Political News

ఆ హత్యకు నిరసనగా జగన్ సంచలన నిర్ణయం

పల్నాడు జిల్లాలోని వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రషీద్ కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేసేందుకు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వినుకొండలో పర్యటించారు. బాధితుడు రషీద్ కుటుంబ సభ్యులను ఓదార్చిన జగన్ పార్టీ వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్…ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కోసం పనిచేశాడన్న కారణంతోనే రషీద్ ను దారుణంగా హత్య చేశారని, కానీ, పోలీసులు మాత్రం వ్యక్తిగత కారణాలని చెబుతున్నారని జగన్ మండిపడ్డారు.

పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేపై కూడా దాడి జరిగిందని, దాడి చేయడమే కాకుండా వాళ్లపై మర్డర్ కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న దాడులపై, అరాచక పాలనపై ప్రధాని మోడీతో పాటు అందరినీ కలుస్తానని జగన్ అన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులు, హత్యా రాజకీయాల గురించి ప్రధాని మోడీకి వివరిస్తానని జగన్ చెప్పారు. ఇక, ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తానని జగన్ అన్నారు.

అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలో బుధవారం నాడు ధర్నా చేస్తామని జగన్ సంచలన ప్రకటన చేశారు. పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ధర్నాకు దిగుతామన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకం రాజ్యమేలుతోందని జగన్ ఆరోపించారు.

This post was last modified on July 19, 2024 7:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

17 minutes ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

30 minutes ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

1 hour ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

3 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

4 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

4 hours ago