Political News

టీడీపీ డ్ర‌స్ కోడ్‌.. అసెంబ్లీకి అలానే రావాల‌ని పిలుపు!

సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో కూట‌మి స‌ర్కారు ఆస‌క్తికర నిర్ణ‌యం తీసుకుంది. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేల‌కు.. ఆ పార్టీ నేత‌లు కొన్ని కీల‌క సూచ‌న‌లు చేశారు. స‌భ‌కు వ‌చ్చే వారు.. ప‌సుపు రంగు దుస్తుల్లోనే రావాల‌ని పేర్కొన్నారు. అదేవిధంగా సైకిల్ గుర్తు మాత్ర‌మే ఉన్న ప‌సుపు కండువాలు ధ‌రించాల‌ని సూచించారు.

సూచ‌న‌ల‌ను త‌ప్ప‌కుండా పాటించాల‌ని అధిష్టానం నుంచి ఆదేశాలు వ‌చ్చాయ‌ని మాత్రం పార్టీ నాయ‌కులు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం స‌భ‌లో 164 మంది ఎమ్మెల్యేలు.. కూట‌మి ప‌క్షాన ఉన్నారు. వీరిలో 135 మంది అచ్చంగా తెలుగు దేశం పార్టీ స‌భ్యులే. మిగిలిన‌వారిలో 21 మంది జ‌న‌సేన‌, 8 మంది బీజేపీ స‌భ్యులు ఉన్నారు. అయితే.. టీడీపీ స‌భ్యుల‌ను డ్ర‌స్ కోడ్ ఎందుకు పాటించ‌మ‌న్నార‌నేది తెలియ‌రాలేదు. కానీ, స‌భ‌లో త‌మ వారి సంఖ్య‌ను ప్ర‌తిబింబించాల‌నే లెక్క‌తోనే ఇలా చెప్పి ఉంటార‌ని తెలుస్తోంది.

గ‌తంలోనూ ఒక‌రిద్ద‌రు పార్టీ రంగుతో కూడిన ష‌ర్టులు వేసుకుని వ‌చ్చేవారు. అయితే.. అప్ప‌ట్లో జెండా రంగును పోలి ఉందంటూ కొంత అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. దీంతో మెడ‌లో ఉన్న కండువాల‌ను బ‌య‌ట వ‌దిలేసేవారు. అయితే.. ఇప్పుడు మాత్రం మెడ‌లో కూడా.. ప‌సుపు కండువా ధ‌రించి రావాల‌ని పార్టీ ఆదేశించింది. కానీ, అన్న ఎన్టీఆర్ కానీ, చంద్ర‌బాబు ఫొటోల‌ను కానీ.. పెట్టుకుని రావొద్ద‌ని కేవ‌లం సైకిల్ గుర్తుతో ఉన్న కండువాల‌ను మాత్ర‌మే ధ‌రించి రావాల‌ని సూచించ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, జ‌న‌సేన త‌ర‌ఫున ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి డ్ర‌స్ కోడ్ ఉత్త‌ర్వులు రాలేదు. అయితే.. కూటమి మిత్ర ప‌క్షం త‌మ పార్టీ జెండా రంగును పోలిన చొక్కాలు ధ‌రించి రావాల‌ని పేర్కొన్న ద‌రిమిలా.. జ‌న‌సేన కూడా అదే ప‌నిచేయొచ్చు. ఇక‌, బీజేపీ నాయ‌కులు ఇప్ప‌టికే కాషాయ కండువాల‌తో స‌భ‌కు రావ‌డం తెలిసిందే.

This post was last modified on July 21, 2024 5:18 pm

Share
Show comments
Published by
Satya
Tags: TDP

Recent Posts

శాశ్వతంగా ఉద్యోగం కోల్పోయిన వెంకట్రామిరెడ్డి

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఏపీ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా…

1 hour ago

సెన్సేషన్ వాలా… ప్లాన్ అదిరిపోలా

మలయాళంలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు వాలా 2. అతి తక్కువ బడ్జెట్ లో రూపొంది రెండు వందల కోట్ల…

2 hours ago

ముంబై ప్రచారం వెనుక అసలు కిటుకు

రాకా సినిమా కోసం అల్లు అర్జున్ కేవలం హైదరాబాద్ లో ఉంటే సరిపోవట్లేదు. షూటింగ్, ఇతరత్రా కార్యక్రమాల కోసం పదే…

3 hours ago

తమిళుల మనసు గెలుచుకున్న బాబు

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అందులో భాగంగా తమిళనాడు ఎన్నికల ప్రచారంలోకి టీడీపీ అధినేత, ఏపీ సీఎం…

3 hours ago

శ్రుతి మించుతున్న రెడిట్ గాసిప్స్

ఎవరో ఒక హీరోయిన్.. లేదా కాస్త ఫేమ్ ఉన్న అమ్మాయి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. రెడిట్‌లో తన గురించి…

4 hours ago

సునామీ సుడిగుండంలో జపాన్

జపాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ లోని ఉత్తర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో కూడిన…

5 hours ago