Political News

ప‌ద‌వుల ఎఫెక్ట్‌: టీడీపీలో త‌మ్ముళ్లు లైన్‌లోకి వ‌స్తారా?

ఎన్నాళ్లో వేచిన ఉద‌యం కోసం ఇప్పుడు టీడీపీలో ఎదుర‌వుతోందా? ఇప్ప‌టి వ‌ర‌కు అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్న పార్టీ నేత‌లు ఒక్క‌రొక్క‌రుగా లైన్‌లోకి వ‌స్తారా? అంటే.. తాజాగా చంద్ర‌బాబు వేస్తున్న అడుగులు గ‌మ‌నిస్తున్న వారు ఔన‌నే అంటున్నారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో తీవ్ర‌స్థాయిలో దెబ్బ‌తిన్న టీడీపీని లైన్‌లో పెట్టాల్సిన అవ‌స‌రం చాలా ఉంది. అయితే, అనూహ్యంగా పార్టీ నుంచి జంపింగులు పెరుగుతున్నాయి. గెలిచిన వారు.. ఓడిన వారు అనే తేడా లేకుండా ఎక్క‌డిక‌క్క‌డ చంద్ర‌బాబుకు దూర‌మ‌య్యేందుకు త‌మ్ముళ్లు త‌ట్టాబుట్టా స‌ర్దుకుంటున్నారు.

కొంద‌రు ఇప్ప‌టికే సైకిల్ దిగేశారు. ఈ క్ర‌మంలో అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో.. పార్టీ బ‌లం కోల్పోయి.. జెండా ప‌ట్టుకునే త‌మ్ముడు కూడా లేకుండా పోయారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు పార్టీకి కాయ‌క‌ల్ప చికిత్స చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని చంద్ర‌బాబుకు ఇట‌వ‌ల కాలంలో అనేక మంది సీనియ‌ర్లు చెబుతూ వ‌స్తున్నారు. “మాటలు చెబితే.. వినేరోజులు పోయాయి. ఇప్పుడు కావాల్సింది నాయ‌కుల‌ను సంతృప్తి ప‌ర‌చ‌డ‌మే!” అనే సూచ‌న‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే యువ‌త‌కు పార్టీలో 33 శాతం ప్రాధాన్యం ఇస్తామ‌ని చెప్పారు. దీనిపై ఇంకా క‌స‌ర‌త్తు జ‌రుగుతూనే ఉంది.

అదేక్ర‌మంలో ఇప్పుడు ప్ర‌త్యేకంగా పార్ల‌మెంటు స్థానాల ఆధారంగా టీడీపీ క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. అంటే.. రాష్ట్ర వ్యాప్తంగా 175 పార్ల‌మెంటు స్థానాల‌కు కూడా సీనియ‌ర్లు మాజీ మంత్రుల‌ను టీడీపీ పార్ల‌మెంట‌రీ స్థానం అధ్య‌క్షులుగా నియ‌మించాల‌ని బాబు నిర్ణ‌యించారు. దీనివ‌ల్ల‌.. పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. వాస్త‌వానికి ఇది టీడీపీలో సంచ‌ల‌న నిర్ణ‌యం.

ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాలు, మండ‌లాలు, బూత్ స్థాయి క‌మిటీలు మాత్ర‌మే కొన‌సాగుతున్నాయి. ఇప్పుడు వీటికి అనుబంధంగా పార్ల‌మెంటు స్థాయి క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా పార్టీ ఏమేర‌కు బ‌ల‌ప‌డుతుందో చూడాలి. ఏదేమైనా.. ఈ ప్ర‌యోగంతో ఇప్ప‌టి వ‌ర‌కు అసంతృప్తితో ర‌గిలిపోతున్న‌త‌మ్ముళ్ల‌కు మాత్రం ఒకింత ఉప‌శ‌మ‌నం క‌లిగిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on September 24, 2020 9:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎక్కి తొక్కిన ఘనటకు తోపుదుర్తే కారణమట!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…

28 minutes ago

వీరమల్లు చుట్టూ సమస్యల సైన్యం

ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…

1 hour ago

ఐటీ అంటే చంద్ర‌బాబు.. యంగ్ ఇండియా అంటే నేను : రేవంత్ రెడ్డి

ముఖ్య‌మంత్రుల 'బ్రాండ్స్‌'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తి ముఖ్య‌మంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంద‌న్నారు. "రెండు…

1 hour ago

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ అరెస్టు!

బీఆర్ఎస్ నాయ‌కుడు, బోధ‌న్ నియోజ‌క‌వర్గం మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ అరెస్ట‌య్యారు. రెండేళ్ల కింద‌ట జ‌రిగిన ఘ‌ట‌న‌లో త‌న కుమారుడిని స‌ద‌రు…

2 hours ago

కాకాణి దేశం దాటేసి వెళ్లిపోయారా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…

3 hours ago

జ‌గ‌న్ స‌తీమ‌ణిపై దుర్భాష‌లు.. టీడీపీ నేత‌పై బాబు క‌ఠిన చ‌ర్య‌లు

త‌ప్పు ఎవ‌రు చేసినా త‌ప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు.. త‌న పార్టీవారిని కూడా వ‌దిలి…

3 hours ago