కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఏపీకి సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. ముఖ్యంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం.. కలలు కంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం కొంత మేరకు ఫలించిందనే చెప్పాలి. తాజాగా బడ్జెట్ ప్రసంగం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్., ఏపీ అమరావతి ప్రాజెక్టుకు విడతల వారీగా ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం వెలువరించిన బడ్జెట్లో రూ.15000 కోట్ల రూపాలయను కేటాయించారు.
ఈ నిధులను పనుల వారీగా కేటాయించనున్నట్టు తెలిపారు. రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సమస్యలను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుందని.. రాజధాని ఏర్పాటుకు… నిర్మాణానికి కేంద్రం కృత నిశ్చయంతో ఉన్నట్టు నిర్మలమ్మ చెప్పుకొచ్చారు. దీనిలో భాగంగానే ఈ బడ్జెట్లో రూ.15000 కోట్లను కేటాయి స్తున్నట్టు తెలిపారు. అత్యంత వేగంగా రాజధాని నిర్మాణం పూర్తికావాలని కేంద్రం కోరుకుంటోంద ని తెలిపారు. అదేవిధంగా విభజన చట్టంలోని అంశాలను కూడా.. సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.
విభజన చట్టంలోని అంశాలను పరిశీలించేందుకు కమిటీ వేయనున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించా రు. అలానే.. కొప్పర్తిలో పరిశ్రమల కారిడార్ను ఏర్పాటు చేసేందుకు సాయం చేస్తామన్నారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య ఎకనామిక్ కారిడార్ నిర్మాణానికి పూర్తి సాయం అందిస్తామని తెలిపారు. ఫైనాన్స్ అసిస్టెంట్స్ ద్వారా.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించి.. పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. అయితే..ఎంత కేటాయిస్తామనేది మాత్రం చెప్పలేదు. మొత్తానికి అమరావతి విషయంలో మాత్రం ఆశాజనకంగా నిర్ణయం రావడం గమనార్హం. గత బడ్జెట్లో అమరావతికి రూ.1000 కేటాయించిన విషయం తెలిసిందే.
This post was last modified on July 23, 2024 12:07 pm
చిన్న సినిమాలకు రిలీజ్ రోజు కంటే ఒకటి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఐతే పెద్ద…
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నిద్రలేదు.…
ప్రస్తుతం నైజామ్ సింగల్ స్క్రీన్లలో పర్సెంటెజ్ విధానం తీసుకురావడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.…
తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది దిగ్గజ దర్శకులున్నారు. వారిలో సింగీతం శ్రీనివాసరావుది ప్రత్యేకమైన శైలి. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇండియన్…
తమిళనాడులో ఒక రోజు స్ట్రైక్ చేయడానికి నిర్మాతలు పిలుపు ఇవ్వడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా హీరోలు…
ఈ ఏడాది సంక్రాంతి సినిమాల సందడితో ఎంతో ఆశాజనకంగా మొదలైన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఆ తర్వాత ఎంత వెలవెలబోయిందో తెలిసిందే.…