Political News

కాంగ్రెస్ త‌ప్పును వాడుకునేందుకు లోకేశ్ ప్ర‌య‌త్నం!

అఖండ విజ‌యంతో ఏపీలో కూట‌మి అధికారంలో రావ‌డంతో మంత్రి నారా లోకేశ్ దూకుడుతో సాగుతున్నారు. ప్ర‌భుత్వ విష‌యాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఐటీ ప‌రంగా ఏపీని అభివృద్ధి చేసే చ‌ర్య‌ల‌పై ఫోక‌స్ పెట్టారు. ఈ క్ర‌మంలోనే క‌ర్ణాట‌క‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన ఓ త‌ప్పును వాడుకునేందుకు లోకేశ్ సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ప్రైవేట్ సంస్థ‌ల్లో ఉద్యోగాల విష‌యంలో స్థానిక‌త విష‌యంలో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం వివాదాస్ప‌ద నిర్ణ‌యం తీసుకుంది. దీంతో వెంట‌నే స్పందించిన లోకేశ్ ఐటీ కంపెనీల‌ను ఏపీకి ర‌మ్మంటున్నారు.

క‌ర్ణాట‌క‌లోని ప్రైవేటు సంస్థ‌ల్లో కూడా సీ, డీ గ్రూపు ఉద్యోగాలు వంద శాతం క‌న్న‌డిగుల‌కే ఇవ్వ‌డాన్ని త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంద‌ని సీఎం సిద్ధ‌రామ‌య్య ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రైవేటు సంస్థ‌ల్లోని మేనేజ్‌మెంట్ పోస్టుల్లోనూ 50 శాతం, నాన్ మేనేజిమెంట్ పోస్టుల్లో 75 శాతం క‌న్న‌డ ప్ర‌జ‌ల‌కే ఇవ్వాల‌ని కేబినెట్ తీర్మానించింది. కానీ దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో ఈ బిల్లును ఇప్ప‌టికైతే అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్ట‌కూడ‌ద‌ని నిర్ణ‌యించింది. కానీ భ‌విష్య‌త్‌లో ఈ నిర్ణ‌యాన్ని అమ‌లు చేసే అవ‌కాశం ఉంద‌నే భ‌యం ప్రైవేటు కంపెనీల‌కు క‌లుగుతోంది.

ఇప్పుడు ఈ అవ‌కాశాన్ని వాడుకునేందుకు లోకేశ్ వేగంగా రియాక్టయ్యారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఏపీకి రావాల‌ని ఆహ్వానించారు. విశాఖ‌ప‌ట్నంలోని ఐటీ, ఏఐ, డేటా సెంట‌ర్ క్ల‌స్ట‌ర్ల‌కు రావాల‌ని, మంచి సౌక‌ర్యాలు, నిరంత‌ర విద్యుత్ అందిస్తామ‌ని అన్నారు. అయితే కంపెనీలు బెంగ‌ళూరు నుంచి రీలొకేట్ కావాలంటే ముందుగా హైద‌రాబాద్ వైపు చూస్తాయ‌నే అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణ‌లోనూ కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే ఉంది. దీంతో కంపెనీల‌ను హైద‌రాబాద్‌కు ఆహ్వానిస్తే క‌ర్ణాట‌క‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తుంద‌ని రేవంత్ స‌ర్కారు ఆ సాహ‌సం చేయ‌క‌పోవ‌చ్చు. అందుకే ఈ మంచి అవ‌కాశాన్ని వాడుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో లోకేశ్ వెంట‌నే రంగంలోకి దిగారు. కంపెనీల‌ను విశాఖకు ర‌ప్పించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారు.

This post was last modified on July 19, 2024 7:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

53 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

1 hour ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

3 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago