Political News

పంచాయితీల‌కు ఊపిరి.. బాబు నిర్ణ‌యం ఏంటంటే!

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయితీలు.. కొన్నేళ్లుగా అలోల‌క్ష్మ‌ణా అంటూ.. అల‌మ‌టిస్తున్న విష‌యం తెలిసిందే. త‌మ‌కు కేంద్రం నుంచి వ‌స్తున్న నిధుల‌ను కూడా.. వైసీపీ స‌ర్కారు తీసుకుంటోంద‌ని.. త‌మ నిధులు త‌మ‌కు ఇవ్వాల‌ని పంచాయితీ స‌ర్పంచులు.. స‌భ్యులు.. కూడా పెద్ద ఎత్తున ఉద్య‌మించిన విష‌యం తెలిసిందే. అనేక మంది స‌ర్పంచులు సొంత నిధులు ఖ‌ర్చు చేసి మ‌రీ.. ప‌నులు చేయించారు. కానీ, స‌ర్కారు నుంచి నిధులు తిరిగి రాలేదు. దీంతో అప్పుల పాలై.. వాటిని తీర్చుకునే అవ‌కాశం లేక‌.. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న‌వారు ఉన్నారు.

మ‌రికొంద‌రు భిక్షాటన చేసి.. గ్రామాల‌ను అభివృద్ధి చేసుకున్న వారు కూడా.. ఉన్నారు. వైసీపీ హ‌యాంలో 15వ ఆర్థిక సంఘం ప్ర‌తిపాదించిన నిధులను కేంద్రం ఇచ్చినా.. వాటిని పంచాయితీల‌కు ఇవ్వ‌కుండా తొక్కిపెట్టార‌న్న‌ది అప్ప‌ట్లో ప్ర‌ధానంగా తెర‌మీదికి వ‌చ్చిన‌ ప్ర‌శ్న‌. ఇది వైసీపీ స‌ర్కారు కూలిపోయేందుకు కూడా దారి తీసింది. అయితే.. చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు ముందు.. పంచాయితీల‌ను ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్ర‌కారం.. ఆయ‌న తాజాగా చ‌ర్య‌లు తీసుకున్నారు.

పంచాయితీల‌కు కేంద్రం ప్ర‌క‌టించిన 15వ ఆర్థిక సంఘం నిధుల‌ను రూ.250 కోట్ల‌ను రాష్ట్ర స‌ర్కారు కేటాయించింది. పంచాయితీల జ‌నాభా ప్రాతిపదిక‌న‌.. వీటిని పంపిణీ చేయ‌నున్నారు. దీంతో రాష్ట్రంలో తొలి విజ‌యం ద‌క్కించుకున్న‌ట్టుగా అయింద‌ని టీడీపీ మ‌ద్ద‌తుదారులుగా ఉన్న పంచాయితీ స‌ర్పంచులు చెబుతున్నారు. గ‌తంలో కూడా 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు అందాయి. కానీ, పంచాయ‌తీలు.. విద్యుత్ బ‌కాయిలు ఉన్నాయ‌ని పేర్కొంటూ ఆ నిధుల‌ను మిన‌హాయించుకున్న ప‌రిస్థితి ఏర్ప‌డింది.

దీంతో అప్ప‌ట్లో పంచాయితీల వ్య‌వ‌హారం.. రాజ‌కీయంగా దుమ్మురేపింది. అనేక మంది స‌ర్పంచులు రోడ్డె క్కి ధ‌ర్నాలు కూడా చేశారు. అయినా.. అప్ప‌టి జ‌గ‌న్ స‌ర్కారు స్పందించ‌లేదు. క‌నీసం సీఎం స్థానంలో ఉన్న జ‌గ‌న్ ప‌న్నెత్తు స‌మాధానం కూడా చెప్ప‌లేదు. దీంతో ఎన్నిక‌ల వేళ‌.. పంచాయితీలు వైసీపీని ఓడిం చి తీరాల‌న్న తీర్మానం చేసుకున్న విష‌యం తెలిసిందే. అయినా.. వైసీపీ అధినేత స్పందించ‌లేదు. ఈ నేప‌థ్యంలో తాము అధికారంలోకి వ‌స్తే.. పంచాయితీల నిధుల‌ను పంచాయ‌తీల‌కే ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. తాజాగా ఇదే నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఇప్పుడు పంచాయితీల‌కు ఒకింత ఊపిరి వ‌చ్చిన‌ట్ట‌యింది.

This post was last modified on July 19, 2024 12:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

1 hour ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

2 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

3 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

3 hours ago

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

4 hours ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

6 hours ago