Political News

జ‌గ‌న్‌.. ‘ఇస్కాన్‌’ను కూడా వేధించారా? వెలుగులోకి సంచ‌ల‌నం

వైసీపీ హ‌యాంలో రాజ‌కీయ వేధింపులు అంద‌రికీ తెలిసిందే. ప్ర‌తిప‌క్ష నాయకుల అరెస్టులు, అధినేత‌ల ను జైల్లో పెట్టిన వ్య‌వ‌హారం కూడా అంద‌రికీ తెలిసిందే. ఇక‌, భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను కూడా ప్ర‌భుత్వం హ‌రించింద‌నే వాద‌న వినిపించింది. అయితే.. తాజాగా ఒక సంచ‌ల‌న విష‌యం వెలుగు చూసింది. చీమ‌కు సైతం హాని త‌ల‌పెట్ట‌ని హ‌రేకృష్ణ సేవా స‌మితిని కూడా వైసీపీ ప్ర‌భుత్వం వేధించింద‌ట‌. 2014-19 మధ్య అనంత‌పురం ప్రాంతంలోని పెనుగొండ‌లో ఇస్కాన్ ఆధ్వ‌ర్యంలోని హ‌రేకృష్ణ నిర్వాహ‌కుల‌కు అప్ప‌టి ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఒక బిగ్ టాస్క్ అప్ప‌గించారు.

108 అడుగుల ఏక‌శిల ల‌క్ష్మీన‌ర‌సింహ‌ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసి ఆల‌యాన్ని నిర్మించాల‌ని చంద్ర‌బాబు అప్ప‌ట్లో కోరారు. బెంగ‌ళూరు నుంచి కేవ‌లం 1 గంట‌లో ఇక్క‌డ‌కు చేరుకునే అవ‌కాశం ఉండ‌డంతోపాటు.. అనంత‌పురంలో ప్ర‌ఖ్యాత ఖాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యంతోపాటు.. దీనిని కూడా ప్రాశ‌స్త్యంలోకి తీసుకురావాల‌ని భావించారు. అయితే.. త‌ర్వాత వ‌చ్చిన జ‌గ‌న్ స‌ర్కారు ఇస్కాన్ నిర్వాహ‌కుల‌ను వేధించి.. వారు ఆల‌యాన్ని క‌ట్ట‌కుండా అడ్డుప‌డింద‌నే విష‌యం తాజాగా వెలుగు చూసింది.

“2019లో మీరు మా ఇస్కాన్‌కి, ఒక బాధ్యత అప్పగించారు. పెనుగొండలో 108 అడుగుల ఏక రాతి విగ్రహంతో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిర్మించమన్నారు. ఇప్పుడు మీకు మాటిస్తున్నాం, మీరు అప్పగించిన బాధ్యతని, వచ్చే 3 ఏళ్ళలో పూర్తి చేస్తామని ఇస్కాన్ తరపున మాట ఇస్తున్నాం” అని అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు మధుపండిత్ వెల్ల‌డించారు.

ఇక‌, దీనిపై చంద్ర‌బాబు మాట్లాడుతూ.. “పెనుగొండలో 108 అడుగుల ఏక రాతి విగ్రహంతో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిర్మాణానికి నాడు ఇస్కాన్ ముందుకు వస్తే, తరువాత వచ్చిన ప్రభుత్వం, దాన్ని కూడా రద్దు చేసింది. మంచి కార్యక్రమాలని అడ్డుకోవటమే, గత 5 ఏళ్ళలో జరిగింది. ఇక అలాంటి పరిస్థితి నేడు ఆంధ్రప్రదేశ్ లో లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరినీ స్వాగతం పలుకుతున్నా” అని చంద్ర‌బాబు వెల్ల‌డించారు. మొత్తానికి ఇస్కాన్‌ను కూడా జ‌గ‌న్ వేధించార‌నే విష‌యం వెలుగు చూసింది.

Satya

Recent Posts

రామ్ చరణ్ 17… లాంగ్ వెయిటింగ్ తప్పదు

పెద్ది విజయాన్ని ఆస్వాదిస్తున్న రామ్ చరణ్ త్వరలోనే చేతికి కీలకమైన సర్జరీ చేయించుకోబోతున్నాడు. ప్రమోషన్ల కోసమే దాన్ని బ్రేక్ వేస్తూ…

2 hours ago

వరలక్ష్మి మీద మళ్ళీ ఆరోపణలు

ఆ మధ్య ఎస్ సరస్వతి సినిమా విడుదల టైంలో దర్శక నిర్మాత వరలక్ష్మి శరత్ కుమార్, రచయిత సాయి మాధవ్…

2 hours ago

బొంబాయి మాఫియాలో ‘బాలయ్య’ మాస్

వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని మళ్ళీ చేతులు కలిపారు. ప్రారంభం కావడంలో కొంత…

2 hours ago

‘దురంధర్’ చూసిన కళ్ళకు ‘ఆల్ఫా’ నచ్చేనా

ఎవరు ఔనన్నా కాదన్నా బాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమాగా దురంధర్ పేరు…

4 hours ago

అమరావతిలో రూ.2.5 వేల కోట్ల కేంద్ర ప్రాజెక్టు

అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా కాకుండా చేయడం ఇక ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక వేళ కూటమి…

5 hours ago

మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్‌.. వైసీపీకి ఇర‌కాటం.. !

నెల్లూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్ రాజకీయాలు పార్టీని, వారి కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురిచేస్తున్నాయి.…

7 hours ago