తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలకు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఈ రోజు తెలంగాణ భవన్ లో పార్టీ శాసనసభా పక్ష నేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
శస్త్రచికిత్స నేపథ్యంలో గత శాసనసభ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా ఉండి సమావేశాలకు హాజరు కావడం లేదని, శాసనసభలో తాము నిలదీస్తామనే కేసీఆర్ పారిపోతున్నారని సీఎం రేవంత్, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేఫథ్యంలో నేటి నుండి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరుకానున్నారన్న వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి.
ముఖ్యంగా శాసనసభ సమావేశాలలో నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్, ఫీజు రీ ఎంబర్స్ మెంట్, శాంతిభద్రతలు, మూసీ ప్రక్షాళన, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతు రుణమాఫీ, రైతుభరోసా అమలుతో పాటు కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఆరుగ్యారంటీల అమలు మీద నిలదీయాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. ఇక ప్రభుత్వంలో అవినీతిపై ప్రశ్నించేందుకు బీజేపీ సిద్దం అవుతుంది. వీటన్నింటినీ కాంగ్రెస్ పార్టీ ఎలా తిప్పికొడుతుందో వేచిచూడాలి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో సారి సమావేశాలు జరుగుతుండడంతో అధికార పార్టీగా కాంగ్రెస్ సక్సెస్ అవుతుందా ? లేదా ? అన్నది ఉత్కంఠ నెలకొన్నది.
This post was last modified on July 23, 2024 3:59 pm
ఎప్పుడో ఆరేళ్ళ క్రితం రిలీజైన సినిమా. ఓటిటిలో వచ్చేసి అక్కడా మిలియన్ల వ్యూస్ సాధించుకుంది. ఇప్పుడు కొత్తగా రీ రిలీజ్…
సెప్టెంబర్ నెల సగానికి పైనే అయిపోయింది. ఇకపై ఆకాశమే హద్దుగా గేమ్ ఛేంజర్ నాన్ స్టాప్ అప్డేట్స్ ఉంటాయని దిల్…
యూత్ హీరో సుహాస్ కొత్త సినిమా గొర్రె పురాణం ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ట్రైలర్ కూడా వచ్చేసింది.…
జనసేన పార్టీ నాయకుడు, ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై పార్టీ వేటు వేసింది. ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా…
కొన్ని నెలల క్రితం లాల్ సలామ్ అనే సినిమా ఒకటొచ్చిందనే సంగతే చాలా మంది సగటు ప్రేక్షకులు మర్చిపోయి ఉంటారు.…
స్టార్ హీరోలు నటించిన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి భారీ వసూళ్లు సాధించడంలో ఆశ్చర్యం లేదు. కానీ చిన్న బడ్జెట్…