అఖండ విజయంతో ఏపీలో కూటమి అధికారంలో రావడంతో మంత్రి నారా లోకేశ్ దూకుడుతో సాగుతున్నారు. ప్రభుత్వ విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఐటీ పరంగా ఏపీని అభివృద్ధి చేసే చర్యలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఓ తప్పును వాడుకునేందుకు లోకేశ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల విషయంలో స్థానికత విషయంలో కర్ణాటక ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దీంతో వెంటనే స్పందించిన లోకేశ్ ఐటీ కంపెనీలను ఏపీకి రమ్మంటున్నారు.
కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో కూడా సీ, డీ గ్రూపు ఉద్యోగాలు వంద శాతం కన్నడిగులకే ఇవ్వడాన్ని తప్పనిసరి చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని సీఎం సిద్ధరామయ్య ఎక్స్లో పోస్టు చేశారు. ప్రైవేటు సంస్థల్లోని మేనేజ్మెంట్ పోస్టుల్లోనూ 50 శాతం, నాన్ మేనేజిమెంట్ పోస్టుల్లో 75 శాతం కన్నడ ప్రజలకే ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. కానీ దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో ఈ బిల్లును ఇప్పటికైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టకూడదని నిర్ణయించింది. కానీ భవిష్యత్లో ఈ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం ఉందనే భయం ప్రైవేటు కంపెనీలకు కలుగుతోంది.
ఇప్పుడు ఈ అవకాశాన్ని వాడుకునేందుకు లోకేశ్ వేగంగా రియాక్టయ్యారు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఏపీకి రావాలని ఆహ్వానించారు. విశాఖపట్నంలోని ఐటీ, ఏఐ, డేటా సెంటర్ క్లస్టర్లకు రావాలని, మంచి సౌకర్యాలు, నిరంతర విద్యుత్ అందిస్తామని అన్నారు. అయితే కంపెనీలు బెంగళూరు నుంచి రీలొకేట్ కావాలంటే ముందుగా హైదరాబాద్ వైపు చూస్తాయనే అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. దీంతో కంపెనీలను హైదరాబాద్కు ఆహ్వానిస్తే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని రేవంత్ సర్కారు ఆ సాహసం చేయకపోవచ్చు. అందుకే ఈ మంచి అవకాశాన్ని వాడుకోవాలనే పట్టుదలతో లోకేశ్ వెంటనే రంగంలోకి దిగారు. కంపెనీలను విశాఖకు రప్పించేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు.
This post was last modified on July 19, 2024 7:17 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…