Political News

అంత ఖరీదైన టాయిలెట్ నేను కూడా చూడలేదు : బాబు

రుషికొండ. వైసీపీ ఓటమికి ప్రధానపాత్ర పోషించింది ఇదే అని చెప్పక తప్పదు. అక్కడ ఉన్న పర్యాటక శాఖ వసతి గృహాలను కూల్చివేసి కొత్త నిర్మాణం చేపట్డడం తీవ్ర చర్చ, విమర్శలు, ఉద్రిక్తతలకు దారి తీసింది. అక్కడ నిర్మించిన ఖరీదైన భవనం పర్యాటకులకోసమే అని వైసీపీ చెబుతున్నా, తాము తిరిగి అధికారంలోకిి వస్తే విశాఖ రాజధానిగా పాలన చేస్తామని జగన్ చెప్పిన నేపథ్యంలో రుషికొండ మీద ఉండేందుకే దానిని నిర్మించారన్నది వైసీపీ వ్యతిరేకవర్గాల వాదన.

ఈ పరిస్థితులలో ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రుషికొండ ప్యాలెస్ తాళాలు తీయించి మీడియాకు చూయించడంతో అక్కడ అంత ఖరీదుతో నిర్మించిన భవనాలు పర్యాటకుల కోసం కాదు, ఖచ్చితంగా జగన్ తన కోసమే నిర్మించాడన్న వాదనకు బలం చేకూరింది.

ఏపీలో శాసనసభ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన బీఎసీ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుల మధ్య రుషికొండ ప్యాలేస్ మీద నడిచిన సంభాషణ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రుషికొండ ప్యాలేస్ ను ప్రజల సందర్శనకు అవకాశం ఇవ్వాలని విష్ణుకుమార్ రాజు చంద్రబాబును కోరారు. 

అందులో ఉన్న ఖరీదైన రూ.25 లక్షల టాయిలెట్ అందరికీ చూయించాలని, దీని కోసం రూ.30 లేదా రూ.50 ప్రవేశ రుసుముగా నిర్ణయించాలని విష్ణుకుమార్ రాజు సూచించారు. దీనికి స్పందించిన చంద్రబాబు మరీ రూ.50 అంటే ఎక్కువ అవుతుందేమో .. అయినా అంత ఖరీదైన టాయిలెట్ నేను కూడా చూడలేదని అన్నారు. రుషికొండ ప్యాలెస్ అంశాన్ని ఈ శాసనసభ సమావేశాలలో చర్చకు పెట్టాలని, ఆ ప్యాలెస్ లో ఉన్న ప్రతి వస్తువు వద్ద దాని ఖరీదును ప్రదర్శించాలని విష్ణుకుమార్ రాజు కోరినట్లు తెలుస్తుంది. 

This post was last modified on July 23, 2024 10:16 am

Share
Show comments
Published by
Satya
Tags: rushikonda

Recent Posts

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

21 minutes ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

1 hour ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

1 hour ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

3 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

3 hours ago

‘జగన్ – కేసీఆర్’ జోడిని తలపించిన నాని

2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి…

3 hours ago