ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయి ప్రభుత్వం కొలువుదీరినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖాళీగా వదిలేసిన ఒక స్థానం ఎవరికి దక్కుతుందా అని వంద మంది ఆశావాహులను ఊరిస్తున్నది. ఏపీ క్యాబినెట్ లో మంత్రులుగా 25 మందికి అవకాశం ఉంది. అయితే చంద్రబాబు తన క్యాబినెట్ లో ఇప్పటి వరకు 24 మందిని తీసుకున్నారు. దీంతో ఒక మంత్రి పదవి ఖాళీగా మిగిలిపోయింది.
చంద్రబాబు దీనిని వ్యూహాత్మకంగా వదిలేశారా ? లేక ఆయన మనసులో ఎవరైనా ఉన్నారా ? దానిని భర్తీ చేస్తారా ? లేక అలాగే వదిలేస్తారా ? అన్నది అర్ధంకాక ఆశావాహులు తలలు పట్టుకుంటున్నారు. ఈ సారి మంత్రి వర్గంలో చంద్రబాబు యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. తొలిసారి ఎన్నికైన వారికి అమాత్యులుగా అందలం ఎక్కించారు. కాకలు తీరిన సీనియర్ టీడీపీ నేతలను మంత్రి పదవులు ఇవ్వకుండా పక్కన పెట్టారు. దీంతో మిగిలిన స్థానంపై అందరూ ఆశలు పెట్టుకున్నారు.
టీడీపీలో సీనియర్ నేతలు, మాజీ మంత్రులు అయిన పరిటాల సునీత, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, కళింగ సామాజిక వర్గం నుండి కూన రవికుమార్, టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయిన రఘురామ కృష్ణంరాజు, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమ, ఆలపాటి రాజా, దూళిపాల నరేంద్ర, జనసేన నుండి గెలిచిన మండలి బుద్దప్రసాద్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ నుండి గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయప్రకాష్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి ఇలా మిగిలిపోయిన మంత్రి పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య చాంతాడంత పేరుకుపోయింది.
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా గెలిచిన ప్రతి ఏడు మందిలో ఒకరికి మంత్రి పదవి చొప్పున జనసేనకు 3, బీజేపీకి 1, మిగిలినవి టీడీపీ పార్టీకి ఇచ్చి మంత్రి పదవులను భర్తీ చేశారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో ఎవరి పర్ ఫార్మెన్స్ అయినా బాగోలేకుంటే వారిని తొలగించి దాంతో ఇది భర్తీ చేస్తారా ? అన్న టెన్షన్ కూడా మంత్రులను అటెన్షన్ లో ఉంచుతుందని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బాబు ఆలోచన ఏంటా అని ఆశావాహులు మదనపడుతున్నారు.
This post was last modified on July 14, 2024 12:25 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…