వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రతిపక్ష టీడీపీ, జనసేన నాయకులకు ఏమాత్రం తగ్గని రీతిలో, ఇంకా చెప్పాలంటే వాళ్లను మించి ఆ పార్టీతో పోరాడిన, విమర్శలు గుప్పించిన నాయకుడిగా రఘురామకృష్ణంరాజుకు పేరుంది. వైసీపీ తరఫున ఏంపీగా గెలిచి, ఏడాది తిరక్కముందే రెబల్గా మారి నాలుగేళ్ల పాటు ఆ పార్టీతో తీవ్రంగా ఘర్షణ పడ్డారు రఘురామ. దీంతో జగన్ కక్ష పూరితంగా ఆయన్ని అరెస్ట్ చేయించి చిత్రహింసలు పెట్టించారనే ఆరోపణ కూడా ఉంది.
ఇక ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ తరఫున ఉండి నియోజకవర్గం నుంచి గెలిచిన రఘురామ.. ఫలితాల అనంతరం కూడా వైసీపీని, జగన్ను వదిలిపెట్టట్లేదు. అసెంబ్లీ వేదికగా జగన్ మీద కౌంటర్లు వేశారు. బయట కూడా అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో జగన్ పక్కన రఘురామ కూర్చోవడం, ఆయనతో మాట్లాడ్డం అనేది ఊహకందని విషయం. ఈ రోజు అసెంబ్లీలో అదే జరిగింది. గవర్నర్ ప్రసంగం మీద నిరసన తెలపడానికి అసెంబ్లీకి వచ్చిన జగన్.. తన సీట్లో కూర్చోగా ఆయన్ని వెళ్లి రఘురామ పలకరించారు. అంతే కాక జగన్ పక్కన కూర్చున్నారు. ఆయన చెవిలో ఏదో చెప్పారు. ఐతే పాత విషయాలన్నీ మరిచిపోయి జగన్తో ఇకపై మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని రఘురామ అనుకుని ఆయనతో మామూలుగానే మాట్లాడారా.. లేక ఆయన్ని రాజకీయ ప్రత్యర్థిగానే భావించి ఏవైనా కౌంటర్లు వేశారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే.. ప్రతిపక్ష నేత హోదా లేకపోయినప్పటికీ జగన్ వాహనాన్ని మరోసారి ప్రభుత్వం అసెంబ్లీ లోపలి వరకు అనుమతించడం కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది. జగన్ అయితే కచ్చితంగా ఇలా చేసేవాడు కాదని.. చంద్రబాబు కాబట్టి ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్ను గౌరవిస్తున్నాడని సామాజిక మాధ్యమాల్లో చర్చించుకుంటున్నారు.
This post was last modified on July 22, 2024 3:21 pm
కొన్ని నెలల క్రితం లాల్ సలామ్ అనే సినిమా ఒకటొచ్చిందనే సంగతే చాలా మంది సగటు ప్రేక్షకులు మర్చిపోయి ఉంటారు.…
స్టార్ హీరోలు నటించిన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి భారీ వసూళ్లు సాధించడంలో ఆశ్చర్యం లేదు. కానీ చిన్న బడ్జెట్…
గత నెల విడుదలై భారీ విజయం అందుకున్న ఆయ్ థియేట్రికల్ గా మంచి రెవిన్యూ సాధించింది. అయితే బిగ్ స్క్రీన్…
రాజకీయాలన్నాక పదవులు.. హోదాలు ఆశించడం తప్పుకాదు. అసలు రాజకీయాల్లోకి వచ్చేదే పెత్తనం కోసం. దీనిని కాదన్న వారు రాజకీయ నేతలే…
న్యాచురల్ స్టార్ నాని తాజా బ్లాక్ బస్టర్ సరిపోదా శనివారం దిగ్విజయంగా వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగుపెట్టేసింది. దసరా…
ఒక మహిళ కేసు.. దానికి సంబంధించి ముగ్గురు ఐపీఎస్ లు.. అందులో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు. వారందరిని సస్పెన్షన్…