Political News

జ‌గ‌న్‌.. ‘ఇస్కాన్‌’ను కూడా వేధించారా? వెలుగులోకి సంచ‌ల‌నం

వైసీపీ హ‌యాంలో రాజ‌కీయ వేధింపులు అంద‌రికీ తెలిసిందే. ప్ర‌తిప‌క్ష నాయకుల అరెస్టులు, అధినేత‌ల ను జైల్లో పెట్టిన వ్య‌వ‌హారం కూడా అంద‌రికీ తెలిసిందే. ఇక‌, భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను కూడా ప్ర‌భుత్వం హ‌రించింద‌నే వాద‌న వినిపించింది. అయితే.. తాజాగా ఒక సంచ‌ల‌న విష‌యం వెలుగు చూసింది. చీమ‌కు సైతం హాని త‌ల‌పెట్ట‌ని హ‌రేకృష్ణ సేవా స‌మితిని కూడా వైసీపీ ప్ర‌భుత్వం వేధించింద‌ట‌. 2014-19 మధ్య అనంత‌పురం ప్రాంతంలోని పెనుగొండ‌లో ఇస్కాన్ ఆధ్వ‌ర్యంలోని హ‌రేకృష్ణ నిర్వాహ‌కుల‌కు అప్ప‌టి ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఒక బిగ్ టాస్క్ అప్ప‌గించారు.

108 అడుగుల ఏక‌శిల ల‌క్ష్మీన‌ర‌సింహ‌ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసి ఆల‌యాన్ని నిర్మించాల‌ని చంద్ర‌బాబు అప్ప‌ట్లో కోరారు. బెంగ‌ళూరు నుంచి కేవ‌లం 1 గంట‌లో ఇక్క‌డ‌కు చేరుకునే అవ‌కాశం ఉండ‌డంతోపాటు.. అనంత‌పురంలో ప్ర‌ఖ్యాత ఖాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యంతోపాటు.. దీనిని కూడా ప్రాశ‌స్త్యంలోకి తీసుకురావాల‌ని భావించారు. అయితే.. త‌ర్వాత వ‌చ్చిన జ‌గ‌న్ స‌ర్కారు ఇస్కాన్ నిర్వాహ‌కుల‌ను వేధించి.. వారు ఆల‌యాన్ని క‌ట్ట‌కుండా అడ్డుప‌డింద‌నే విష‌యం తాజాగా వెలుగు చూసింది.

“2019లో మీరు మా ఇస్కాన్‌కి, ఒక బాధ్యత అప్పగించారు. పెనుగొండలో 108 అడుగుల ఏక రాతి విగ్రహంతో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిర్మించమన్నారు. ఇప్పుడు మీకు మాటిస్తున్నాం, మీరు అప్పగించిన బాధ్యతని, వచ్చే 3 ఏళ్ళలో పూర్తి చేస్తామని ఇస్కాన్ తరపున మాట ఇస్తున్నాం” అని అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు మధుపండిత్ వెల్ల‌డించారు.

ఇక‌, దీనిపై చంద్ర‌బాబు మాట్లాడుతూ.. “పెనుగొండలో 108 అడుగుల ఏక రాతి విగ్రహంతో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిర్మాణానికి నాడు ఇస్కాన్ ముందుకు వస్తే, తరువాత వచ్చిన ప్రభుత్వం, దాన్ని కూడా రద్దు చేసింది. మంచి కార్యక్రమాలని అడ్డుకోవటమే, గత 5 ఏళ్ళలో జరిగింది. ఇక అలాంటి పరిస్థితి నేడు ఆంధ్రప్రదేశ్ లో లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరినీ స్వాగతం పలుకుతున్నా” అని చంద్ర‌బాబు వెల్ల‌డించారు. మొత్తానికి ఇస్కాన్‌ను కూడా జ‌గ‌న్ వేధించార‌నే విష‌యం వెలుగు చూసింది.

This post was last modified on July 13, 2024 4:52 pm

Share
Show comments
Published by
Satya
Tags: ISCKON

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

3 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

4 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

4 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

4 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

5 hours ago