చంద్రబాబు అనుకున్నది సాధించారు. తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ను గమనిస్తే.. కీలకమైన రంగాలుగా ఉన్న అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు.. నిధులు రాబట్టారు. ప్రత్యక్షంగా అమరావతి నిర్మాణంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. రూ.15 వేల కోట్లు ఇస్తామన్నారు. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి నిధులు ప్రకటించకపోయినా.. పూర్తి చేసేందుకు సాయం చేస్తామన్నారు. పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రకటన కాబట్టి.. ఈ విషయంలో చంద్రబాబు పడిన తపన అయితే.. ఫలించింది.
ఇక, వెనుక బడిన జిల్లాలకు నిధులు.. అదేవిధంగా చంద్రబాబు ఆశిస్తున్న హైదరాబాద్-బెంగళూరు హైవే.. కు కూడా రంగం రెడీ అయింది. పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. మొత్తంగా చూస్తే.. కేటాయింపులు ఒక్క అమరావతికే ఉన్నట్టు కనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం చంద్రబాబు ఆశించిన మేరకు సఫలమయ్యారనే చెప్పాలి. గతంలో జగన్తో పోల్చుకుంటే.. చంద్రబాబు ఈ విషయంలో బెటర్ అనే భావన వ్యక్తమైంది.
నిజానికి బడ్జెట్ అంచనాల సమయంలోనే ప్రత్యేక హోదా అడగాలన్న ఒత్తిడి ఆయనపై వచ్చింది. అయితే.. కొంత తెలివిగా వ్యవహరించిన చంద్రబాబు ఎలానూ ఇవ్వని దానిని అడిగి లేదని అనిపించుకునే కంటే కూడా.. ఇతర అంశాల్లో సాధించుకుంటున్నామనే వుద్దేశంతోనే ఆయన ముందుకు కదిలారు. ఈ క్రమంలో పోలవరం పూర్తి బాధ్యతను కేంద్రంపైనే పెట్టేశారు. తాజాగా మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన వెనుక అంతరార్థం ఇదే. కాబట్టి.. పోలవరం విషయంలో చంద్రబాబు కలలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అమరావతి కూడా పట్టాలకెక్కనుంది.
గతంలో జగన్ పాలనను గమనిస్తే.. ఏదో అడిగామని చెప్పుకొన్నా.. పెద్దగా రాష్ట్రానికి వచ్చిన నిధులు ఏమీలేవు. పైగా బీజేపీ బలంగా ఉండడం కూడా.. దీనికి కారణమనే చెప్పాలి. ఏదేమైనా.. గత ఐదేళ్లతో పోల్చుకుంటే.. ఏపీకి కొంత మేరకు అయినా.. చంద్రబాబు సాధించగలిగారనడంలో సందేహం లేదు. ఇదే విషయాన్ని కోట్ చేస్తూ.. మంత్రి నారా లోకేష్ స్పందించారు. పోలవరం నిర్మాణానికి సహాకారంతో పాటు.. అమరావతికి రూ.15 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామన్న నిర్మలమ్మ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఐదు కోట్ల మంది ప్రజల పక్షాన ఆయన ధన్యవాదాలు తెలిపారు.
This post was last modified on July 23, 2024 3:35 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…