రాజకీయాల్లో సింపతీకి ఉన్న స్థానం అందరికీ తెలిసిందే. అది ఏపీ అయినా.. ఇప్పుడు అమెరికా అయినా.. ఒక్కటే అని నిరూపణ అయింది. ఏపీలో చంద్రబాబును జైల్లో పెట్టిన తర్వాత.. టీడీపీపై సింపతీ పెరిగిందనే సమాచారం తెలిసిందే. తద్వారా ఓటర్లు ఈవీఎంలలో బటన్ నొక్కేశారు. ఫలితంగా టీడీపీ కనీవినీ ఎరుగని రీతిలో ఇంకో మాటలో చెప్పాలంటే.. పార్టీ స్థాపించిన తర్వాత.. ఎన్నడూ రాని రీతిలో సీట్లు కొల్లగొట్టింది. ఏకంగా 135 స్థానాల్లో విజయం దక్కించుకుంది. ఇదంతా సింపతీనేనని అందరూ ఒప్పుకొన్న మాట.
ఇక, ఇప్పుడు అమెరికా విషయానికి వస్తే.. ఇక్కడ తాజాగా పెన్సిల్వేనియాలో తాజాగా రెండు రోజుల కిందట అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. అయితే.. తృటిలో ఆయన తప్పించుకున్నారు. కుడి చెవికి మాత్రం కొంత గాయమైంది. అయితే.. దీని నుంచి ఆయన వెంటనే కోలుకున్నారు. మళ్లీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అయితే.. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. ఆయన ప్రసంగాలను వీక్షించేందుకు ప్రత్యక్షంగా వచ్చే వారి సంఖ్య ఇప్పుడు డబుల్ అయింది. అంతేకాదు.. ఆన్లైన్లో ఆయన ప్రసంగాలు వినేవారి సంఖ్య కూడా డబుల్ను మించిపోయింది. ఈ రెండు మాత్రమే కాదు.. మరో చిత్రం కూడా చోటు చేసుకుంది.
నిన్న మొన్నటి వరకు.. ట్రంప్ను బలపరిచేది లేదని.. భీష్మించుకుని కూర్చుకున్న కొందరు రిపబ్లికన్ పార్టీ(ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ) నాయకులు ఇప్పుడు ఆయనను బలపరిచేందుకు క్యూకట్టారు. నిన్న మొన్నటి వరకు 30 శాతం మంది రిపబ్లికన్ నాయకులు ట్రంప్ను విభేదించారు. కొన్ని కొన్ని చోట్ల ఆయనకు మద్దతుగా ముందుకు కూడా రాలేదు. ఈ విషయంలో రిపబ్లికన్లను ఘటన జరిగిన రోజు కూడా.. ట్రంప్ బ్రతిమాలుకున్నారు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా దాడి ఘటన జరిగిన తర్వాత.. అమెరికన్లలో వచ్చిన మార్పుతో రిపబ్లికన్లలో ట్రంప్ను వ్యతిరేకిస్తున్నవారు కూడా ఆయనకు మద్దతు గా నిలిచారు.
మరో ముఖ్యవిషయం.. ట్రంప్పై జరిగిన తుపాకీ ఘటన తర్వాత.. ఆయనకు విరాళాల వెల్లువ వరదలా పారింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గత వారం వరకు.. ఎవరికి మద్దతివ్వనని ప్రకటించిన విషయం తెలిసిందే. జోబైడెన్, ట్రంప్ ఇద్దరికీతాను సమాన దూరం పాటిస్తానని.. ఎవరికీ రూపాయి ఇచ్చేది లేదని వెల్లడించారు. ఈయన వెంటే.. పలువురు ధనవంతులు కూడా ముందుకు సాగారు. కానీ, పెన్సిల్వేనియా ఘటన తర్వాత.. అనూహ్యంగా మస్క్ మనసు మార్చుకున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు నెల నెలా 376 కోట్ల రూపాయలను(అమెరికా కరెన్సీలో 49 మిలియన్ డాలర్లు) విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ఇక, ప్రపంచ కుబేరుడే కదిలిన తర్వాత మిగిలిన వారు ఊరుకుంటారా? వారు కూడా.. ట్రంప్కు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఇప్పుడు ట్రంప్.. ఎన్నికలకు ఆరు మాసాల ముందుగానే.. గెలిచినంత ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. సో.. సింపతీ అంటే సింపతీనే.. ఏపీ అయినా.. అమెరికా అయినా అంటే.. ఎవరైనా కాదనగలరా?!
This post was last modified on July 17, 2024 11:01 am
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…