అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం.. ప్రమాదవ శాత్తు జరిగిన ఘటన కాదని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు. దీని వెనుక కుట్ర పూరిత చర్యలు ఉన్నాయని భావిస్తున్నట్టు చెప్పారు. తాను స్వయంగా మూడు గంటల పాటు కార్యాలయంలో కలియదిరిగి పరిస్థితిని పరిశీలించినట్టు తెలిపారు. అయితే.. షార్ట్ సర్క్యూట్ జరగడానికి.. అవకాశం లేదని గుర్తించినట్టు తెలిపారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారనే విషయంపై విచారణ చేస్తామన్నారు. ఈ ఘటన వెనుక ఉద్దేశ పూర్వక చర్యలు ఉన్నాయని చెప్పారు.
ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటన చోటు చేసుకుందని డీజీపీ తెలిపారు. ఈ విషయం ఆర్డీవోకు తెలుసునని, అయితే.. ఆయన కలెక్టర్కు సమాచారం ఇవ్వలేదన్నారు. ఇదేసమయంలో పోలీసులు కూడా ఈవిషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. సీఐకి.. అగ్ని ప్రమాద ఘటన విషయం తెలిసిన తర్వాత కూడా.. డీఎస్పీకి, ఎస్పీకి సమాచారం ఇవ్వలేదన్నారు. శాఖ పరమైన విచారణ కూడా చేయనున్నట్టు డీజీపీ తిరుమల రావు తెలిపారు. ప్రాధమిక సమాచారం ప్రకారం ఆర్డీవో సెక్షన్లోని కీలకమైన విభాగంలో మంటలు రేగాయన్నారు.
ఈ మంటలు ప్రమాదవ శాత్తు సంభవించినవి కావని డీజీపీ చెప్పారు. వీటి వెనుక ఏం జరిగిందనే విషయం పరిశీలిస్తామన్నారు. విద్యుత్ శాఖ కూడా.. షార్ట్ సర్క్యూట్తో జరిగింది కాదని ధ్రువీకరించినట్టు తెలిపారు. 25 అంశాలకు సంబందించిన ఫైళ్లు దగ్ధమయ్యాయని చెప్పారు. వీటిలో కీలకమైన భూముల ఫైళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారని చెప్పారు. ఆఫీసుకు కొద్దిపాటి దూరంలోనే ఈ పైళ్లు కాలుతున్నట్టు తాను కూడా గుర్తించినట్టు తెలిపారు. అన్ని కోణాల్లోనూ ఈ ఘటనపై విచారణ జరుపుతామని తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారని చెప్పారు.
వారిపై అనుమానం!
ఆర్డీవో ఆఫీసులో పనిచేస్తున్న కొందరిపై అనుమానాలు ఉన్నాయని డీజీపీ తెలిపారు. ఆదివారం అయినప్పటికీ.. కొందరు రాత్రి 10 గంటల తర్వాత కూడా పనులు చేసినట్టు సమాచారం ఉందన్నారు. అదేవిధంగా ఆఫీసుకు బయట అగ్గిపుల్లలు కూడా లభించాయని తెలిపారు. ఆ పక్కన కొంత దూరంలోనే ఫైళ్లు కాలుతున్నాయని గుర్తించినట్టు చెప్పారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…