Political News

రూ.2.2 లక్షల కోట్లు .. మూడు కోట్ల ఇండ్లు

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద దేశంలోని ఇళ్లులేని పేదలకు మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మూడు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని, ఈ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు కూడా చేశామని తెలిపారు.

తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గృహ నిర్మాణాలకు రూ.2.2 లక్షల కోట్లు కేటాయించారు. వచ్చే ఐదేండ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని అన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.2.26 లక్షల కోట్లు కేటాయించారు. ముద్రా రుణాలను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు.

మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం బడ్జెట్‌లో రూ.11.11 లక్షల కోట్లు కేటాయించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి తాము ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు.

ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లు, నూతన సిడ్‌బీ బ్యాంకు బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎగుమతులు, ఎగుమతుల సేవల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేస్తామని, 500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాలను కల్పిస్తామని తెలిపారు.

దేశంలోని వంద నగరాల్లో ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తామని, దేశవ్యాప్తంగా 12 విస్తృతస్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు.

This post was last modified on July 23, 2024 12:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

55 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

3 hours ago