ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయి ప్రభుత్వం కొలువుదీరినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖాళీగా వదిలేసిన ఒక స్థానం ఎవరికి దక్కుతుందా అని వంద మంది ఆశావాహులను ఊరిస్తున్నది. ఏపీ క్యాబినెట్ లో మంత్రులుగా 25 మందికి అవకాశం ఉంది. అయితే చంద్రబాబు తన క్యాబినెట్ లో ఇప్పటి వరకు 24 మందిని తీసుకున్నారు. దీంతో ఒక మంత్రి పదవి ఖాళీగా మిగిలిపోయింది.
చంద్రబాబు దీనిని వ్యూహాత్మకంగా వదిలేశారా ? లేక ఆయన మనసులో ఎవరైనా ఉన్నారా ? దానిని భర్తీ చేస్తారా ? లేక అలాగే వదిలేస్తారా ? అన్నది అర్ధంకాక ఆశావాహులు తలలు పట్టుకుంటున్నారు. ఈ సారి మంత్రి వర్గంలో చంద్రబాబు యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. తొలిసారి ఎన్నికైన వారికి అమాత్యులుగా అందలం ఎక్కించారు. కాకలు తీరిన సీనియర్ టీడీపీ నేతలను మంత్రి పదవులు ఇవ్వకుండా పక్కన పెట్టారు. దీంతో మిగిలిన స్థానంపై అందరూ ఆశలు పెట్టుకున్నారు.
టీడీపీలో సీనియర్ నేతలు, మాజీ మంత్రులు అయిన పరిటాల సునీత, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, కళింగ సామాజిక వర్గం నుండి కూన రవికుమార్, టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయిన రఘురామ కృష్ణంరాజు, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమ, ఆలపాటి రాజా, దూళిపాల నరేంద్ర, జనసేన నుండి గెలిచిన మండలి బుద్దప్రసాద్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ నుండి గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయప్రకాష్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి ఇలా మిగిలిపోయిన మంత్రి పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య చాంతాడంత పేరుకుపోయింది.
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా గెలిచిన ప్రతి ఏడు మందిలో ఒకరికి మంత్రి పదవి చొప్పున జనసేనకు 3, బీజేపీకి 1, మిగిలినవి టీడీపీ పార్టీకి ఇచ్చి మంత్రి పదవులను భర్తీ చేశారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో ఎవరి పర్ ఫార్మెన్స్ అయినా బాగోలేకుంటే వారిని తొలగించి దాంతో ఇది భర్తీ చేస్తారా ? అన్న టెన్షన్ కూడా మంత్రులను అటెన్షన్ లో ఉంచుతుందని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బాబు ఆలోచన ఏంటా అని ఆశావాహులు మదనపడుతున్నారు.
This post was last modified on July 14, 2024 12:25 pm
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…