Political News

మిత్రుల‌కు న్యాయం చేసిన మోడీ!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ.. త‌న మిత్ర ప‌క్షాల‌కు కొంత మేర‌కు న్యాయం చేశారు. తాజాగా ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌ను ప‌రిశీలిస్తే.. మోడీ చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు. ప్ర‌స్తుత ఎన్డీయే కూట‌మిలో ఏపీలోని టీడీపీ, బిహార్ అధికార పార్టీ జేడీయూ(జ‌న‌తాద‌ళ్ యునైటెడ్‌)లు కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. మోడీ స‌ర్కారు వీరి మ‌ద్ద‌తు లేక‌పోతే.. ప‌డిపోయే ప్ర‌మాదం ఉంది. దీంతో తాజాగా విడుద‌ల‌చేసిన బ‌డ్జెట్లో ఈ రెండు రాష్ట్రాల‌కు లేద‌న‌కుండా .. కొంత మేర‌కు న్యాయం అయితే చేశారు.

నిజానికి ఏపీ విష‌యాన్ని తీసుకుంటే..చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. కేవ‌లం బ‌డ్జెట్ ప్ర‌తి పాదనల‌తోనే రెండు సార్లు(మొత్తం 4 సార్లు) ఢిల్లీవెళ్లారు. అమ‌రాతికి ఆయ‌న ఆశించిన 25 వేల కోట్లు త‌క్ష‌ణ అవ‌స‌రం. అదేవిదంగా పోల‌వ‌రం ప్రాజెక్టులో కీల‌క‌మైన కాఫ‌ర్ డ్యాం, గైడ్ బండ్‌ల పున‌ర్ నిర్మాణా నికి 30 వేల కోట్లు, పున‌రావాసానికి 30 వేల కోట్లు చొప్పున కేటాయించాల‌ని కోరారు. పైకి చెప్ప‌క‌పోయినా.. ఎంపీల ద్వారా మీడియాకు తెలిసింది. అదేవిధంగా వెనుక బ‌డిన‌ జిల్లాల అభివృద్ధికి రూ.350 చొప్పున ప్ర‌తి సంవ‌త్స‌రం ఇచ్చేలా చూడాల‌న్నారు.

అయితే.. తాజా బ‌డ్జెట్లో అమ‌రావ‌తికి 15000 కోట్లు కేటాయించినా.. పోల‌వ‌రం విష‌యంలో న‌ర్మ‌గ‌ర్భంగా వ్య‌వ‌హ‌రించారు. సాయం చేస్తామ‌ని చెబుతూనే.. అంకెలు మాత్రం వెల్ల‌డించ‌లేదు. ఇక‌, వెనుక బ‌డిన జిల్లాల విష‌యాన్ని కూడా.. ఇలానే చేశారు. ఎంత ఇస్తామ‌నేది చెప్ప‌లేదు. గ‌తంలో 750 కోట్ల మేర‌కు సాయం చేశారు. అది మిన‌హాయించుకుని ఇప్పుడు సాయం చేసే అవ‌కాశం ఉంది. ఎలా చూసుకున్నా.,. కొంత వ‌ర‌కే మోడీ సాయం చేస్తున్నార‌నేది క‌నిపిస్తోంది. ఇది కూడా ఒక మేలే. వెంటిలేట‌ర్‌పై నుంచి జ‌న‌ర‌ల్ వార్డుకు వ‌చ్చిన‌ట్టే!

ఇక‌, బీహార్ విష‌యానికివ‌స్తే.. సీఎం నితీష్ కుమార్ కూడా.. మోడీకి బ‌ల‌మైన మిత్రప‌క్షంగా ఉన్నారు. ఆయ‌న ఏకంగా 30 వేల కోట్ల‌రూపాయ‌ల‌ను సాయం చేయాల‌ని.. అదేవిధంగా ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని అడిగారు. హోదా కుద‌ర‌ద‌ని సోమ‌వారమే పార్ల‌మెంటులో తేల్చేసిన‌.. మోడీ.. తాజా బ‌డ్జెట్‌లో 11 వేల కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌క‌టించారు. ఈ నిధుల‌ను జిల్లాల వారీగా కేటాయిస్తామ‌ని చెప్పారు. ఇది కొంత ఊర‌ట ఇచ్చే అంశమే. అలానే.. జాతీయ ర‌హ‌దారుల నిర్మాణానికి మ‌రో 20 వేల కోట్ల రూపాయ‌ల‌ను అద‌నంగా ప్ర‌క‌టించారు. మొత్తంగా మిత్రుల‌కు అంతో ఇంతో న్యాయం చేశార‌న్న వాద‌న అయితే.. వినిపిస్తోంది.

This post was last modified on July 23, 2024 1:48 pm

Share

Recent Posts

బోండా గండం గట్టేక్కినట్లే

గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం వర్ధంతి సభలో విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారం ఇపుడు తెలుగునాట చర్చనీయంశంగా మారింది.…

2 hours ago

అల్లు అర్జున్ ప్లానింగ్ అందరికీ రాదు

స్టార్ హీరోలు ఎవరికైనా అభిమానులుంటారు. కానీ వాళ్ళతో ఒక ప్రణాళికాబద్ధమైన సంబంధాన్ని ఏర్పరుచుకోవడం అందరి వల్ల కాదు. సీనియర్లలో చిరంజీవి…

3 hours ago

సాలీడు మనిషి వణుకు పుట్టిస్తున్నాడు

ఎల్లుండి విడుదల కాబోతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా క్రేజ్ చూసి ట్రేడ్ షాకవుతోంది. ఈ సిరీస్…

4 hours ago

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వ్యవహారం ఇరు తెలుగు…

7 hours ago

ఇకపై అలా జరగదన్న బోండా ఉమ

దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ హాజరు కావడంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్…

7 hours ago

అక్కడ అమితాబ్… ఇక్కడ రానా

టాలీవుడ్ విలక్షణ నటుడు దగ్గుబాటి రానా ఇంతకుముదులా వరుసగా సినిమాలు చేయడం లేదు. హీరోగా అయితే సినిమాలు పూర్తిగా ఆపేశాడు. విలన్,…

7 hours ago