టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రులకు కీలక సూచనలు చేశా రు. గుంటూరులోని కొలనుకొండలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. అనంతరం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆయన పాల్గొన్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను చంద్రబాబు పలకించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
అయితే.. చంద్రబాబు పార్టీ కార్యాలయానికి చేరుకోగానే.. పొలోమని నాయకులు భారీ సంఖ్యలో ఆయనకు పుష్పగుచ్ఛాలు సమర్పించారు. కొందరు కాళ్లకు మొక్కారు. దీంతో చంద్రబాబు ఒకింత అనీజీ ఫీలయ్యారు.
అనంతరం.. చంద్రబాబు మాట్లాడుతూ.. తన వద్దకు వచ్చే వారు ఇక నుంచి పూలు, బొకేలు, దండలు తీసుకురావద్దని సూచించారు. వీటి స్థానంలో పుస్తకాలు తీసుకురావాలని.. వాటిని పిల్లలకు తానే స్వయం గా పంచిపెడతానని తెలిపారు. ఇదొక సంప్రదాయంగా అలవరుచుకోవాలని సూచించారు.
అంతేకాదు.. మరో కీలక ప్రకటన కూడా చేశారు. తన పాదాలకు ఎవరూ మొక్కొద్దని చంద్రబాబు గట్టిగానే చెప్పారు. కాళ్లకు మొక్కితే ఏమొస్తుందని ప్రశ్నించారు. ఇక నుంచి ఎవరైనా తన కాళ్లకుకానీ, పాదాలకు కానీ, మొక్కితే..తాను కూడా తిరిగి మొక్కుతానని చెప్పారు.
అలా.. తనతో కాళ్లు మొక్కించుకోవాలని కోరిక ఉన్నవారు మాత్రమే కాళ్లకు మొక్కాలని వ్యాఖ్యానించారు. పరస్పరం అభినందించుకోవడం తప్పుకాదన్న సీఎం.. రాచరిక ధోరణలు ఇకపై వద్దని సూచించారు. మరి ఎంత మంది అధినేత మాట వింటారో చాడాలి.
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…