ఒక్క ఓటమి వైసీపీ నేతల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తుంది. ఇంట్లో ఉండలేరు, బయట తిరగలేరు. ఐదేళ్ల అధికారంలో వారు వ్యవహరించిన తీరే ప్రస్తుతం వారిని ఈ పరిస్థితికి తీసుకువచ్చిందని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పద్దతిగా వ్యవహరించి ఉంటే ఈ రోజు ఓటమి పాలైనా ప్రజలలో ఒకింత సానుభూతి ఉండేదని అంటున్నారు.
రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న సినీనటి, మాజీ మంత్రి రోజా నగరి శాసనసభ స్థానం నుండి 2004లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి 5 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఆ తరువాత మారిన పరిస్థితులలో టీడీపీని వీడి వైసీపీలో చేరింది. 2014 ఎన్నికల్లో గాలి ముద్దుక్రిష్ణమనాయుడుపై 858 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో గాలి భానుప్రకాష్ మీద 2708 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కింది.
రెండు సార్లు రోజా గెలిచింది చావు తప్పి కన్నులొట్టబోయినట్లే. అయితే వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రోజా వైసీపీ పార్టీలోనే శత్రువులను పెంచుకున్నారు. తన కోసం కష్టపడిన నేతలు, కార్యకర్తలను గాలికి వదిలేసి నియోజకవర్గంలో కుటుంబ పెత్తనానికి ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో ఏకంగా 45004 భారీ తేడాతో ఓటమి చవిచూసింది.
ఓటమి తర్వాత నియోజకవర్గంలో మొకం చూపలేని పరిస్థితికి రోజా వచ్చింది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో కేవలం రెండు సార్లు మాత్రమే బయటకు వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు సోదరులు, భర్తల జోక్యం మితిమీరడంతో పార్టీ క్యాడర్ అంతా రోజాకు దూరమయింది. ఇన్నాళ్లూ రాజకీయాల్లో బిజీగా గడిపిన రోజా ఇప్పుడు ఇంటి నుండి అస్సలు బయటకు రావడం లేదు. కుటుంబసభ్యులతో విహారయాత్రలు, గుడులలో పూజలకు మాత్రమే పరిమితమయింది. నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికి పిలిచే వారు కూడా కరువయ్యారని అంటున్నారు. ఎంతో కష్టపడి సినిమాల నుండి రాజకీయాల్లో మంత్రి స్థాయికి ఎదిగిన రోజా తన ప్రవర్తనతో రాజకీయ భవిష్యత్తు సమాధికి బాటలు వేసుకున్నారని అంటున్నారు.
This post was last modified on July 23, 2024 4:05 pm
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…