Political News

కాళ్ల‌కు ద‌ణ్ణాలొద్దు.. :చంద్ర‌బాబు హిత‌వు

టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు త‌న పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, మంత్రుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశా రు. గుంటూరులోని కొల‌నుకొండ‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చంద్ర‌బాబు.. అనంత‌రం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ప్ర‌జాద‌ర్బార్‌లో ఆయన పాల్గొన్నారు. ప‌లు ప్రాంతాల నుంచి వ‌చ్చిన ప్ర‌జ‌లను చంద్ర‌బాబు ప‌ల‌కించారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. వారి నుంచి విన‌తి ప‌త్రాలు స్వీక‌రించారు.

అయితే.. చంద్ర‌బాబు పార్టీ కార్యాల‌యానికి చేరుకోగానే.. పొలోమని నాయ‌కులు భారీ సంఖ్య‌లో ఆయ‌న‌కు పుష్ప‌గుచ్ఛాలు స‌మ‌ర్పించారు. కొంద‌రు కాళ్ల‌కు మొక్కారు. దీంతో చంద్ర‌బాబు ఒకింత అనీజీ ఫీల‌య్యారు.

అనంత‌రం.. చంద్ర‌బాబు మాట్లాడుతూ.. తన వ‌ద్ద‌కు వ‌చ్చే వారు ఇక నుంచి పూలు, బొకేలు, దండ‌లు తీసుకురావ‌ద్ద‌ని సూచించారు. వీటి స్థానంలో పుస్త‌కాలు తీసుకురావాల‌ని.. వాటిని పిల్ల‌ల‌కు తానే స్వ‌యం గా పంచిపెడ‌తాన‌ని తెలిపారు. ఇదొక సంప్ర‌దాయంగా అల‌వ‌రుచుకోవాల‌ని సూచించారు.

అంతేకాదు.. మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న కూడా చేశారు. త‌న పాదాల‌కు ఎవ‌రూ మొక్కొద్ద‌ని చంద్ర‌బాబు గ‌ట్టిగానే చెప్పారు. కాళ్ల‌కు మొక్కితే ఏమొస్తుంద‌ని ప్ర‌శ్నించారు. ఇక నుంచి ఎవ‌రైనా త‌న కాళ్ల‌కుకానీ, పాదాల‌కు కానీ, మొక్కితే..తాను కూడా తిరిగి మొక్కుతాన‌ని చెప్పారు.

అలా.. త‌న‌తో కాళ్లు మొక్కించుకోవాల‌ని కోరిక ఉన్న‌వారు మాత్ర‌మే కాళ్ల‌కు మొక్కాల‌ని వ్యాఖ్యానించారు. ప‌ర‌స్ప‌రం అభినందించుకోవ‌డం త‌ప్పుకాదన్న సీఎం.. రాచ‌రిక ధోర‌ణ‌లు ఇక‌పై వ‌ద్ద‌ని సూచించారు. మ‌రి ఎంత మంది అధినేత మాట వింటారో చాడాలి.

This post was last modified on July 13, 2024 4:55 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

2 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

2 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

3 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

3 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

4 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

5 hours ago