Political News

జ‌గ‌న్‌ పై కేసు.. లైట్ తీసుకున్న వైసీపీ!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై తాజాగా గుంటూరు పోలీసులు ఐపీసీ సెక్ష‌న్ 307(హ‌త్యాయ‌త్నం) స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. వైసీపీ మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత టీడీపీ ఉండి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. జ‌గ‌న్‌పై హత్యాయ‌త్నం.. నిర్బంధం స‌హా.. ఇత‌ర సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే.

అయితే.. సాధార‌ణంగా ఇలా ఒక మాజీ సీఎంపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు కావ‌డం.. ఎఫ్ ఐఆర్ లోనూ ఆయ‌న పేరు ఉండ‌డం ఇదే తొలిసారి. ఇది నిజంగానే వైసీపీ ఉలిక్కి ప‌డాల్సిన విష‌యం. కానీ, ఆ పార్టీలో ఎలాంటి జంకు క‌నిపించ‌లేదు.

అంతేకాదు..జ‌గ‌న్‌కు ఇవ‌న్నీ ఒక లెక్కా అని నాయ‌కులు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి కేసులు ఎన్ని చూడ‌లేదు. డ‌క్కాముక్కీలు తిన్న నాయ‌కుడు అంటూ జ‌గ‌న్‌ను కొంద‌రు నాయ‌కులు ప్ర‌శంసించ‌డం.. కేసులు న‌మోదు కావ‌డం కూడా.. ఒక గొప్ప ఘ‌న కార్యంగా వారు భావించ‌డం.. గ‌మ‌నార్హం. తాజాగా మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి నుంచి ఇత‌ర నాయ‌కుల వ‌ర‌కు కూడా జ‌గ‌న్ పై న‌మోదైన కేసులను లైట్ తీసుకున్నారు. ఇవి కోర్టుల్లో నిల‌బ‌డే కేసులు కావ‌ని.. వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఉద్దేశ పూర్వ‌కంగా.. క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే వీటిని న‌మోదు చేశార‌ని చెప్పుకొచ్చారు.

ఇక‌, మ‌రో అడుగు ముందుకు వేసి.. చంద్ర‌బాబు క‌ళ్ల‌లో ఆనందం కోస‌మే.. ర‌ఘురామ ఇలా జ‌గ‌న్‌పై కేసులు పెట్టార‌ని కాకాని వ్యాఖ్యానించారు. “మంత్రివ‌ర్గంలో చోటు కోసం కొంద‌రు ప్ర‌య‌త్నించారు. అది రాలేదు. ఇలా చేస్తే అయినా.. వ‌చ్చే సారి ద‌క్కుతుంద‌ని ఆశ ఉండొచ్చు.

చంద్ర‌బాబు ఆనందం కోసం.. ఆయ‌న క‌ళ్ల‌లో సంతోషం కోస‌మే.. ఇప్పుడు ఇలా కేసులు పెట్టాడు. ఇవ‌న్నీ.. జ‌గ‌న్‌కు కొత్త‌కాదు. అనేక కేసులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వీళ్ల‌ను చూసి భ‌య‌ప‌డ‌తాడా?” అని కాకాని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు కూడా ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు, ఆయ‌న ప‌రివారం శునకానందం పొందుతున్నార‌ని.. వారిని అలానే పొందాల‌ని తాను కోరుతున్నాన‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on July 14, 2024 10:12 am

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

19 minutes ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

1 hour ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

1 hour ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

2 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

3 hours ago