తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ నుంచి దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు ఖాళీ అవుతున్నా రు. ఇప్పటికే పది మంది బయటకు వచ్చేయగా.. వారిని కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుంది.
సీఎం రేవంత్ రెడ్డి ఆద్వర్యంలో వారిని పార్టీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో ఐదుగురు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కూడా వెయిటింగ్ లిస్టులో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక, ఎమ్మెల్సీలు కూడా.. క్యూ కట్టిన విషయం తెలిసిందే.
ఇక, ఇప్పుడు తాజాగా శేరిలింగంపల్లి బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సైతం కండువా మార్చేశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి తన అనుచరులతో వచ్చిన గాంధీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
గాంధీ సహా ఆయన అనుచరులకు రేవంత్ రెడ్డి.. పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీతో పాటు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ ఎస్ కార్పొరేటర్లు, గాంధీ అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
పార్టీ మారిన వారిలో కీలకమైన శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఇదిలావుంటే, అరికపూడి గాంధీ చేరిక వ్యవహారం గత వారం నుంచి రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బీఆర్ ఎస్ నాయకులు ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.
This post was last modified on July 13, 2024 6:31 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…