వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై తాజాగా గుంటూరు పోలీసులు ఐపీసీ సెక్షన్ 307(హత్యాయత్నం) సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైసీపీ మాజీ ఎంపీ.. ప్రస్తుత టీడీపీ ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. జగన్పై హత్యాయత్నం.. నిర్బంధం సహా.. ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
అయితే.. సాధారణంగా ఇలా ఒక మాజీ సీఎంపై హత్యాయత్నం కేసు నమోదు కావడం.. ఎఫ్ ఐఆర్ లోనూ ఆయన పేరు ఉండడం ఇదే తొలిసారి. ఇది నిజంగానే వైసీపీ ఉలిక్కి పడాల్సిన విషయం. కానీ, ఆ పార్టీలో ఎలాంటి జంకు కనిపించలేదు.
అంతేకాదు..జగన్కు ఇవన్నీ ఒక లెక్కా అని నాయకులు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి కేసులు ఎన్ని చూడలేదు. డక్కాముక్కీలు తిన్న నాయకుడు అంటూ జగన్ను కొందరు నాయకులు ప్రశంసించడం.. కేసులు నమోదు కావడం కూడా.. ఒక గొప్ప ఘన కార్యంగా వారు భావించడం.. గమనార్హం. తాజాగా మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి ఇతర నాయకుల వరకు కూడా జగన్ పై నమోదైన కేసులను లైట్ తీసుకున్నారు. ఇవి కోర్టుల్లో నిలబడే కేసులు కావని.. వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఉద్దేశ పూర్వకంగా.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వీటిని నమోదు చేశారని చెప్పుకొచ్చారు.
ఇక, మరో అడుగు ముందుకు వేసి.. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే.. రఘురామ ఇలా జగన్పై కేసులు పెట్టారని కాకాని వ్యాఖ్యానించారు. “మంత్రివర్గంలో చోటు కోసం కొందరు ప్రయత్నించారు. అది రాలేదు. ఇలా చేస్తే అయినా.. వచ్చే సారి దక్కుతుందని ఆశ ఉండొచ్చు.
చంద్రబాబు ఆనందం కోసం.. ఆయన కళ్లలో సంతోషం కోసమే.. ఇప్పుడు ఇలా కేసులు పెట్టాడు. ఇవన్నీ.. జగన్కు కొత్తకాదు. అనేక కేసులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వీళ్లను చూసి భయపడతాడా?” అని కాకాని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, ఆయన పరివారం శునకానందం పొందుతున్నారని.. వారిని అలానే పొందాలని తాను కోరుతున్నానని వ్యాఖ్యానించారు.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…