Political News

వైసీపీకి భారీ షాక్‌.. కీల‌క నేత ఔట్‌!

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్క‌లేదు. ఇదొక షాక్ అయితే.. సోమ‌వారం మ‌రో భారీ షాక్ త‌గిలింది. గుంటూరు జిల్లాకు చెందిన ముఖ్య నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి పార్టీకి రాజీనామా చేశారు. త‌న రాజీనామా ప‌త్రాన్ని ఆయ‌న పార్టీ అదినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు పంపించారు. 2019లో తొలిసారి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన మ‌ద్దాలిగిరి.. అప్ప‌ట్లో టీడీపీ త‌ర‌ఫున గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. దీనికి ముందు రెండేళ్లు రాజ‌కీయాల్లో ఉన్న‌ప్ప‌టికీ.. పెద్ద‌గా ఆయ‌న పేరు ఎక్క‌డా వినిపించ‌లేదు.

వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన గిరికి.. కాంట్రాక్టులు.. ఇత‌ర‌త్రా వ్యాపారాలు కూడా ఉన్నాయి. అయితే.. 2019లో మ‌ద్దాలి గెలిచినా.. టీడీపీ మాత్రం ఓడిపోయింది. అనంత‌రం.. విజ‌య‌వాడ‌కు చెందిన మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాసరావు ప్రోత్సాహంతో మ‌ద్దాలి.. వైసీపీ బాట ప‌ట్టారు. వ్యాపారాల్లోనూ.. ఇత‌ర వ్య‌వ‌హారాల్లోనూ అధికార పార్టీ అండ‌గా ఉంటుంద‌ని భావించిన ఆయన వైసీపీ కండువా మార్చుకున్నారు. అయితే.. ఇత‌ర నాయ‌కుల మాదిరిగా .. చంద్ర‌బాబుపైకానీ.. టీడీపీపై కానీ..ఎక్క‌డా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో ఆయ‌న వివాదాస్ప‌ద నాయ‌కుడిగా పేరు తెచ్చుకోలేక పోయారు.

ఇదిలావుంటే.. ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్.. మ‌ద్దాలి గిరికి టికెట్ ఇవ్వ‌లేదు. ఆయ‌న గ్రాఫ్ బాగోలేదంటూ.. ప‌క్క‌న పెట్టారు. గుంటూరు వెస్ట్ సీటును అప్ప‌టి మంత్రి, చిల‌క‌లూరి పేట అప్ప‌టి ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీకి కేటాయించారు. పైగా.. ఆమెకు సాయం చేయాల‌ని పార్టీ మ‌ద్దాలిపై ఒత్తిడి తెచ్చింది. ఈ క్ర‌మంలో ఆయ‌న ఎన్నిక‌లు జ‌రిగిన స‌మ‌యంలో జిల్లాకు, రాష్ట్రానికి కూడా దూరంగా ఉన్నారు. తాజాగా వైసీపీ స‌భ్య‌త్వానికి, పార్టీకి కూడా గిరి రాజీనామా చేయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు టీడీపీలో ఆహ్వానం అందిన‌ట్టు తెలుస్తోంది. పార్టీ ప‌రంగా వైశ్య సామాజిక వ‌ర్గానికి చంద్ర‌బాబు గ‌తంలోనూ పెద్ద‌పీట వేశారు. ఇప్పుడు కూడా అంతే పంథాలో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే గిరి టీడీపీ చెంత‌కు చేరుకునే అవ‌కాశం ఉందని తెలుస్తోంది.

This post was last modified on July 22, 2024 10:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

1 hour ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

2 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

2 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

2 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

4 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

5 hours ago