Political News

ఎంపీడీవో కుటుంబానికి బాబు ఫోన్‌.. ఎవ‌రాయ‌న‌? ఏం జ‌రిగింది?

ఎంపీడీవో…మండ‌ల ప‌రిష‌త్ డెవ‌ల‌ప్ మెంట్ అధికారి. వాస్త‌వానికి ప్ర‌భుత్వ శాఖ‌ల ప‌రంగా చూస్తే.. ఇది చిన్న ఉద్యోగం. మ‌రి అలాంటి ఎంపీడీవో కుటుంబానికి ఏకంగా.. ఎంతో బిజీగా ఉన్న సీఎం చంద్ర‌బాబు ఫోన్ చేశారు. ఆయ‌న కుటుంబాన్ని ఓదార్చారు. ఇది అసాధార‌ణం. మ‌రి ఏం జ‌రిగింది? ఎవ‌రా ఎంపీడీవో! ఇదీ.. ఇప్పుడు అంద‌రినీ ఆస‌క్తిగా చ‌ర్చించుకునేలా చేసింది. నిజానికి ఎంపీడీవో వ్య‌వ‌హారం రెండు రోజులుగా వార్త‌ల్లో వ‌చ్చినా.. ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కానీ.. సీఎం చంద్ర‌బాబు జోక్యంతో దీనిపై ఫోక‌స్ పెరిగింది.

ఎవ‌రీ ఎంపీడీవో..

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని న‌ర‌సాపురం మండ‌ల ప‌రిష‌త్‌లో ఎంపీడీవోగా ప‌నిచేస్తున్న వెంక‌ట ర‌మ‌ణ‌.. 4 రోజుల నుంచి క‌నిపించ‌కుండా పోయారు. వైసీపీ హ‌యాంలో ఆ పార్టీ నేత‌ల ఒత్తిళ్ల మేర‌కు మండ‌ల‌ప‌రిష‌త్‌లో కొంద‌రు అధికారులు త‌ప్పుల‌పై త‌ప్పులు చేశారు. ఆ విష‌యాలు తెలిసినా.. అప్ప‌ట్లో వెంక‌ట ర‌మ‌ణ జోక్యం చేసుకునేందుకు భ‌య‌ప‌డి మౌనంగా ఉండిపోయారు. కానీ, తాజాగా ప్ర‌భుత్వం మార‌డంతో ఆయా అక్ర‌మాల‌పై అన్వేష‌ణ్ ప్రారంభ‌మైంది. దీంతో వైసీపీ నేత‌ల నుంచి నిజాలు చెబితే.. ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ.. వెంక‌ట‌ర‌మ‌ణ‌పై ఒత్తిడి వ‌చ్చింద‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు.

ఇదిలావుంటే.. నాలుగు రోజుల కింద‌ట‌.. వెంక‌ట ర‌మ‌ణ‌.. న‌ర‌సాపురం నుంచి విజ‌య‌వాడ కు వ‌చ్చే రైలు ఎక్కి.. విజ‌య‌వాడ స‌మీపంలోని మ‌ధురాన‌గ‌ర్ వ‌ర‌కు చేరుకున్నారు. అక్క‌డ రైలు దిగి.. రైవ‌స్ కాలువ వ‌ర‌కు.. న‌డిచి వ‌చ్చార‌ని పోలీసులు తెలిపారు. త‌ర్వాత‌.. ఆయ‌న ఆచూకీ క‌నిపించ‌లేదు. అయితే.. ఆయ‌న కాల్వ‌లో దూకి మ‌ర‌ణించి.. ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. దీంతో వెంక‌ట‌ర‌మ‌ణ కుటుంబంలో తీవ్ర అల‌జ‌డి రేగి.. క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు.

చంద్ర‌బాబు స్పంద‌న‌..

4 రోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయిన నర్సాపురం ఎంపీడీఓ వెంకట‌ రమణారావు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు నాయడు ఫోన్ లో మాట్లాడారు. రమణారావు చివరిగా ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఏం చెప్పారు…ఆయన ఒత్తడికి గురవ‌డానికి గల కారణాలు ఏంటని సీఎం అడిగి తెలుసు కున్నారు. కొద్ది రోజులుగా వెంకటరమణారావు తీవ్ర ఒత్తిడితో ఉన్నారని.. ఆఫీసులో ఏదో జ‌రిగింద‌నే కార‌ణంగా ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఇబ్బంది పడ్డారని ఆయన సతీమణి సునీత తెలిపారు.

ఆమెతో పాటు, కుమారుడు సాయిరాంతో సీఎం ఫోన్ లో మాట్లాడారు. గతంలో ఎప్పుడైనా ఏవైనా అంశాలు మీ దృష్టికి తెచ్చారా అని సీఎం అడిగారు. ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తామని సీఎం అన్నారు. నిజాయితీ పరుడు, సమర్థుడైన అధికారి ఆచూకీ లేకుండా పోవడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. వెంకట రమణారావు కుటుంబాన్ని ఆదుకుంటామని, ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో ఈ వ్య‌వ‌హారం.. ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి చివ‌ర‌కు సుఖాంతం అవుతుందో లేదో చూడాలి.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

9 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

12 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

14 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

14 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

14 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

15 hours ago