Political News

ఆ హత్యకు నిరసనగా జగన్ సంచలన నిర్ణయం

పల్నాడు జిల్లాలోని వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రషీద్ కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేసేందుకు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వినుకొండలో పర్యటించారు. బాధితుడు రషీద్ కుటుంబ సభ్యులను ఓదార్చిన జగన్ పార్టీ వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్…ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కోసం పనిచేశాడన్న కారణంతోనే రషీద్ ను దారుణంగా హత్య చేశారని, కానీ, పోలీసులు మాత్రం వ్యక్తిగత కారణాలని చెబుతున్నారని జగన్ మండిపడ్డారు.

పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేపై కూడా దాడి జరిగిందని, దాడి చేయడమే కాకుండా వాళ్లపై మర్డర్ కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న దాడులపై, అరాచక పాలనపై ప్రధాని మోడీతో పాటు అందరినీ కలుస్తానని జగన్ అన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులు, హత్యా రాజకీయాల గురించి ప్రధాని మోడీకి వివరిస్తానని జగన్ చెప్పారు. ఇక, ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తానని జగన్ అన్నారు.

అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలో బుధవారం నాడు ధర్నా చేస్తామని జగన్ సంచలన ప్రకటన చేశారు. పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ధర్నాకు దిగుతామన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకం రాజ్యమేలుతోందని జగన్ ఆరోపించారు.

This post was last modified on July 19, 2024 7:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

11 minutes ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

2 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

2 hours ago

‘జగన్ – కేసీఆర్’ జోడిని తలపించిన నాని

2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి…

2 hours ago

సమయం మించిపోతోంది స్వయంభు

ఒళ్ళు హూనం చేసుకుని సంవత్సరాలు ఖర్చు పెట్టి నిఖిల్ నటించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటిదాకా కొత్త  రిలీజ్…

3 hours ago

డెకాయిట్ ఎత్తులు దేనికోసం?

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి మైండ్ గేమ్స్, సస్పెన్స్ త్రిల్లర్స్. 'క్షణం',…

4 hours ago