Political News

కమ్మవారి పై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

కమ్మవారు…అనగానే టీడీపీకి చెందిన వాళ్లు అనే ముద్ర ఏపీ, తెలంగాణలో ఉంది. పార్టీపరంగా ఆ సామాజిక వర్గానికి ఓ ముద్ర వేసి వారిని విమర్శించడం వైసీపీ నేతలకు అలవాటు. గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారని, వారికి చెందిన భూములు ఎక్కువగా ఉన్నాయని అమరావతి రాజధాని మొత్తానికి కుల ముద్ర వేశారు మాజీ సీఎం జగన్. ఆ క్రమంలోనే అమరావతిని అడవిగా మార్చేసిన జగన్ దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఓ సినిమాలో ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు..కింద కమ్మవారు అంటూ పెట్టిన డైలాగ్ వైరల్ గా కూడా మారింది.

ఈ క్రమంలోనే తాజాగా కమ్మవారు అంటే అసలు అర్థం ఇది అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కమ్మ అంటే అమ్మలాంటి ఆలోచన అని రేవంత్ అన్నారు. కమ్మ వారు భూమిని నమ్ముకొని మట్టిలో నుంచి బంగారం తీసి పంటలు పండిస్తారని తెలిపారు.

ఎల్లపుడూ కష్టపడాలనే తత్వం కమ్మవారికి ఉంటుందని కితాబిచ్చారు. పది మందిని ఆదుకునే ఆలోచన కమ్మవారు చేస్తారని ప్రశంసించారు. అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు వారు విస్తరించారని, ఎన్నో కంపెనీలకు అధిపతులుగా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ లో జరుగుతున్న కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహా సభల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on July 20, 2024 4:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

41 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

55 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago