Political News

జనసేన నాయకులకు పవన్ వార్నింగ్

ఆంధ్రప్రదేవ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడక్కడా కొంచెం హద్దుదాటి ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇలాగే కొనసాగితే వైసీపీకి.. ఈ రెండు పార్టీలకు తేడా ఏంటి అనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నం అవుతుందని.. కాబట్టి ఆ పార్టీల అధినేతలు జోక్యం చేసుకుని, హద్దులు దాటి ప్రవర్తించే వారిని అదుపు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా జరిగిన పార్టీ క్రియాశీల సమావేశంలో తన పార్టీ నేతలకు సుతి మెత్తగా హెచ్చరికలు జారీ చేశారు.

రౌడీయిజాన్ని తాను అస్సలు సహించబోనని.. అలా ప్రవర్తించే వారిని పక్కన పెట్టడానికి వెనుకాడనని పవన్ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. అంతే కాక వారసత్వ రాజకీయాలు చేయాలనుకునే వారికి ఆయన వార్నింగ్ ఇచ్చారు.

తాను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్లకు తెలుసని పేర్కొంటూ.. కొందరు నాయకులు రౌడీయిజం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. బయటే కాకుండా పార్టీలో ఉన్న చిన్న వారి మీద జులం చూపించడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారని.. అలాంటి వ్యక్తులు తనకు సన్నిహితులైనా, తన వద్ద చాలా ఏళ్లుగా నమ్మకంగా ఉన్నా సరే.. తమ తీరు మార్చుకోకుంటే పక్కన పెట్టడానికి ఏమాత్రం సందేహించనని పవన్ హెచ్చరించాడు. రౌడీ రాజకీయం జనసేనలో చెల్లదని పవన్ తేల్చి చెప్పాడు. అలాగే వారసత్వ రాజకీయాలు చేయాలనునేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని పవన్ అన్నాడు.

తాను పట్టుదల వస్తే సొంత రక్తాన్ని కూడా పక్కన పెడతానని.. ఎప్పుడూ మన పిల్లలే ఎదగాలని చూడకూడదని.. అలా చేస్తే కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుందని పవన్ చెప్పాడు. క్రమశిక్షణా రాహిత్యాన్ని తాను సహించనని పవన్ అన్నాడు. రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని పిల్లలు కొనసాగిస్తే తప్పులేదని.. కానీ అది సహజ పద్ధతిలో జరగాలని.. కష్టపడి ఎదగాలి తప్ప బలవంతంగా జనం మీద, పార్టీ మీద వారసులను రుద్దాలని చూడకూడదని పవన్ అన్నాడు. తాము లేకపోతే పార్టీ గెలుపు కష్టం అని కొందరు అనుకుంటూ ఉండొచ్చని.. కానీ తాను దెబ్బ తినడానికి కూడా సిద్ధం తప్ప రాజీ పడనని పవన్ తేల్చి చెప్పాడు.

This post was last modified on July 15, 2024 6:28 pm

Share

Recent Posts

మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం

ఇటీవ‌ల ఇద్ద‌రు ఫోక్ డ్యాన్స‌ర్ల‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త వివాదం సోష‌ల్ మీడియాలో, మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే…

22 minutes ago

ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్… శిథిలాల కింద 50 మంది?

ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్ ప్రాంతంలో 4 అంతస్తుల భవనం హఠాత్తుగా కుప్పుకూలిన ఘటన షాకింగ్…

1 hour ago

అనస్వరకు అంత డిమాండ్ ఉందా?

మలయాళం నుంచి కథానాయికలను తెలుగులోకి తీసుకురావడం కొత్త కాదు. నయనతార, మమత మోహన్ దాస్, కీర్తి సురేష్ లాంటి చాలామంది…

3 hours ago

‘రాకా’ లెవెలే వేరంటున్న నటుడు

పుష్ప, పుష్ప-2 సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. ఈ సినిమాల తర్వాత బన్నీ…

3 hours ago

ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం లాభం?

అడుసు తొక్కనేల…కాలు కడగనేల..అనే సామెతను పెద్దలు ఊరికే వేయలేదు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు,…

3 hours ago

బాలయ్య కొడుకు కోసం కొత్త ముహూర్తం?

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ రెండు దశాబ్దాల కిందటే తెరంగేట్రం చేశాడు. అక్కినేని నాగార్జున ఇద్దరు కొడుకులూ ఒకరి…

6 hours ago