ప్రధాన మంత్రి నరేంద్రమోడీ.. తన మిత్ర పక్షాలకు కొంత మేరకు న్యాయం చేశారు. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ను పరిశీలిస్తే.. మోడీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ప్రస్తుత ఎన్డీయే కూటమిలో ఏపీలోని టీడీపీ, బిహార్ అధికార పార్టీ జేడీయూ(జనతాదళ్ యునైటెడ్)లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మోడీ సర్కారు వీరి మద్దతు లేకపోతే.. పడిపోయే ప్రమాదం ఉంది. దీంతో తాజాగా విడుదలచేసిన బడ్జెట్లో ఈ రెండు రాష్ట్రాలకు లేదనకుండా .. కొంత మేరకు న్యాయం అయితే చేశారు.
నిజానికి ఏపీ విషయాన్ని తీసుకుంటే..చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. కేవలం బడ్జెట్ ప్రతి పాదనలతోనే రెండు సార్లు(మొత్తం 4 సార్లు) ఢిల్లీవెళ్లారు. అమరాతికి ఆయన ఆశించిన 25 వేల కోట్లు తక్షణ అవసరం. అదేవిదంగా పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కాఫర్ డ్యాం, గైడ్ బండ్ల పునర్ నిర్మాణా నికి 30 వేల కోట్లు, పునరావాసానికి 30 వేల కోట్లు చొప్పున కేటాయించాలని కోరారు. పైకి చెప్పకపోయినా.. ఎంపీల ద్వారా మీడియాకు తెలిసింది. అదేవిధంగా వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి రూ.350 చొప్పున ప్రతి సంవత్సరం ఇచ్చేలా చూడాలన్నారు.
అయితే.. తాజా బడ్జెట్లో అమరావతికి 15000 కోట్లు కేటాయించినా.. పోలవరం విషయంలో నర్మగర్భంగా వ్యవహరించారు. సాయం చేస్తామని చెబుతూనే.. అంకెలు మాత్రం వెల్లడించలేదు. ఇక, వెనుక బడిన జిల్లాల విషయాన్ని కూడా.. ఇలానే చేశారు. ఎంత ఇస్తామనేది చెప్పలేదు. గతంలో 750 కోట్ల మేరకు సాయం చేశారు. అది మినహాయించుకుని ఇప్పుడు సాయం చేసే అవకాశం ఉంది. ఎలా చూసుకున్నా.,. కొంత వరకే మోడీ సాయం చేస్తున్నారనేది కనిపిస్తోంది. ఇది కూడా ఒక మేలే. వెంటిలేటర్పై నుంచి జనరల్ వార్డుకు వచ్చినట్టే!
ఇక, బీహార్ విషయానికివస్తే.. సీఎం నితీష్ కుమార్ కూడా.. మోడీకి బలమైన మిత్రపక్షంగా ఉన్నారు. ఆయన ఏకంగా 30 వేల కోట్లరూపాయలను సాయం చేయాలని.. అదేవిధంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగారు. హోదా కుదరదని సోమవారమే పార్లమెంటులో తేల్చేసిన.. మోడీ.. తాజా బడ్జెట్లో 11 వేల కోట్ల రూపాయలను ప్రకటించారు. ఈ నిధులను జిల్లాల వారీగా కేటాయిస్తామని చెప్పారు. ఇది కొంత ఊరట ఇచ్చే అంశమే. అలానే.. జాతీయ రహదారుల నిర్మాణానికి మరో 20 వేల కోట్ల రూపాయలను అదనంగా ప్రకటించారు. మొత్తంగా మిత్రులకు అంతో ఇంతో న్యాయం చేశారన్న వాదన అయితే.. వినిపిస్తోంది.
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…