Political News

దివ్యాంగుల-అంద‌గ‌త్తెలు… ఐఏఎస్ స్మితా వివాదం

ఐఏఎస్ – ఆఫీస‌ర్ అయ్యేందుకు ఉండాల్సిన అర్హ‌త‌లేంటి? దివ్యాంగులు ఈ ప‌రీక్ష‌ల‌కు అన‌ర్హులా..? వారిని ఎంపిక చేయ‌డం పాప‌మా? ఇదీ.. ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. ఐఏఎస్‌గా ఎంపిక‌య్యే వారు.. కాళ్లు చేతులు స‌క్ర‌మంగా ఉండి.. ఎలాంటి వైక‌ల్యం లేనివారుగా ఉండాలంటూ.. తెలంగాణ‌కు చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి స్మితా స‌బ‌ర్వాల్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక్క తెలంగాణ‌లోనే కాదు.. దేశంలోని ప‌లురాష్ట్రాల్లోనూ దివ్యాంగులు మండిప‌డుతున్నారు.

భార‌త కీల‌క స‌ర్వీసుల్లో ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్ఎస్‌, ఐఎఫ్ఎస్‌లు కీల‌క‌మైన‌వి. వీటికి ఎంపిక చేసేవారిని యూపీఎస్సీ కీల‌క‌మైన నాలుగు వ‌డ‌పోత‌ల ద్వారా ఎంపిక చేస్తుంది. అయితే.. ఇటీవ‌ల పూజా ఖేద్క‌ర్ విష‌యంలో వెలువ‌డిన అవ‌క‌త‌వ‌క‌ల త‌ర్వాత‌.. ఈ ఉద్యోగాల‌పైనా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దేశంలో ఐఏఎస్ వ్య‌వ‌స్థ ఏర్ప‌డి 75 సంవ‌త్స‌రాలు అయింది. అయితే.. గ‌తంలో ఎప్పుడూలేని విధంగా ఇప్పుడు క‌మిష‌న్ విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది.

మ‌హారాష్ట్ర‌కు చెందిన పూజా ఖేద్క‌ర్‌.. దివ్యాంగుల కోటాలో ఐఏఎస్ కు ఎంపికయ్యారు. త‌న‌కు దృష్టి మాంద్యం ఉంద‌న్న‌ది ఆమె చెబుతున్న మాట‌. దీనికి సంబంధించిన స‌ర్టిఫికెట్ల‌ను కూడా ఆమె స‌మ‌ర్పించారు. ఈ కోటాలోనే ఆమె ఎంపిక‌య్యారు. త‌ర్వాత‌.. వివాద‌స్ప‌ద ఆదేశాలు, నిర్ణ‌యాల‌తో ఏకంగా ప‌క్క‌న పెట్టే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే బీజేపీకి చెందిన కొంద‌రు నాయ‌కులు.. అస‌లు ఆమె స‌మ‌ర్పించిన దివ్యాంగ స‌ర్టిఫికెట్ల‌పైనా అనుమానం వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం వీటిపై కూడా విచార‌ణ జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా స్పందించిన స్మితా స‌బ‌ర్వాల్‌.. సివిల్స్‌లో అస‌లు దివ్యాంగుల కోటా ఎందుక‌ని ప్ర‌శ్నించారు. ఆరోగ్యంగా ఉన్న‌వారిని మాత్ర‌మే ఎంపిక చేయాల‌ని.. ప‌నిగంట‌లు ఎక్కువ‌గా ఉంటాయ‌ని.. ఎక్క‌డైనా ఏ స‌మ‌యంలో అయినా ప‌ర్య‌టించాల్సి ఉంటుంద‌ని.. కాబ‌ట్టి దివ్యాంగుల‌ను ఐఏఎస్‌, ఐపీఎస్, వంటి భార‌త స‌ర్వీసుల‌కు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరాద‌ని సెల‌విచ్చారు. దీనిపై నే ఇప్పుడు తీవ్ర దుమారం రేగింది. IAS కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదంటూ.. ప్ర‌ముఖ మెంటార్‌.. బాల ల‌త తీవ్రంగా ఆక్షేపించారు.

“దివ్యాంగుల గురించి మాట్లాడటానికి మీరెవరు? ఇద్దరం పరీక్ష రాద్దాం. ఎవరికెక్కువ మార్కులు వస్తాయో చూద్దామా? 24గంటల్లో మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే దివ్యాంగులు ఆందోళనకు దిగుతారు. స్మితకు సీఎస్ శాంతి కుమారి షోకాజ్ నోటీస్ ఇవ్వాలి” అని బాల ల‌త డిమాండ్ చేశారు. ఇదే అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేశారు. దివ్యాంగుల క‌మిష‌న్ సైతం దీనిపై ఆగ్ర‌హంగా ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on July 22, 2024 2:28 pm

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

17 minutes ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

1 hour ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

2 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

2 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

3 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

3 hours ago