కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఏపీకి సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. ముఖ్యంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం.. కలలు కంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం కొంత మేరకు ఫలించిందనే చెప్పాలి. తాజాగా బడ్జెట్ ప్రసంగం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్., ఏపీ అమరావతి ప్రాజెక్టుకు విడతల వారీగా ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం వెలువరించిన బడ్జెట్లో రూ.15000 కోట్ల రూపాలయను కేటాయించారు.
ఈ నిధులను పనుల వారీగా కేటాయించనున్నట్టు తెలిపారు. రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సమస్యలను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుందని.. రాజధాని ఏర్పాటుకు… నిర్మాణానికి కేంద్రం కృత నిశ్చయంతో ఉన్నట్టు నిర్మలమ్మ చెప్పుకొచ్చారు. దీనిలో భాగంగానే ఈ బడ్జెట్లో రూ.15000 కోట్లను కేటాయి స్తున్నట్టు తెలిపారు. అత్యంత వేగంగా రాజధాని నిర్మాణం పూర్తికావాలని కేంద్రం కోరుకుంటోంద ని తెలిపారు. అదేవిధంగా విభజన చట్టంలోని అంశాలను కూడా.. సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.
విభజన చట్టంలోని అంశాలను పరిశీలించేందుకు కమిటీ వేయనున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించా రు. అలానే.. కొప్పర్తిలో పరిశ్రమల కారిడార్ను ఏర్పాటు చేసేందుకు సాయం చేస్తామన్నారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య ఎకనామిక్ కారిడార్ నిర్మాణానికి పూర్తి సాయం అందిస్తామని తెలిపారు. ఫైనాన్స్ అసిస్టెంట్స్ ద్వారా.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించి.. పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. అయితే..ఎంత కేటాయిస్తామనేది మాత్రం చెప్పలేదు. మొత్తానికి అమరావతి విషయంలో మాత్రం ఆశాజనకంగా నిర్ణయం రావడం గమనార్హం. గత బడ్జెట్లో అమరావతికి రూ.1000 కేటాయించిన విషయం తెలిసిందే.
This post was last modified on July 23, 2024 12:07 pm
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…