ఏపీ అసెంబ్లీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సభలో కీలకమైన అంశం.. బడ్జెట్. అది వచ్చే మూడు మాసాలకు ప్రకటిస్తారా? లేక.. వచ్చే ఏడాది మార్చి వరకు నిర్ణయిస్తారా? అనేది చూడాలి. సరే.. ఏది ఎలా ఉన్నా.. ఇప్పుడు చంద్రబాబు సర్కారు ప్రధాన వ్యూహం.. వైసీపీకి కౌంటర్ ఇవ్వడమే. భారీ ఎత్తున అలివిమాలిన పథకాలను ప్రకటించి.. చంద్రబాబు అధికారంలోకి వచ్చారంటూ.. జగన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఇప్పటికీ పథకాల ఊసెత్తలేదన్నారు.
పేద ప్రజలు ఎన్నికలకు ముందు ప్రకటించిన పథకాల అమలు కోసం ఎదురు చూస్తున్నారన్న జగన్.. వాటి అమలు విషయాన్ని చంద్రబాబు పక్కన పెట్టి.. కేవలం హత్యారాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని.. వినుకొండలో విమర్శలు గుప్పించారు. కట్ చేస్తే.. ఇప్పుడు చంద్రబాబు అసెంబ్లీ వేదికగా.. జగన్ చేసిన విమర్శలకు సమాధానాలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాల్లో ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు.
ఈ నేపథ్యంలో తాము ఆయా పథకాలను ఎప్పుడు ప్రారంభించాలో.. ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉం దో.. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో.. వంటి కీలక విషయాలను చంద్రబాబు ఏకరువు పెట్టనున్నారు. పథకాలకు తాము ఖర్చు చేస్తోంది ఎంతో కూడా ఆయన కుండబద్దలు కొట్టనున్నారు. అదేవిధంగా గత జగన్ సర్కారు ఎంత మొత్తం ఖర్చు చేసిందో.. ఇప్పుడు ఎంతెంత పెండింగ్ ఉందో.. ఇలా.. అన్ని విష యాలను చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభలోనే వెల్లడించనున్నారు.
ఇక, తాము ప్రవేశ పెట్టిన పథకాల్లో ఇప్పటికే 1న పింఛన్ల పంపిణీ విజయవంతం అయిందని చంద్రబాబు చెప్పనున్నారు. ఇదేవిధంగా ఇతర పథకాలను అమలు చేయాలని అనుకున్నామని.. కానీ, ఖజానాను ఖా ళీ చేశారని.. అందుకే తాము కొంత సమయం తీసుకున్నామని చెప్పడం ద్వారా చంద్రబాబు వ్యూహాత్మకం గా వైసీపీని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. ఎలా చూసుకున్నా.. వైసీపీకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే పరిస్థితి అయితే కనిపిస్తోంది. పథకాల విషయంలో చంద్రబాబు సంధించే ప్రశ్నలకు ఆయన ఎలాంటి సమాధానం చెప్పాలన్నా.. మైకు దొరికే అవకాశం కూడా లేదు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on July 22, 2024 10:31 am
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…