సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూటమి సర్కారు ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలకు.. ఆ పార్టీ నేతలు కొన్ని కీలక సూచనలు చేశారు. సభకు వచ్చే వారు.. పసుపు రంగు దుస్తుల్లోనే రావాలని పేర్కొన్నారు. అదేవిధంగా సైకిల్ గుర్తు మాత్రమే ఉన్న పసుపు కండువాలు ధరించాలని సూచించారు.
సూచనలను తప్పకుండా పాటించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయని మాత్రం పార్టీ నాయకులు పేర్కొన్నారు. ప్రస్తుతం సభలో 164 మంది ఎమ్మెల్యేలు.. కూటమి పక్షాన ఉన్నారు. వీరిలో 135 మంది అచ్చంగా తెలుగు దేశం పార్టీ సభ్యులే. మిగిలినవారిలో 21 మంది జనసేన, 8 మంది బీజేపీ సభ్యులు ఉన్నారు. అయితే.. టీడీపీ సభ్యులను డ్రస్ కోడ్ ఎందుకు పాటించమన్నారనేది తెలియరాలేదు. కానీ, సభలో తమ వారి సంఖ్యను ప్రతిబింబించాలనే లెక్కతోనే ఇలా చెప్పి ఉంటారని తెలుస్తోంది.
గతంలోనూ ఒకరిద్దరు పార్టీ రంగుతో కూడిన షర్టులు వేసుకుని వచ్చేవారు. అయితే.. అప్పట్లో జెండా రంగును పోలి ఉందంటూ కొంత అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో మెడలో ఉన్న కండువాలను బయట వదిలేసేవారు. అయితే.. ఇప్పుడు మాత్రం మెడలో కూడా.. పసుపు కండువా ధరించి రావాలని పార్టీ ఆదేశించింది. కానీ, అన్న ఎన్టీఆర్ కానీ, చంద్రబాబు ఫొటోలను కానీ.. పెట్టుకుని రావొద్దని కేవలం సైకిల్ గుర్తుతో ఉన్న కండువాలను మాత్రమే ధరించి రావాలని సూచించడం గమనార్హం.
ఇక, జనసేన తరఫున ఇప్పటి వరకు ఎలాంటి డ్రస్ కోడ్ ఉత్తర్వులు రాలేదు. అయితే.. కూటమి మిత్ర పక్షం తమ పార్టీ జెండా రంగును పోలిన చొక్కాలు ధరించి రావాలని పేర్కొన్న దరిమిలా.. జనసేన కూడా అదే పనిచేయొచ్చు. ఇక, బీజేపీ నాయకులు ఇప్పటికే కాషాయ కండువాలతో సభకు రావడం తెలిసిందే.
This post was last modified on July 21, 2024 5:18 pm
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…