తెలంగాణలో రైతు రుణ మాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయిన సంగతి తెలిసిందే. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఉంటుందని, ఈ నెల 18 లోపు లక్ష రూపాయలలోపు రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎల్లుండి సాయంత్రానికల్లా రైతులు ఖాతాలలో డబ్బులు జమవుతాయని రేవంత్ అన్నారు. అయితే, రుణమాఫీకి రేషన్ కార్డు కచ్చితంగా ఉండాల్సిన పనిలేదని, రైతు పట్టాదారు పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని రేవంత్ క్లారిటీనిచ్చారు. కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్ కార్డు నిబంధన పెట్టామని వివరణనిచ్చారు.
రుణమాఫీ సంబరాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొంటారని రేవంత్ రెడ్డి చెప్పారు. పంద్రాగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని రేవంత్ చెప్పారు. ఎంత కష్టమైనా, భారమైనా ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని రేవంత్ తేల్చి చెప్పారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నను అప్పులు నుంచి ఆశలు సాగు వైపు నడిపించే బృహత్తర సాహసమే రైతు రుణమాఫీ పథకమని రేవంత్ చెప్పారు. ఇది, కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైన ఘనత అని ఆయన అన్నారు. ఇది ‘రైతన్నకు మీ రేవంతన్న మాట’ అంటూ రేవంత్ రెడ్డి రుణమాఫీపై స్టేట్మెంట్ ఇచ్చారు.
దీంతోపాటు, ఆరోగ్యశ్రీ పథకానికి రేషన్ కార్డుకు లింకు పెట్టొద్దని రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలని, అందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉండాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని, గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు అందేలా సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు పారితోషికం పెంచాలని రేవంత్ చెప్పారు.
This post was last modified on July 16, 2024 9:46 pm
గతంలో కడప జిల్లాను వైఎస్సార్ జిల్లాగా మారుస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు…
నిన్న విడుదలైన స్వాగ్ యువతకు బాగానే కనెక్ట్ అయ్యిందని సోషల్ మీడియా రెస్పాన్స్ చెబుతోంది. సాధారణ ప్రేక్షకులకు ఏ మేరకు…
శాండల్ వుడ్ లో మంచి గుర్తింపు ఉన్న హీరో ధృవ సర్జ. స్వయానా యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు. ఆ…
జూనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతను ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నడు. ఎంతోమంది…
రాష్ట్రంలో రెడ్ బుక్కుల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు ఇది టీడీపీ యువ నాయకుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్కు…
అయాన్ ముఖర్జీ.. ‘వేకప్ సిద్’ అనే క్లాస్ మూవీతో పరిచయమైన బాలీవుడ్ దర్శకుడు. ఈ చిత్రం ఓ మోస్తరు ఫలితాన్ని…