ఎన్నాళ్లో వేచిన ఉదయం కోసం ఇప్పుడు టీడీపీలో ఎదురవుతోందా? ఇప్పటి వరకు అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్న పార్టీ నేతలు ఒక్కరొక్కరుగా లైన్లోకి వస్తారా? అంటే.. తాజాగా చంద్రబాబు వేస్తున్న అడుగులు గమనిస్తున్న వారు ఔననే అంటున్నారు. గత ఏడాది ఎన్నికల్లో తీవ్రస్థాయిలో దెబ్బతిన్న టీడీపీని లైన్లో పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. అయితే, అనూహ్యంగా పార్టీ నుంచి జంపింగులు పెరుగుతున్నాయి. గెలిచిన వారు.. ఓడిన వారు అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ చంద్రబాబుకు దూరమయ్యేందుకు తమ్ముళ్లు తట్టాబుట్టా సర్దుకుంటున్నారు.
కొందరు ఇప్పటికే సైకిల్ దిగేశారు. ఈ క్రమంలో అనేక నియోజకవర్గాల్లో.. పార్టీ బలం కోల్పోయి.. జెండా పట్టుకునే తమ్ముడు కూడా లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు పార్టీకి కాయకల్ప చికిత్స చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబుకు ఇటవల కాలంలో అనేక మంది సీనియర్లు చెబుతూ వస్తున్నారు. “మాటలు చెబితే.. వినేరోజులు పోయాయి. ఇప్పుడు కావాల్సింది నాయకులను సంతృప్తి పరచడమే!” అనే సూచనలు వచ్చాయి. ఈ క్రమంలోనే యువతకు పార్టీలో 33 శాతం ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. దీనిపై ఇంకా కసరత్తు జరుగుతూనే ఉంది.
అదేక్రమంలో ఇప్పుడు ప్రత్యేకంగా పార్లమెంటు స్థానాల ఆధారంగా టీడీపీ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంటే.. రాష్ట్ర వ్యాప్తంగా 175 పార్లమెంటు స్థానాలకు కూడా సీనియర్లు మాజీ మంత్రులను టీడీపీ పార్లమెంటరీ స్థానం అధ్యక్షులుగా నియమించాలని బాబు నిర్ణయించారు. దీనివల్ల.. పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి ఇది టీడీపీలో సంచలన నిర్ణయం.
ఇప్పటి వరకు జిల్లాలు, మండలాలు, బూత్ స్థాయి కమిటీలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇప్పుడు వీటికి అనుబంధంగా పార్లమెంటు స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా పార్టీ ఏమేరకు బలపడుతుందో చూడాలి. ఏదేమైనా.. ఈ ప్రయోగంతో ఇప్పటి వరకు అసంతృప్తితో రగిలిపోతున్నతమ్ముళ్లకు మాత్రం ఒకింత ఉపశమనం కలిగినట్టేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on September 24, 2020 9:56 am
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్.. తాను జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్)…