తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలకు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఈ రోజు తెలంగాణ భవన్ లో పార్టీ శాసనసభా పక్ష నేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
శస్త్రచికిత్స నేపథ్యంలో గత శాసనసభ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా ఉండి సమావేశాలకు హాజరు కావడం లేదని, శాసనసభలో తాము నిలదీస్తామనే కేసీఆర్ పారిపోతున్నారని సీఎం రేవంత్, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేఫథ్యంలో నేటి నుండి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరుకానున్నారన్న వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి.
ముఖ్యంగా శాసనసభ సమావేశాలలో నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్, ఫీజు రీ ఎంబర్స్ మెంట్, శాంతిభద్రతలు, మూసీ ప్రక్షాళన, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతు రుణమాఫీ, రైతుభరోసా అమలుతో పాటు కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఆరుగ్యారంటీల అమలు మీద నిలదీయాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. ఇక ప్రభుత్వంలో అవినీతిపై ప్రశ్నించేందుకు బీజేపీ సిద్దం అవుతుంది. వీటన్నింటినీ కాంగ్రెస్ పార్టీ ఎలా తిప్పికొడుతుందో వేచిచూడాలి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో సారి సమావేశాలు జరుగుతుండడంతో అధికార పార్టీగా కాంగ్రెస్ సక్సెస్ అవుతుందా ? లేదా ? అన్నది ఉత్కంఠ నెలకొన్నది.
This post was last modified on July 23, 2024 3:59 pm
క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరొందిన పావలా శ్యామల కన్ను మూశారు. గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న శ్యామల గారికి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…