Political News

టీడీపీ డ్ర‌స్ కోడ్‌.. అసెంబ్లీకి అలానే రావాల‌ని పిలుపు!

సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో కూట‌మి స‌ర్కారు ఆస‌క్తికర నిర్ణ‌యం తీసుకుంది. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేల‌కు.. ఆ పార్టీ నేత‌లు కొన్ని కీల‌క సూచ‌న‌లు చేశారు. స‌భ‌కు వ‌చ్చే వారు.. ప‌సుపు రంగు దుస్తుల్లోనే రావాల‌ని పేర్కొన్నారు. అదేవిధంగా సైకిల్ గుర్తు మాత్ర‌మే ఉన్న ప‌సుపు కండువాలు ధ‌రించాల‌ని సూచించారు.

సూచ‌న‌ల‌ను త‌ప్ప‌కుండా పాటించాల‌ని అధిష్టానం నుంచి ఆదేశాలు వ‌చ్చాయ‌ని మాత్రం పార్టీ నాయ‌కులు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం స‌భ‌లో 164 మంది ఎమ్మెల్యేలు.. కూట‌మి ప‌క్షాన ఉన్నారు. వీరిలో 135 మంది అచ్చంగా తెలుగు దేశం పార్టీ స‌భ్యులే. మిగిలిన‌వారిలో 21 మంది జ‌న‌సేన‌, 8 మంది బీజేపీ స‌భ్యులు ఉన్నారు. అయితే.. టీడీపీ స‌భ్యుల‌ను డ్ర‌స్ కోడ్ ఎందుకు పాటించ‌మ‌న్నార‌నేది తెలియ‌రాలేదు. కానీ, స‌భ‌లో త‌మ వారి సంఖ్య‌ను ప్ర‌తిబింబించాల‌నే లెక్క‌తోనే ఇలా చెప్పి ఉంటార‌ని తెలుస్తోంది.

గ‌తంలోనూ ఒక‌రిద్ద‌రు పార్టీ రంగుతో కూడిన ష‌ర్టులు వేసుకుని వ‌చ్చేవారు. అయితే.. అప్ప‌ట్లో జెండా రంగును పోలి ఉందంటూ కొంత అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. దీంతో మెడ‌లో ఉన్న కండువాల‌ను బ‌య‌ట వ‌దిలేసేవారు. అయితే.. ఇప్పుడు మాత్రం మెడ‌లో కూడా.. ప‌సుపు కండువా ధ‌రించి రావాల‌ని పార్టీ ఆదేశించింది. కానీ, అన్న ఎన్టీఆర్ కానీ, చంద్ర‌బాబు ఫొటోల‌ను కానీ.. పెట్టుకుని రావొద్ద‌ని కేవ‌లం సైకిల్ గుర్తుతో ఉన్న కండువాల‌ను మాత్ర‌మే ధ‌రించి రావాల‌ని సూచించ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, జ‌న‌సేన త‌ర‌ఫున ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి డ్ర‌స్ కోడ్ ఉత్త‌ర్వులు రాలేదు. అయితే.. కూటమి మిత్ర ప‌క్షం త‌మ పార్టీ జెండా రంగును పోలిన చొక్కాలు ధ‌రించి రావాల‌ని పేర్కొన్న ద‌రిమిలా.. జ‌న‌సేన కూడా అదే ప‌నిచేయొచ్చు. ఇక‌, బీజేపీ నాయ‌కులు ఇప్ప‌టికే కాషాయ కండువాల‌తో స‌భ‌కు రావ‌డం తెలిసిందే.

This post was last modified on July 21, 2024 5:18 pm

Share
Show comments
Published by
Satya
Tags: TDP

Recent Posts

ట్రంప్ ఇమేజ్ ఎంత దారుణంగా పడిదంటే

అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…

25 minutes ago

జగన్ ‘మావిగన్’… ట్రోల్ మెటీరియల్ అయిందే

‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…

49 minutes ago

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

2 hours ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

4 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

5 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

6 hours ago