వైసీపీ హయాంలో రాజకీయ వేధింపులు అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష నాయకుల అరెస్టులు, అధినేతల ను జైల్లో పెట్టిన వ్యవహారం కూడా అందరికీ తెలిసిందే. ఇక, భావప్రకటనా స్వేచ్ఛను కూడా ప్రభుత్వం హరించిందనే వాదన వినిపించింది. అయితే.. తాజాగా ఒక సంచలన విషయం వెలుగు చూసింది. చీమకు సైతం హాని తలపెట్టని హరేకృష్ణ సేవా సమితిని కూడా వైసీపీ ప్రభుత్వం వేధించిందట. 2014-19 మధ్య అనంతపురం ప్రాంతంలోని పెనుగొండలో ఇస్కాన్ ఆధ్వర్యంలోని హరేకృష్ణ నిర్వాహకులకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక బిగ్ టాస్క్ అప్పగించారు.
108 అడుగుల ఏకశిల లక్ష్మీనరసింహ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆలయాన్ని నిర్మించాలని చంద్రబాబు అప్పట్లో కోరారు. బెంగళూరు నుంచి కేవలం 1 గంటలో ఇక్కడకు చేరుకునే అవకాశం ఉండడంతోపాటు.. అనంతపురంలో ప్రఖ్యాత ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు.. దీనిని కూడా ప్రాశస్త్యంలోకి తీసుకురావాలని భావించారు. అయితే.. తర్వాత వచ్చిన జగన్ సర్కారు ఇస్కాన్ నిర్వాహకులను వేధించి.. వారు ఆలయాన్ని కట్టకుండా అడ్డుపడిందనే విషయం తాజాగా వెలుగు చూసింది.
“2019లో మీరు మా ఇస్కాన్కి, ఒక బాధ్యత అప్పగించారు. పెనుగొండలో 108 అడుగుల ఏక రాతి విగ్రహంతో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిర్మించమన్నారు. ఇప్పుడు మీకు మాటిస్తున్నాం, మీరు అప్పగించిన బాధ్యతని, వచ్చే 3 ఏళ్ళలో పూర్తి చేస్తామని ఇస్కాన్ తరపున మాట ఇస్తున్నాం” అని అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు మధుపండిత్ వెల్లడించారు.
ఇక, దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. “పెనుగొండలో 108 అడుగుల ఏక రాతి విగ్రహంతో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిర్మాణానికి నాడు ఇస్కాన్ ముందుకు వస్తే, తరువాత వచ్చిన ప్రభుత్వం, దాన్ని కూడా రద్దు చేసింది. మంచి కార్యక్రమాలని అడ్డుకోవటమే, గత 5 ఏళ్ళలో జరిగింది. ఇక అలాంటి పరిస్థితి నేడు ఆంధ్రప్రదేశ్ లో లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరినీ స్వాగతం పలుకుతున్నా” అని చంద్రబాబు వెల్లడించారు. మొత్తానికి ఇస్కాన్ను కూడా జగన్ వేధించారనే విషయం వెలుగు చూసింది.
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…