రాజకీయ విద్వేషాలకు.. వ్యక్తిగత కక్షలకు కూడా నిలయంగా విలసిల్లిన అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఏదో జరిగిపోతుందని అనుకున్నా.. తాజాగా శనివారం ఎలాంటి అల్లర్లకు అవకాశం లేకుండా.. ప్రశాంతంగా పరిస్థితి సాగిపోయింది. పెద్దారెడ్డి ఎలా అడుగు పెడతాడో చూస్తా అంటూ.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి సవాల్ చేయడంతో శనివారం పెద్దారెడ్డి రాక నేపథ్యంలో ఏం జరుగు తుందో అని అందరూ టెన్షన్కు గురయ్యారు.
అయితే.. ఎక్కడా ఎలాంటి అల్లరికి అవకాశం లేకుండా.. వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శనివారం ఉదయం తాడిపత్రికి వచ్చారు. నేరుగా పట్టణ పోలీస్ స్టేషనుకు వెళ్లారు. ఎన్నికల సమయంలో అల్లర్ల కేసుకు సంబంధించి ఇటీవల పెద్దారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించిన.. ష్యూరిటీ పత్రాలను ఆయన పోలీసులకు అందించారు. వాస్తవానికి పోలీసులే వెంటపడి వాటిని తీసుకోవాల్సి ఉంది. కానీ, తీసుకోలేదు.
ఈ విషయంపైనే పెద్దారెడ్డి ప్రశ్నించారు. వాస్తవానికి పెద్దారెడ్డి రాకతో.. అల్లర్లు జరిగే అవకాశం ఉందని పోలీసులు భావించారు. కానీ, ఎలాంటి అల్లర్లు జరగలేదు. దీంతో పెద్దారెడ్డి సైలెంట్గా వచ్చి.. సైలెంట్గా నే వెళ్లిపోయారు. ఇదిలావుంటే.. ప్రభుత్వం మారినప్పటికీ.. పోలీసులకు-వైసీపీ నాయకులకు మధ్య బంధం ఏ రేంజ్లో ఉందో ఈ సందర్భంగా తేటతెల్లమైంది. పెద్దారెడ్డి వెంట వచ్చిన వారిని స్థానిక పోలీసులు ఆప్యాయంగా పలకరించడంతోపాటు.. కరచాలనం చేశారు. అంతేకాదు.. పెద్దారెడ్డి వాహనంలో ఓ ఎస్సై వెనుక సీట్లో కూర్చుని వెళ్లారు. ఇదీ.. సంగతి!!
This post was last modified on July 20, 2024 5:12 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…