ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో తొలిరోజు సభ ముగిసింది. ఈ రోజు సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దాంతోపాటు సభలో 2 ప్రభుత్వ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ రిపీట్ బిల్ 2024, డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సవరణ బిల్లు 2024 లను సభ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో నాడు-నేడు కార్యక్రమంలోని అవినీతిపై ప్రశ్న వచ్చింది.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో నాడు-నేడు పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని లోకేష్ ప్రకటించారు. నాడు-నేడు పనులపై విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలు పెంచుతామని, ప్రభుత్వ పాఠశాలలను కాపాడతామని లోకేష్ చెప్పారు. నాసిరకం పనులపై విచారణ జరిపిస్తామని, అక్రమాలకు బాధ్యులైనవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని లోకేష్ హెచ్చరించారు. వచ్చే ఏడాది నుంచి విద్యావ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని లోకేష్ చెప్పారు. అత్యుత్తమ విద్యా విధానాన్ని తీసుకువస్తామని, ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటు స్కూళ్లకు దీటుగా డెవలప్ చేస్తామని చెప్పారు. టీచర్ల సంఖ్య పెంచేందుకే మెగా డీఎస్సీ వేశామని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పేరుతో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రస్తావించారు. కేంద్రీకృత కొనుగోళ్లతో వైసీపీ భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందని, పాఠశాల కమిటీల పేరుతో వైసీపీ నేతలు దోపిడీకి తెరలేపారని అన్నారు.
This post was last modified on July 23, 2024 3:50 pm
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…