Political News

జ‌గ‌న్‌ పై కేసు.. లైట్ తీసుకున్న వైసీపీ!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై తాజాగా గుంటూరు పోలీసులు ఐపీసీ సెక్ష‌న్ 307(హ‌త్యాయ‌త్నం) స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. వైసీపీ మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత టీడీపీ ఉండి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. జ‌గ‌న్‌పై హత్యాయ‌త్నం.. నిర్బంధం స‌హా.. ఇత‌ర సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే.

అయితే.. సాధార‌ణంగా ఇలా ఒక మాజీ సీఎంపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు కావ‌డం.. ఎఫ్ ఐఆర్ లోనూ ఆయ‌న పేరు ఉండ‌డం ఇదే తొలిసారి. ఇది నిజంగానే వైసీపీ ఉలిక్కి ప‌డాల్సిన విష‌యం. కానీ, ఆ పార్టీలో ఎలాంటి జంకు క‌నిపించ‌లేదు.

అంతేకాదు..జ‌గ‌న్‌కు ఇవ‌న్నీ ఒక లెక్కా అని నాయ‌కులు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి కేసులు ఎన్ని చూడ‌లేదు. డ‌క్కాముక్కీలు తిన్న నాయ‌కుడు అంటూ జ‌గ‌న్‌ను కొంద‌రు నాయ‌కులు ప్ర‌శంసించ‌డం.. కేసులు న‌మోదు కావ‌డం కూడా.. ఒక గొప్ప ఘ‌న కార్యంగా వారు భావించ‌డం.. గ‌మ‌నార్హం. తాజాగా మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి నుంచి ఇత‌ర నాయ‌కుల వ‌ర‌కు కూడా జ‌గ‌న్ పై న‌మోదైన కేసులను లైట్ తీసుకున్నారు. ఇవి కోర్టుల్లో నిల‌బ‌డే కేసులు కావ‌ని.. వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఉద్దేశ పూర్వ‌కంగా.. క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే వీటిని న‌మోదు చేశార‌ని చెప్పుకొచ్చారు.

ఇక‌, మ‌రో అడుగు ముందుకు వేసి.. చంద్ర‌బాబు క‌ళ్ల‌లో ఆనందం కోస‌మే.. ర‌ఘురామ ఇలా జ‌గ‌న్‌పై కేసులు పెట్టార‌ని కాకాని వ్యాఖ్యానించారు. “మంత్రివ‌ర్గంలో చోటు కోసం కొంద‌రు ప్ర‌య‌త్నించారు. అది రాలేదు. ఇలా చేస్తే అయినా.. వ‌చ్చే సారి ద‌క్కుతుంద‌ని ఆశ ఉండొచ్చు.

చంద్ర‌బాబు ఆనందం కోసం.. ఆయ‌న క‌ళ్ల‌లో సంతోషం కోస‌మే.. ఇప్పుడు ఇలా కేసులు పెట్టాడు. ఇవ‌న్నీ.. జ‌గ‌న్‌కు కొత్త‌కాదు. అనేక కేసులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వీళ్ల‌ను చూసి భ‌య‌ప‌డ‌తాడా?” అని కాకాని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు కూడా ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు, ఆయ‌న ప‌రివారం శునకానందం పొందుతున్నార‌ని.. వారిని అలానే పొందాల‌ని తాను కోరుతున్నాన‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on July 14, 2024 10:12 am

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

2 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

3 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

3 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

4 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

6 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

6 hours ago