వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై తాజాగా గుంటూరు పోలీసులు ఐపీసీ సెక్షన్ 307(హత్యాయత్నం) సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైసీపీ మాజీ ఎంపీ.. ప్రస్తుత టీడీపీ ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. జగన్పై హత్యాయత్నం.. నిర్బంధం సహా.. ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
అయితే.. సాధారణంగా ఇలా ఒక మాజీ సీఎంపై హత్యాయత్నం కేసు నమోదు కావడం.. ఎఫ్ ఐఆర్ లోనూ ఆయన పేరు ఉండడం ఇదే తొలిసారి. ఇది నిజంగానే వైసీపీ ఉలిక్కి పడాల్సిన విషయం. కానీ, ఆ పార్టీలో ఎలాంటి జంకు కనిపించలేదు.
అంతేకాదు..జగన్కు ఇవన్నీ ఒక లెక్కా అని నాయకులు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి కేసులు ఎన్ని చూడలేదు. డక్కాముక్కీలు తిన్న నాయకుడు అంటూ జగన్ను కొందరు నాయకులు ప్రశంసించడం.. కేసులు నమోదు కావడం కూడా.. ఒక గొప్ప ఘన కార్యంగా వారు భావించడం.. గమనార్హం. తాజాగా మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి ఇతర నాయకుల వరకు కూడా జగన్ పై నమోదైన కేసులను లైట్ తీసుకున్నారు. ఇవి కోర్టుల్లో నిలబడే కేసులు కావని.. వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఉద్దేశ పూర్వకంగా.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వీటిని నమోదు చేశారని చెప్పుకొచ్చారు.
ఇక, మరో అడుగు ముందుకు వేసి.. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే.. రఘురామ ఇలా జగన్పై కేసులు పెట్టారని కాకాని వ్యాఖ్యానించారు. “మంత్రివర్గంలో చోటు కోసం కొందరు ప్రయత్నించారు. అది రాలేదు. ఇలా చేస్తే అయినా.. వచ్చే సారి దక్కుతుందని ఆశ ఉండొచ్చు.
చంద్రబాబు ఆనందం కోసం.. ఆయన కళ్లలో సంతోషం కోసమే.. ఇప్పుడు ఇలా కేసులు పెట్టాడు. ఇవన్నీ.. జగన్కు కొత్తకాదు. అనేక కేసులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వీళ్లను చూసి భయపడతాడా?” అని కాకాని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, ఆయన పరివారం శునకానందం పొందుతున్నారని.. వారిని అలానే పొందాలని తాను కోరుతున్నానని వ్యాఖ్యానించారు.
This post was last modified on July 14, 2024 10:12 am
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…