంత్రి రోజా నగరి శాసనసభ స్థానం నుండి 2004లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి 5 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఆ తరువాత మారిన పరిస్థితులలో టీడీపీని వీడి వైసీపీలో చేరింది. 2014 ఎన్నికల్లో గాలి ముద్దుక్రిష్ణమనాయుడుపై 858 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో గాలి భానుప్రకాష్ మీద 2708 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కింది.
రెండు సార్లు రోజా గెలిచింది చావు తప్పి కన్నులొట్టబోయినట్లే. అయితే వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రోజా వైసీపీ పార్టీలోనే శత్రువులను పెంచుకున్నారు. తన కోసం కష్టపడిన నేతలు, కార్యకర్తలను గాలికి వదిలేసి నియోజకవర్గంలో కుటుంబ పెత్తనానికి ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో ఏకంగా 45004 భారీ తేడాతో ఓటమి చవిచూసింది.
ఓటమి తర్వాత నియోజకవర్గంలో మొకం చూపలేని పరిస్థితికి రోజా వచ్చింది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో కేవలం రెండు సార్లు మాత్రమే బయటకు వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు సోదరులు, భర్తల జోక్యం మితిమీరడంతో పార్టీ క్యాడర్ అంతా రోజాకు దూరమయింది. ఇన్నాళ్లూ రాజకీయాల్లో బిజీగా గడిపిన రోజా ఇప్పుడు ఇంటి నుండి అస్సలు బయటకు రావడం లేదు. కుటుంబసభ్యులతో విహారయాత్రలు, గుడులలో పూజలకు మాత్రమే పరిమితమయింది. నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికి పిలిచే వారు కూడా కరువయ్యారని అంటున్నారు. ఎంతో కష్టపడి సినిమాల నుండి రాజకీయాల్లో మంత్రి స్థాయికి ఎదిగిన రోజా తన ప్రవర్తనతో రాజకీయ భవిష్యత్తు సమాధికి బాటలు వేసుకున్నారని అంటున్నారు.
This post was last modified on July 23, 2024 4:05 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…