కమ్మవారు…అనగానే టీడీపీకి చెందిన వాళ్లు అనే ముద్ర ఏపీ, తెలంగాణలో ఉంది. పార్టీపరంగా ఆ సామాజిక వర్గానికి ఓ ముద్ర వేసి వారిని విమర్శించడం వైసీపీ నేతలకు అలవాటు. గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారని, వారికి చెందిన భూములు ఎక్కువగా ఉన్నాయని అమరావతి రాజధాని మొత్తానికి కుల ముద్ర వేశారు మాజీ సీఎం జగన్. ఆ క్రమంలోనే అమరావతిని అడవిగా మార్చేసిన జగన్ దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఓ సినిమాలో ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు..కింద కమ్మవారు అంటూ పెట్టిన డైలాగ్ వైరల్ గా కూడా మారింది.
ఈ క్రమంలోనే తాజాగా కమ్మవారు అంటే అసలు అర్థం ఇది అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కమ్మ అంటే అమ్మలాంటి ఆలోచన అని రేవంత్ అన్నారు. కమ్మ వారు భూమిని నమ్ముకొని మట్టిలో నుంచి బంగారం తీసి పంటలు పండిస్తారని తెలిపారు.
ఎల్లపుడూ కష్టపడాలనే తత్వం కమ్మవారికి ఉంటుందని కితాబిచ్చారు. పది మందిని ఆదుకునే ఆలోచన కమ్మవారు చేస్తారని ప్రశంసించారు. అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు వారు విస్తరించారని, ఎన్నో కంపెనీలకు అధిపతులుగా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ లో జరుగుతున్న కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహా సభల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on July 20, 2024 4:15 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…