Political News

ప‌ద‌వుల ఎఫెక్ట్‌: టీడీపీలో త‌మ్ముళ్లు లైన్‌లోకి వ‌స్తారా?

ఎన్నాళ్లో వేచిన ఉద‌యం కోసం ఇప్పుడు టీడీపీలో ఎదుర‌వుతోందా? ఇప్ప‌టి వ‌ర‌కు అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్న పార్టీ నేత‌లు ఒక్క‌రొక్క‌రుగా లైన్‌లోకి వ‌స్తారా? అంటే.. తాజాగా చంద్ర‌బాబు వేస్తున్న అడుగులు గ‌మ‌నిస్తున్న వారు ఔన‌నే అంటున్నారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో తీవ్ర‌స్థాయిలో దెబ్బ‌తిన్న టీడీపీని లైన్‌లో పెట్టాల్సిన అవ‌స‌రం చాలా ఉంది. అయితే, అనూహ్యంగా పార్టీ నుంచి జంపింగులు పెరుగుతున్నాయి. గెలిచిన వారు.. ఓడిన వారు అనే తేడా లేకుండా ఎక్క‌డిక‌క్క‌డ చంద్ర‌బాబుకు దూర‌మ‌య్యేందుకు త‌మ్ముళ్లు త‌ట్టాబుట్టా స‌ర్దుకుంటున్నారు.

కొంద‌రు ఇప్ప‌టికే సైకిల్ దిగేశారు. ఈ క్ర‌మంలో అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో.. పార్టీ బ‌లం కోల్పోయి.. జెండా ప‌ట్టుకునే త‌మ్ముడు కూడా లేకుండా పోయారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు పార్టీకి కాయ‌క‌ల్ప చికిత్స చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని చంద్ర‌బాబుకు ఇట‌వ‌ల కాలంలో అనేక మంది సీనియ‌ర్లు చెబుతూ వ‌స్తున్నారు. “మాటలు చెబితే.. వినేరోజులు పోయాయి. ఇప్పుడు కావాల్సింది నాయ‌కుల‌ను సంతృప్తి ప‌ర‌చ‌డ‌మే!” అనే సూచ‌న‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే యువ‌త‌కు పార్టీలో 33 శాతం ప్రాధాన్యం ఇస్తామ‌ని చెప్పారు. దీనిపై ఇంకా క‌స‌ర‌త్తు జ‌రుగుతూనే ఉంది.

అదేక్ర‌మంలో ఇప్పుడు ప్ర‌త్యేకంగా పార్ల‌మెంటు స్థానాల ఆధారంగా టీడీపీ క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. అంటే.. రాష్ట్ర వ్యాప్తంగా 175 పార్ల‌మెంటు స్థానాల‌కు కూడా సీనియ‌ర్లు మాజీ మంత్రుల‌ను టీడీపీ పార్ల‌మెంట‌రీ స్థానం అధ్య‌క్షులుగా నియ‌మించాల‌ని బాబు నిర్ణ‌యించారు. దీనివ‌ల్ల‌.. పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. వాస్త‌వానికి ఇది టీడీపీలో సంచ‌ల‌న నిర్ణ‌యం.

ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాలు, మండ‌లాలు, బూత్ స్థాయి క‌మిటీలు మాత్ర‌మే కొన‌సాగుతున్నాయి. ఇప్పుడు వీటికి అనుబంధంగా పార్ల‌మెంటు స్థాయి క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా పార్టీ ఏమేర‌కు బ‌ల‌ప‌డుతుందో చూడాలి. ఏదేమైనా.. ఈ ప్ర‌యోగంతో ఇప్ప‌టి వ‌ర‌కు అసంతృప్తితో ర‌గిలిపోతున్న‌త‌మ్ముళ్ల‌కు మాత్రం ఒకింత ఉప‌శ‌మ‌నం క‌లిగిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on September 24, 2020 9:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

18 minutes ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

1 hour ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

3 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

3 hours ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

3 hours ago

దురంధర్ హీరోకి విచిత్రమైన పరిస్థితి

బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…

4 hours ago