కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఏపీకి సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. ముఖ్యంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం.. కలలు కంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం కొంత మేరకు ఫలించిందనే చెప్పాలి. తాజాగా బడ్జెట్ ప్రసంగం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్., ఏపీ అమరావతి ప్రాజెక్టుకు విడతల వారీగా ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం వెలువరించిన బడ్జెట్లో రూ.15000 కోట్ల రూపాలయను కేటాయించారు.
ఈ నిధులను పనుల వారీగా కేటాయించనున్నట్టు తెలిపారు. రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సమస్యలను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుందని.. రాజధాని ఏర్పాటుకు… నిర్మాణానికి కేంద్రం కృత నిశ్చయంతో ఉన్నట్టు నిర్మలమ్మ చెప్పుకొచ్చారు. దీనిలో భాగంగానే ఈ బడ్జెట్లో రూ.15000 కోట్లను కేటాయి స్తున్నట్టు తెలిపారు. అత్యంత వేగంగా రాజధాని నిర్మాణం పూర్తికావాలని కేంద్రం కోరుకుంటోంద ని తెలిపారు. అదేవిధంగా విభజన చట్టంలోని అంశాలను కూడా.. సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.
విభజన చట్టంలోని అంశాలను పరిశీలించేందుకు కమిటీ వేయనున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించా రు. అలానే.. కొప్పర్తిలో పరిశ్రమల కారిడార్ను ఏర్పాటు చేసేందుకు సాయం చేస్తామన్నారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య ఎకనామిక్ కారిడార్ నిర్మాణానికి పూర్తి సాయం అందిస్తామని తెలిపారు. ఫైనాన్స్ అసిస్టెంట్స్ ద్వారా.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించి.. పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. అయితే..ఎంత కేటాయిస్తామనేది మాత్రం చెప్పలేదు. మొత్తానికి అమరావతి విషయంలో మాత్రం ఆశాజనకంగా నిర్ణయం రావడం గమనార్హం. గత బడ్జెట్లో అమరావతికి రూ.1000 కేటాయించిన విషయం తెలిసిందే.
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…