Political News

అంత ఖరీదైన టాయిలెట్ నేను కూడా చూడలేదు : బాబు

రుషికొండ. వైసీపీ ఓటమికి ప్రధానపాత్ర పోషించింది ఇదే అని చెప్పక తప్పదు. అక్కడ ఉన్న పర్యాటక శాఖ వసతి గృహాలను కూల్చివేసి కొత్త నిర్మాణం చేపట్డడం తీవ్ర చర్చ, విమర్శలు, ఉద్రిక్తతలకు దారి తీసింది. అక్కడ నిర్మించిన ఖరీదైన భవనం పర్యాటకులకోసమే అని వైసీపీ చెబుతున్నా, తాము తిరిగి అధికారంలోకిి వస్తే విశాఖ రాజధానిగా పాలన చేస్తామని జగన్ చెప్పిన నేపథ్యంలో రుషికొండ మీద ఉండేందుకే దానిని నిర్మించారన్నది వైసీపీ వ్యతిరేకవర్గాల వాదన.

ఈ పరిస్థితులలో ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రుషికొండ ప్యాలెస్ తాళాలు తీయించి మీడియాకు చూయించడంతో అక్కడ అంత ఖరీదుతో నిర్మించిన భవనాలు పర్యాటకుల కోసం కాదు, ఖచ్చితంగా జగన్ తన కోసమే నిర్మించాడన్న వాదనకు బలం చేకూరింది.

ఏపీలో శాసనసభ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన బీఎసీ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుల మధ్య రుషికొండ ప్యాలేస్ మీద నడిచిన సంభాషణ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రుషికొండ ప్యాలేస్ ను ప్రజల సందర్శనకు అవకాశం ఇవ్వాలని విష్ణుకుమార్ రాజు చంద్రబాబును కోరారు. 

అందులో ఉన్న ఖరీదైన రూ.25 లక్షల టాయిలెట్ అందరికీ చూయించాలని, దీని కోసం రూ.30 లేదా రూ.50 ప్రవేశ రుసుముగా నిర్ణయించాలని విష్ణుకుమార్ రాజు సూచించారు. దీనికి స్పందించిన చంద్రబాబు మరీ రూ.50 అంటే ఎక్కువ అవుతుందేమో .. అయినా అంత ఖరీదైన టాయిలెట్ నేను కూడా చూడలేదని అన్నారు. రుషికొండ ప్యాలెస్ అంశాన్ని ఈ శాసనసభ సమావేశాలలో చర్చకు పెట్టాలని, ఆ ప్యాలెస్ లో ఉన్న ప్రతి వస్తువు వద్ద దాని ఖరీదును ప్రదర్శించాలని విష్ణుకుమార్ రాజు కోరినట్లు తెలుస్తుంది. 

This post was last modified on July 23, 2024 10:16 am

Share
Show comments
Published by
Satya
Tags: rushikonda

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

5 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

8 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

8 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

9 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

9 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

11 hours ago