అఖండ విజయంతో ఏపీలో కూటమి అధికారంలో రావడంతో మంత్రి నారా లోకేశ్ దూకుడుతో సాగుతున్నారు. ప్రభుత్వ విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఐటీ పరంగా ఏపీని అభివృద్ధి చేసే చర్యలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఓ తప్పును వాడుకునేందుకు లోకేశ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల విషయంలో స్థానికత విషయంలో కర్ణాటక ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దీంతో వెంటనే స్పందించిన లోకేశ్ ఐటీ కంపెనీలను ఏపీకి రమ్మంటున్నారు.
కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో కూడా సీ, డీ గ్రూపు ఉద్యోగాలు వంద శాతం కన్నడిగులకే ఇవ్వడాన్ని తప్పనిసరి చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని సీఎం సిద్ధరామయ్య ఎక్స్లో పోస్టు చేశారు. ప్రైవేటు సంస్థల్లోని మేనేజ్మెంట్ పోస్టుల్లోనూ 50 శాతం, నాన్ మేనేజిమెంట్ పోస్టుల్లో 75 శాతం కన్నడ ప్రజలకే ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. కానీ దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో ఈ బిల్లును ఇప్పటికైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టకూడదని నిర్ణయించింది. కానీ భవిష్యత్లో ఈ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం ఉందనే భయం ప్రైవేటు కంపెనీలకు కలుగుతోంది.
ఇప్పుడు ఈ అవకాశాన్ని వాడుకునేందుకు లోకేశ్ వేగంగా రియాక్టయ్యారు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఏపీకి రావాలని ఆహ్వానించారు. విశాఖపట్నంలోని ఐటీ, ఏఐ, డేటా సెంటర్ క్లస్టర్లకు రావాలని, మంచి సౌకర్యాలు, నిరంతర విద్యుత్ అందిస్తామని అన్నారు. అయితే కంపెనీలు బెంగళూరు నుంచి రీలొకేట్ కావాలంటే ముందుగా హైదరాబాద్ వైపు చూస్తాయనే అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. దీంతో కంపెనీలను హైదరాబాద్కు ఆహ్వానిస్తే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని రేవంత్ సర్కారు ఆ సాహసం చేయకపోవచ్చు. అందుకే ఈ మంచి అవకాశాన్ని వాడుకోవాలనే పట్టుదలతో లోకేశ్ వెంటనే రంగంలోకి దిగారు. కంపెనీలను విశాఖకు రప్పించేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు.
This post was last modified on July 19, 2024 7:17 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…