ఎన్నాళ్లో వేచిన ఉదయం కోసం ఇప్పుడు టీడీపీలో ఎదురవుతోందా? ఇప్పటి వరకు అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్న పార్టీ నేతలు ఒక్కరొక్కరుగా లైన్లోకి వస్తారా? అంటే.. తాజాగా చంద్రబాబు వేస్తున్న అడుగులు గమనిస్తున్న వారు ఔననే అంటున్నారు. గత ఏడాది ఎన్నికల్లో తీవ్రస్థాయిలో దెబ్బతిన్న టీడీపీని లైన్లో పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. అయితే, అనూహ్యంగా పార్టీ నుంచి జంపింగులు పెరుగుతున్నాయి. గెలిచిన వారు.. ఓడిన వారు అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ చంద్రబాబుకు దూరమయ్యేందుకు తమ్ముళ్లు తట్టాబుట్టా సర్దుకుంటున్నారు.
కొందరు ఇప్పటికే సైకిల్ దిగేశారు. ఈ క్రమంలో అనేక నియోజకవర్గాల్లో.. పార్టీ బలం కోల్పోయి.. జెండా పట్టుకునే తమ్ముడు కూడా లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు పార్టీకి కాయకల్ప చికిత్స చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబుకు ఇటవల కాలంలో అనేక మంది సీనియర్లు చెబుతూ వస్తున్నారు. “మాటలు చెబితే.. వినేరోజులు పోయాయి. ఇప్పుడు కావాల్సింది నాయకులను సంతృప్తి పరచడమే!” అనే సూచనలు వచ్చాయి. ఈ క్రమంలోనే యువతకు పార్టీలో 33 శాతం ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. దీనిపై ఇంకా కసరత్తు జరుగుతూనే ఉంది.
అదేక్రమంలో ఇప్పుడు ప్రత్యేకంగా పార్లమెంటు స్థానాల ఆధారంగా టీడీపీ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంటే.. రాష్ట్ర వ్యాప్తంగా 175 పార్లమెంటు స్థానాలకు కూడా సీనియర్లు మాజీ మంత్రులను టీడీపీ పార్లమెంటరీ స్థానం అధ్యక్షులుగా నియమించాలని బాబు నిర్ణయించారు. దీనివల్ల.. పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి ఇది టీడీపీలో సంచలన నిర్ణయం.
ఇప్పటి వరకు జిల్లాలు, మండలాలు, బూత్ స్థాయి కమిటీలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇప్పుడు వీటికి అనుబంధంగా పార్లమెంటు స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా పార్టీ ఏమేరకు బలపడుతుందో చూడాలి. ఏదేమైనా.. ఈ ప్రయోగంతో ఇప్పటి వరకు అసంతృప్తితో రగిలిపోతున్నతమ్ముళ్లకు మాత్రం ఒకింత ఉపశమనం కలిగినట్టేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on September 24, 2020 9:56 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…